న్యూఢిల్లీ: భారత పర్యాటక అభివృద్ధిశాఖ (ఐటీడీసీ) చాణక్యపురిలో నిర్వహిస్తున్న సామ్రాట్ హోటల్లో రెస్టారెంటు నిర్వహిస్తున్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్కు చిక్కులు వచ్చిపడ్డాయి. రెస్టారెంటు అద్దె బకాయిలు రూ.రెండు కోట్లు చెల్లించనందున, దానిని ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఐటీడీసీ అర్జున్కు నోటీసులు పంపించింది. ఇతడు ల్యాప్ పేరుతో 2009 నుంచి సామ్రాట్ హోటల్లో రెస్టారెంటు నిర్వహిస్తున్నాడు. విద్యుత్, గ్యాస్, నీళ్ల చార్జీలకుతోడు నెలకు రూ.25 లక్షల అద్దె చెల్లించాలి. 2012 అక్టోబర్ నుంచి అద్దె చెల్లించడం మానేయడంతో ఐటీడీసీ నోటీసులు జారీ చే సింది. అయితే మొత్తం రూ. 4.5 కోట్ల బకాయిల్లో అర్జున్ ఇటీవలే రూ. 2.5 కోట్లు చెల్లించాడు. గత అక్టోబర్లో ల్యాప్ రెస్టారెంటు కాంట్రాక్టు గడువు ముగిసిపోగా, అర్జున్ రెన్యూవల్కు దరఖాస్తు చేసుకున్నాడు. అద్దె బకాయిల చెల్లింపునకు కొంత గడువు ఇవ్వాలని కోరుతూ ఇతడు దాఖలు చేసిన పిటిషన్పై ఇంకా నిర్ణయం వెలువడలేదు. న్యాయస్థానం నిర్ణయం వెలువరించేంత వరకు రెస్టారెంటును నడుపుకునేందుకు అర్జున్కు అనుమతి ఉంటుందని ఐటీడీసీ వర్గాలు తెలిపాయి.
అర్జున్ రెస్టారెంటుకు మూత ?
Published Mon, Jan 27 2014 12:17 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement