9న ఆంధ్రా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన నామినేషన్లు | Sakshi
Sakshi News home page

9న ఆంధ్రా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన నామినేషన్లు

Published Sat, Jan 25 2014 10:53 PM

ANDHAR Association Elections Nominations ended

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా అసోసియేషన్ ఢిల్లీశాఖ ఎన్నికలు ఫిభ్రవరి 9న నిర్వహించనున్నారు. లోధి ఎస్టేట్‌లోని డీటీఈఏ సీనియర్ సెకండరీ పాఠశాలలో నిర్వహించనున్న ఎన్నికలకు సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్.కె. రాథోడ్ ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. ముగ్గురు సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. ఎన్నికల్లో మట్టా పశుపతి-కోటగిరి సత్యనారాయణ ప్యానెల్, మణినాయుడు-చంద్రశేఖర్ ప్యానెళ్లు పోటీపడనున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు ప్యానెళ్లు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. 

Advertisement
Advertisement