ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న ఏబీ డివిలియర్స్ పరుగుల మోత మోగించాడు. సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. 46 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో చెలరేగి ఆడి 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకవైపు బెంగళూరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో డివిలియర్స్ ఒంటరి పోరాటం చేశాడు. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో కింగ్స్ పంజాబ్ బౌలర్లపై డివిలియర్స్ విరుచుకుపడ్డాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయి ఆడి అభిమానులకు పండుగ చేశాడు. బౌలర్ ఎవరైనా తన సహజసిద్ధమైన ఆట తీరుతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు డివిలియర్స్. ఏబీ బ్యాటింగ్ విన్యాసాలకు కింగ్స్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 18 పరుగులకే ఓపెనర్లు షేన్ వాట్సన్(1), విష్ణు వినోద్(7) వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ.. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో కేదర్ జాదవ్(1)వికెట్ ను నష్టపోయింది. దాంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ఆపై మన్ దీప్ సింగ్(28) కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ స్కోరు బోర్డు కుదుటపడింది. అయినప్పటికీ ఆర్సీబీ రన్ రేట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. అయితే ఆపై ఐదు ఓవర్లలో ఆర్సీబీ స్కోరు మరీ మందగించింది. 15 ఓవర్లలో నాలుగు వికెట్లకు 71 పరుగులు చేసి అత్యల్ప రన్ రేట్ తో ముందుకు సాగింది.
కాగా, డివిలియర్స్ క్రీజ్ లో ఉన్నాడనే ప్రేక్షకుల ధీమాను అతను వమ్ము చేయలేదు. చివరి ఓవర్లలో డివిలియర్స్ బ్యాట్ కు పని చెప్పాడు. బంతి వేయడం సిక్స్ కు తరలించడం అన్న చందంగా సాగింది డివిలియర్స్ బ్యాటింగ్. ఈ క్రమంలోనే 34 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకాన్నిసాధించాడు ఏబీ. ఏబీ హాఫ్ సెంచరీ చేసే సమయానికి 17.0 ఓవర్లు పూర్తవ్వగా, అప్పటికి ఆర్సీబీ స్కోరు 96/4. ఆ తరుణంలో ఏబీ విధ్వంసకర ఆట తీరును ప్రదర్శించాడు. చివరి మూడు ఓవర్లలో డివిలియర్స్ ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఏబీ దూకుడుతో ఆఖరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అతనికి స్టువర్ట్ బిన్నీ(18 నాటౌట్) సహకారం అందివ్వడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
ఏబీ డివిలియర్స్ విశ్వరూపం
Published Mon, Apr 10 2017 9:52 PM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement