Sakshi News home page

రసాభాసగా గ్రామసభలు

Published Tue, Sep 27 2016 4:16 PM

రసాభాసగా గ్రామసభలు - Sakshi

మచిలీపట్నం: బందర్ పోర్టు, కోస్టల్ కారిడార్‌ల ఏర్పాటు కోసం కావాల్సిన భూములను సేకరించేందుకు ఏపీ  ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. మంగళవారం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్(మడ) అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. బుద్దాలపాలెం, మేకావానిపాలెం, కోన పోలాటితిప్ప గ్రామాల్లో ల్యాండ్‌పూలింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. 2015 ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చే యకుండానే పూలింగ్‌కు రావటమేమిటని ప్రశ్నించారు. గ్రామసభల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. 

Advertisement

What’s your opinion

Advertisement