న్యూఢిల్లీ: ఐపీఎల్-7కు సంబంధించి గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి అగ్రస్థానం లభించింది. చెన్నై సూపర్కింగ్స్ సారథి ధోని, డాషింగ్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ (ఆర్సీబీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
క్రికెట్ చరిత్రలో సంచలన క్యాచ్ పట్టిన క్రిస్ లిన్ (కేకేఆర్)కు నాలుగో స్థానం దక్కింది. మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న పంజాబ్ బ్యాట్స్మన్ సెహ్వాగ్ ఐదో స్థానం సాధించాడు. గంభీర్, మాక్స్వెల్, క్రిస్ గేల్, రైనా, శిఖర్ ధావన్లు టాప్-10లో చోటు సంపాదించారు. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ కోసం చాలా మంది అభిమానులు గూగుల్లో సెర్చ్ చేయడం విశేషం.
Related news
-
IPL: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన స్టొయినిస్..
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అజేయ శతకంతో చెలరేగిన 34 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్.. పదేళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- లక్నో మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన విజయం సాధించింది. సొంతమైదానంలోనే చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. లక్నో గెలుపులో స్టొయినిస్దే కీలక పాత్ర.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024సీఎస్కే విధించిన 211 లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. తానున్నానంటూ స్టొయినిస్ బ్యాటెత్తాడు.మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్టొయినిస్ ఇన్నింగ్స్లో ఏకంగా 13 ఫోర్లు, 6 సిక్స్లు ఉండటం విశేషం.Maiden #TATAIPL century ✅Highest T20 chase at Chepauk ✅Double over #CSK ✅Highest individual score in an IPL chase ✅#CSKvLSG #TATAIPL #IPLonJioCinema #MarcusStoinis pic.twitter.com/imjZQcLXa7— JioCinema (@JioCinema) April 23, 2024కాగా ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్పై నమోదైన వ్యక్తిగత స్కోరు స్టొయినిస్దే. అంతకు ముందు 2014లో వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై మీద 122 పరుగులు సాధించాడు. నాడు పంజాబ్ కింగ్స్ తరఫున ముంబైలోని వాంఖడే వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్లో సెహ్వాగ్ ఈ మేరకు పరుగులు రాబట్టాడు.అయితే, చెపాక్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో స్టొయినిస్.. సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు.. నికోలస్ పూరన్(34), దీపక్ హుడా(6 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి లక్నోను విజయతీరాలకు చేర్చి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(124*) సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ చరిత్రకెక్కాడు. చదవండి: CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK Vs LSG: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్.. వీడియో వైరల్
‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనికి కోపమొచ్చింది. ‘‘కొట్టేస్తా నిన్ను జాగ్రత్త’’ అన్నట్లుగా ధోని హెచ్చరించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ తలాకు ఎవరిపై కోపమొచ్చింది?ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. సొంతమైదానం చెపాక్ వేదికగా టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ అజింక్య రహానే(1) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. వరుసగా వికెట్లు పడ్డా పట్టుదలగా నిలబడి.. శివం దూబే(66)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.అజేయ శతకం(60 బంతుల్లో 108)తో రాణించి సీఎస్కే 210 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. మార్కస్ స్టొయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్(63 బంతుల్లో 124*) కారణంగా గైక్వాడ్ సెంచరీ వృథాగా పోయింది.లక్నో చేతిలో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సీఎస్కే మ్యాచ్ అంటే అందరి కళ్లు ఎవరి మీద ఉంటాయో తెలిసిందే. ధోని ఒక్కసారి మైదానంలో దిగాడంటే అభిమానులకు పండుగే.ఇక తలాకు సంబంధించిన ప్రతీ మూమెంట్ను తన కన్నుతో బంధించడానికి కెమెరామెన్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ఇంకాస్త ఎక్కువే ధోనిపై ఫోకస్ చేశాడు కెమెరామెన్. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే దంచికొడుతున్న తరుణంలో డ్రెసింగ్రూం నుంచి చూస్తున్న ధోని.. హెయిర్ సెట్ చేసుకుంటుండగా క్యాప్చర్ చేశాడు. దీంతో ఒకింత అసహనానికి గురైన తలా.. బాటిల్ చూపిస్తూ కొట్టేస్తానంటూ కెమెరామెన్ను బెదిరించాడు. MS DHONI reaction after camera man focusing on him 😭😭#CSKvLSG pic.twitter.com/tkdk0CAS9q— 𝕏⁷ (@LuciferianVerse) April 23, 2024గైక్వాడ్- దూబే సూపర్ ఇన్నింగ్స్ ఆడుతుంటే అక్కడ ఫోకస్ చేయకుండా.. నాపై దృష్టి పెడతావేంటి అన్నట్లుగా చిరుకోపం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఈమ్యాచ్లో ధోని ఆరో స్థానంలో వచ్చి ఒకే ఒక్క బంతి ఎదుర్కొని ఫోర్ బాది నాటౌట్గా నిలిచాడు.చదవండి: HBD Sachin Tendulkar: పరుగుల వీరుడి గురించి ఈ విషయాలు తెలుసా?Dhoni to Cameraman 😂😂#MSDhoni #CSKvsLSG #IPL2024 #MSDhoni #ruturajgaikwad pic.twitter.com/ue2b1MxUgH— Tanay (@tanay_chawda1) April 23, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK Vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం!
‘‘ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. అయితే, మ్యాచ్ మాత్రం బాగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడింది. 13- 14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది.అయితే, స్టొయినిస్ గొప్ప ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. పిచ్ మీద తేమ ఎక్కువగా ఉంది. అందుకే మా స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది.అయినా.. ఆటలో ఇవన్నీ సహజమే. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. పవర్ ప్లేలోనే రెండో వికెట్ కోల్పోయిన వేళ జడ్డూ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది.పవర్ ప్లే తర్వాత వికెట్ పడితే శివం దూబేను రంగంలోకి దించాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగానే మా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. మేము ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇంత తేమ కనిపించలేదు. ఏదేమైనా ఎల్ఎస్జీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. వాళ్లు మెరుగ్గా ఆడినందువల్లే పైచేయి సాధించగలిగారు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.ఓటమికి కారణం అదేఇంకాస్త మెరుగైన స్కోరు సాధిస్తే బాగుండేదని.. మార్కస్ స్టొయినిస్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్లో తొలుత లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన సీఎస్కేకు.. సొంత మైదానం చెపాక్లోనూ చేదు అనుభవం ఎదురైంది.తమకు కంచుకోట అయిన చెపాక్లో చెన్నై భారీ స్కోరు సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 108 నాటౌట్)తో దుమ్ములేపగా.. శివం దూబే(27 బంతుల్లో 66) మరోసారి ధనాధన్ దంచికొట్టాడు.What an incredible innings by Ruturaj Gaikwad !! Had people getting out right & left but made sure to be play well & be there right till the end ! A super century as he made 108* today 👏🏻 a true captain's innings!#LSGvsCSK • #RuturajGaikwad • #CSKvLSGpic.twitter.com/YdDSvde6w5— ishaan (@ixxcric) April 23, 2024వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా.. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆదిలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కెప్టెన్ కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే, వన్డౌన్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగాడు. 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్కే ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో నికోలస్ పూరన్ 15 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 19.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసిన లక్నో.. చెన్నై కంచుకోటలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఐదో విజయం అందుకుని టాప్-4లోకి చేరుకుంది.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు. తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. MARCUS STOINIS... THE HULK. 💪 - The winning celebrations from Stoinis and LSG says everything. 🔥pic.twitter.com/iGBHDNWDSU — Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024 -
శివాలెత్తిన శివమ్ దూబే.. వరల్డ్ కప్ టికెట్ పక్కా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పుడూ స్పిన్నర్లను టార్గెట్ చేసే దూబే.. ఈ మ్యాచ్లో మాత్రం లక్నో ఫాస్ట్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా లక్నో పేసర్ యష్ ఠాకూర్ను దూబే ఓ ఆట ఆడుకున్నాడు. 16 ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దూబే.. 3 ఫోర్లు, 7 సిక్స్లతో 66 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దూబేకు టీ20 వరల్డ్కప్ జట్టులో కచ్చితంగా చోటుదక్కుతుందని కామెంట్లు చేస్తున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో దూబే అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన దూబే.. 51.83 సగటుతో 311 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ జట్టులో హార్దిక్ పాండ్యా స్ధానంలో దూబేకు ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. pic.twitter.com/uaqdwKYbWm — Cricket Videos (@cricketvid123) April 23, 2024
Related News by category
-
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్ను ఎక్సట్రా ప్లేయర్గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
గోల్ కొట్టిన విరాట్కోహ్లీ.. జస్ట్మిస్
క్రికెట రారాజు విరాట్కోహ్లీ ... ఫుట్బాల్ మైదానంలో సందడి చేశాడు. క్రికెట్ ఆటలో ఎంతో కచ్చితత్వంతో బాల్ని బౌండరీలు దాటించే కోహ్లీ.. అదే తీరుని ఫుట్బాల్ మైదానంలోనూ చూపించాడు. ఆక్సిడెంటల్ క్రాస్బార్ ఛాలెంజ్ పేరుతో చాలా దూరం నుంచి గోల్పోస్ట్కి గురి పెట్టాడు కోహ్లీ. తన నైపుణ్యం అంతా ఉపయోగించి బాల్ని కిక్ చేశాడు. గోల్కీపర్ను తప్పించుకుని గోల్పోస్ట్లో బాల్ పడినట్టే అనిపించింది. అయితే చివరి క్షణంలో గోల్పోస్ట్ పోల్కి బాల్కి అడ్డుగా నిలిచింది. దీంతో గోల్ మిస్ అయ్యింది. క్రికెట్లోనే కాదు ఫుట్బాల్లోనూ కోహ్లీ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు Accidental crossbar challenge 😂 pic.twitter.com/koeSSKGQeb — Virat Kohli (@imVkohli) May 25, 2021 -
ఇంగ్లండ్కు భారీ షాక్: న్యూజిలాండ్తో సిరీస్కు ఆర్చర్ దూరం
లండన్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్ పర్యటన, ఐపీఎల్లకు దూరమైన ఆర్చర్.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది. చదవండి: శ్రీలంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్లో ఈ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్తో సిరీస్లో 3 ఇన్నింగ్స్లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్)
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- Hyderabad: రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement