Sakshi News home page

టీడీపీ నాయకుల కక్ష సాధింపు

Published Sun, Apr 14 2019 11:13 AM

TDP Leaders Attack On YSRCP Leader Vehicles - Sakshi

ధర్మవరం రూరల్‌: టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేసిన వారందరిపైనా కక్ష తీర్చుకోవాలని పథక రచన చేస్తున్నారు. అందులో భాగంగా దౌర్జన్యాలకు దిగుతున్నారు. శనివారం ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో రైల్వే కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగశేషుకు చెందిన ఇటాచి, రెండు హైజర్స్‌(కంకర కలిపే యంత్రాలు) అద్దాలు, గేర్‌బాక్స్‌లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడు నాగశేషు ధర్మవరం రూరల్, బత్తలపల్లి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.4లక్షల దాకా ఆస్తి నష్టం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదాపురం సూరి ఆగడాలు నచ్చక తాను తన అనుచరులతో కలిసి ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. దీంతో కొంతమంది కక్ష కట్టి తన ఆస్తులను పథకం ప్రకారం ధ్వంసం చేయడానికి పథక రచన చేశారన్నారు. అందులో భాగంగా తుమ్మల సమీపంలో రైల్వే పనులు చేస్తున్న రెండు హైజర్స్‌ అద్దాలను, గేర్‌ బాక్స్‌లను ధ్వంసం చేశారన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి పనులు చేసి ఓటర్లను ఆకర్షించుకోవాలేగానీ వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. తన ఆస్తులను ధ్వంసం చేసిన వారి పేర్లను కూడా త్వరలోనే బయటపెడతానని చెప్పారు. 

Advertisement

What’s your opinion

Advertisement