Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి కనిపించడంలేదు

Published Mon, Apr 16 2018 1:22 AM

Kadiyam srihari commented on congress  - Sakshi

శాయంపేట (భూపాలపల్లి): ‘కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదు.. వారికి కేవలం సీఎం కుర్చీ మాత్రమే కనిపిస్తోంది’అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. ఆదివారం ఆయన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట శివారులోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అలాగే మండల కేంద్రంలో నిర్మించిన బస్టాండ్, ఆరెపల్లిలో మార్కెట్‌ గోదాంను స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ బస్సు, పాదయాత్రలతో మళ్లీ అధికారంలోకి వచ్చి దోచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement