గుహ వ్యాఖ్యలపై గావస్కర్
న్యూఢిల్లీ: క్రికెట్ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలను సునీల్ గావస్కర్ తిప్పికొట్టారు. తన నిజాయితీని శంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయని అన్నారు. తాను పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను కలిగి ఉన్నట్లు ప్రవర్తించిన ఒక్క సంఘటనైనా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తన కామెంటరీ ద్వారా సెలక్షన్ ప్యానల్ను ప్రభావితం చేసినట్లు రుజువు చేయాలని గుహను సూటిగా అడిగారు. ‘గుహ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా నిరాశపరిచాయి. భారత క్రికెట్ నాకెంతో చేసింది. నా వంతుగా క్రికెట్ అభివృద్ధిలో సహకరిస్తున్నాను.
కానీ ఇలా నా నిజాయితీనే శంకించడం నన్ను బాధించింది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాన్ని నాకు ఆపాదించడం సరికాదు. నాకు వ్యతిరేకంగా గుహ వ్యాఖ్యలు చేయడం వెనుక ఇంకా ఏదో ఉంది’ అని గావస్కర్ వివరించారు. ధోని, కోహ్లి, కుంబ్లేలపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన వ్యతిరేకించారు. ‘ధోని అద్భుతమైన క్రికెటర్. గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్టు పొందే హక్కు అతనికి ఉంది. భారత క్రికెట్కు ధోని చేసిన సేవలను ఎలా ప్రశ్నిస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో సూపర్స్టార్ సంస్కృతి ఉందని గుహ అభిప్రాయపడితే ఇక్కడ ఇతరులపై అసూయపడే సంస్కృతి కూడా ఉన్నట్లేనని అన్నారు.
Related news
-
T20 WC: దుమ్ములేపుతున్నాడు.. సెలక్టర్లు అతడిని గుర్తుంచుకోవాలి!
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్లు పూర్తి కాగా.. రాజస్తాన్ రాయల్స్ ఐదింట నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాత కథనే పునరావృతం చేస్తూ ఐదింటి నాలుగు పరాజయాలతో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ పూర్తైన దాదాపు ఐదు రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో సీజన్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుందన్న నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాటల్లో వరుస హాఫ్ సెంచరీలు బాదుతున్న యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ను గుర్తుపెట్టుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో గత 15 ఇన్నింగ్స్లో పరాగ్ ఏకంగా 170.7 స్ట్రైక్రేటుతో 771 పరుగులు సాధించాడు. 15 ఇన్నింగ్స్లో పది హాఫ్ సెంచరీలు వరుసగా 45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా పది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడిపై సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచాలి. ఇక అతడేమో తన పనిని ఇలాగే చేసుకుపోతూ ఉంటే మంచిది’’ అని రియాన్ పరాగ్ మున్ముందు కూడా ఇలాగే దూసుకుపోవాలని ఆకాంక్షించాడు. అసోం తరఫున దేశవాళీ క్రికెట్లో కాగా అసోంలోని గువాహటిలో 2001లో జన్మించిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ హిట్టింగ్లో దిట్ట. అలాగే రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ కూడా! ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో రాణిస్తున్న రియాన్ పరాగ్ ఇంత వరకు టీమిండియాకు సెలక్ట్ కాలేదు. రాజస్తాన్ తరఫున దుమ్ములేపుతూ అయితే, ఐపీఎల్-2024లో మాత్రం అతడి ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించేలా ఉంది. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్లో కలిపి 261 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రియాన్ పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్లో రాజస్తాన్ గుజరాత్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 చదవండి: సంజూ శాంసన్కు భారీ జరిమానా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై గెలిచేది: టీమిండియా దిగ్గజం
IPL 2024- MI Vs RR: ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్కటీ గెలవలేక హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు.అతడి చెత్త నిర్ణయాల కారణంగా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా పదిహేడో ఎడిషన్లో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.ఈ మూడింటిలో టైటాన్స్తో మ్యాచ్లో మాత్రమే ముంబై కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సన్రైజర్స్తో మ్యాచ్లో బౌలర్లు తేలిపోగా.. రాజస్తాన్తో మ్యాచ్లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్తాన్ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1— IndianPremierLeague (@IPL) April 1, 2024ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుతో లేకపోవడం ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ అన్నాడు. అతడు గనుక అందుబాటులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేసేవాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.‘‘ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సేవలను కచ్చితంగా మిస్ అవుతోంది. సూర్యకుమార్ ఉంటే మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కానీ ప్రస్తుతం అతడు జట్టుతో లేడు.అతడు త్వరగా తిరిగి రావాలని ముంబై ఇండియన్స్ బహుశా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉంటే కచ్చితంగా ఫలితాలను తారుమారుచేయగలడు. అతడొక గేమ్ గేమ్ చేంజర్’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు..@rajasthanroyals’ Lethal Start 🔥They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger 👏After 7 overs, it is 58/4Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV— IndianPremierLeague (@IPL) April 1, 2024కాగా ముంబై ఇండియన్స్ టాపార్డర్కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముక లాంటివాడు. ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఈ టీమిండియా స్టార్.. ఈ ఏడాది జనవరిలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అయితే, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.ఇక గత సీజన్లో రోహిత్ శర్మకు బదులు కొన్ని మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్-2023లో మొత్తంగా ఆడిన 16 మ్యాచ్లో 605 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోని సమయంలో టీమిండియాకు కూడా సారథిగా వ్యవహరించి జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం.చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా -
గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై గెలిచేది: టీమిండియా దిగ్గజం
IPL 2024- MI Vs RR: ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్కటీ గెలవలేక హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. అతడి చెత్త నిర్ణయాల కారణంగా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా పదిహేడో ఎడిషన్లో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ మూడింటిలో టైటాన్స్తో మ్యాచ్లో మాత్రమే ముంబై కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సన్రైజర్స్తో మ్యాచ్లో బౌలర్లు తేలిపోగా.. రాజస్తాన్తో మ్యాచ్లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్తాన్ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎 Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏 Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1 — IndianPremierLeague (@IPL) April 1, 2024 ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుతో లేకపోవడం ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ అన్నాడు. అతడు గనుక అందుబాటులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేసేవాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘‘ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సేవలను కచ్చితంగా మిస్ అవుతోంది. సూర్యకుమార్ ఉంటే మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కానీ ప్రస్తుతం అతడు జట్టుతో లేడు. అతడు త్వరగా తిరిగి రావాలని ముంబై ఇండియన్స్ బహుశా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉంటే కచ్చితంగా ఫలితాలను తారుమారుచేయగలడు. అతడొక గేమ్ గేమ్ చేంజర్’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. .@rajasthanroyals’ Lethal Start 🔥 They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger 👏 After 7 overs, it is 58/4 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV — IndianPremierLeague (@IPL) April 1, 2024 కాగా ముంబై ఇండియన్స్ టాపార్డర్కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముక లాంటివాడు. ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఈ టీమిండియా స్టార్.. ఈ ఏడాది జనవరిలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అయితే, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఇక గత సీజన్లో రోహిత్ శర్మకు బదులు కొన్ని మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్-2023లో మొత్తంగా ఆడిన 16 మ్యాచ్లో 605 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోని సమయంలో టీమిండియాకు కూడా సారథిగా వ్యవహరించి జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB Vs KKR: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు?
IPL 2024 RCB vs KKR: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల తీరును టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ విమర్శించాడు. ప్రతిసారి విరాట్ కోహ్లి ఒక్కడి మీదే ఆధారపడితే ఫలితం ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లి ఒక్కడు ఎంతని పోరాడగలడంటూ చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ రెండో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. అనంతరం సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో జయభేరి మోగించింది. అయితే, అదే జోరును కొనసాగించలేక చతికిలపడింది. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. ఆరంభంలోనే ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(8) వికెట్ కోల్పోయింది. King Kohli in his Kingdom! 🥵🤌#RCBvsKKR pic.twitter.com/c8kgfXdWHS — OneCricket (@OneCricketApp) March 29, 2024 మరో ఓపెనర్ విరాట్ కోహ్లి(59 బంతుల్లో 83- నాటౌట్) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా.. ఇతరుల నుంచి పెద్దగా సహకారం అందలేదు. వన్డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 33 పరుగులతో పర్వాలేదనిపించగా.. గ్లెన్ మాక్స్వెల్ మెరుపులు(19 బంతుల్లో 23) కాసేపు అలరించాయి. ఇక రజత్ పాటిదార్(3) మరోసారి నిరాశపరచగా.. అనూజ్ రావత్(3) సైతం చేతులెత్తేశాడు. ఆఖర్లో దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 20) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేయగలిగింది ఆర్సీబీ. అయితే, కేకేఆర్ బ్యాటర్లు దంచికొట్టడంతో 16.5 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఒక్కడు ఎంతని చేయగలడు. అతడికి కనీసం ఒక్కరైనా సహకారం అందించి ఉండే బాగుండేది. ఒకవేళ ఈరోజు తనకు మరో బ్యాటర్ నుంచి సపోర్టు దొరికి ఉంటే 83కు బదులు 120 పరుగులు చేసేవాడు. ఇది ఒక్కడి ఆట కాదు కదా. జట్టుగా ఆడాల్సిన ఆట. కానీ దురదృష్టవశాత్తూ ఈరోజు తనొక్కడే పోరాడాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. మిగతా బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఆర్సీబీ మంచి స్కోరు చేసి ఉండేదని అన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. కాగా ఆర్సీబీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోగా.. ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి గెలిచిన కేకేఆర్ నాలుగు పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు -
#Hardhik pandya: 'బాధపడకు హార్దిక్.. నేను నీకు ఉన్నా'
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తొలి ఓటమి చవిచూశాడు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. బ్యాటింగ్ బౌలింగ్లో తన మార్క్ను హార్దిక్ చూపించలేకపోయాడు. కెప్టెన్సీలో సరైన వ్యూహాలను రచించడంలో పాండ్యా విఫలయ్యాడు. దీంతో హార్దిక్ వల్లే ముంబై ఓడిపోయిందని నెటజన్లు తెగ ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సపోర్ట్గా నిలిచాడు. ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమేనని, ఆటలో గెలుపోటములు సహజం అంటూ గవాస్కర్ ఓదర్చాడు. "హార్దిక్ పాండ్యా నీవు బాధపడకు. ఒక ముంబై ఫ్యాన్గా నేను నీకు సపోర్ట్గా ఉంటాను. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో ఓడిపోవడం ఇదేమి కొత్త కాదు. ప్రతీ సీజన్లో అదే జరుగుతోంది. అప్పుడు మళ్లీ అదే జరిగింది. ఇది కేవలం మీకు మొదటి మ్యాచ్ మాత్రమే. తర్వాత మ్యాచ్లో మీకు అద్బుతమైన కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా" అని మ్యాచ్ అనంతరం గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తమ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్కు అప్పగించిన సంగతి తెలిసిందే.
Related News by category
-
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్ను ఎక్సట్రా ప్లేయర్గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
గోల్ కొట్టిన విరాట్కోహ్లీ.. జస్ట్మిస్
క్రికెట రారాజు విరాట్కోహ్లీ ... ఫుట్బాల్ మైదానంలో సందడి చేశాడు. క్రికెట్ ఆటలో ఎంతో కచ్చితత్వంతో బాల్ని బౌండరీలు దాటించే కోహ్లీ.. అదే తీరుని ఫుట్బాల్ మైదానంలోనూ చూపించాడు. ఆక్సిడెంటల్ క్రాస్బార్ ఛాలెంజ్ పేరుతో చాలా దూరం నుంచి గోల్పోస్ట్కి గురి పెట్టాడు కోహ్లీ. తన నైపుణ్యం అంతా ఉపయోగించి బాల్ని కిక్ చేశాడు. గోల్కీపర్ను తప్పించుకుని గోల్పోస్ట్లో బాల్ పడినట్టే అనిపించింది. అయితే చివరి క్షణంలో గోల్పోస్ట్ పోల్కి బాల్కి అడ్డుగా నిలిచింది. దీంతో గోల్ మిస్ అయ్యింది. క్రికెట్లోనే కాదు ఫుట్బాల్లోనూ కోహ్లీ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు Accidental crossbar challenge 😂 pic.twitter.com/koeSSKGQeb — Virat Kohli (@imVkohli) May 25, 2021 -
ఇంగ్లండ్కు భారీ షాక్: న్యూజిలాండ్తో సిరీస్కు ఆర్చర్ దూరం
లండన్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్ పర్యటన, ఐపీఎల్లకు దూరమైన ఆర్చర్.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది. చదవండి: శ్రీలంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్లో ఈ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్తో సిరీస్లో 3 ఇన్నింగ్స్లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్)
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement