గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం ఇందిరానగర్లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 13 బైక్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 లీటర్ల కిరోసిన్, క్వింటా బొగ్గును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
గోదావరి ఖనిలో కార్డన్సెర్చ్
Published Tue, Jan 10 2017 11:10 AM
# Tag
Related news
-
ఎంత పని చేశావు తల్లీ !
కోల్సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహాశివరాత్రి పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన తన ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరు మృతి చెందారు. పిల్లలిద్దరూ తనతో ప్రేమగా, చనువుగా ఉండటం తట్టుకోలేక తన భార్య వారిపై దాడి చేసిందని తండ్రి ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేనరికం.. ఉన్నత విద్యావంతులు.. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్, రమాదేవి దంపతులు. ఇందులో రమాదేవి తండ్రి.. శ్రీకాంత్ తల్లి అన్నాచెల్లెళ్లు కావడంతో మేనరికం కుదరగా 2003 నవంబర్ 4న ఇరువురికి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అజయ్(10), ఆర్యన్(6) ఉన్నారు. శ్రీకాంత్ స్థానికంగానే ప్రభుత్వ మైనార్టీ గురుకులంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, రమాదేవి కొంతకాలం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసి ప్రసుతం ఇంటి వద్దే ఉంటోంది. వీరి పిల్లలు అజయ్ 4వ తరగతి, ఆర్యన్ ఎల్కేజీ చదువుతున్నారు. దంపతుల మధ్య గొడవలు.. కొంతకాలంగా శ్రీకాంత్, రమాదేవిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు తండ్రి శ్రీకాంత్తో చనువుగా ఉంటున్నారని తరచూ చెప్పుకునే రమాదేవి.. కొడుకులను అదే కారణంతో కొట్టేదని చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనార్టీ గురుకులంలో పని చేస్తున్న శ్రీకాంత్ ఆదివారం రాత్రి విద్యార్థులకు పాఠాలు బోధించి అక్కడే పడుకున్నాడు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న తన తండ్రి ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భార్య రమాదేవికి ఫోన్ చేశాడు. శివరాత్రి పూజ కోసం పండ్లు, సామాగ్రి తీసుకురావాలా అని అడిగి ఆమె సూచన మేరకు పూజా సామాగ్రితోపాటు పిల్లలకు తినడానికి అల్పాహారం కూడా తీసుకొని ఇంటికొచ్చాడు. గట్టిగా కొట్టడంతో.. శ్రీకాంత్ ఇంటికి రాకముందే రమాదేవి ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణా రహితంగా దాడి చేయగా తలలు పగిలిపోవడంతో కొడుకులిద్దరూ కుప్పకూలారు. ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ పిల్లలను పిలిస్తే సమాధానం రాకపోగా, గేటుకు లోపలివైపు గడియపెట్టి తాళం వేసి ఉండడంతో అనుమానిం చాడు. స్థానికులను పిలిచి గోడ దూకి ఇంటి ఆవరణలోకి శ్రీకాంత్ వెళ్లే సరికి పిల్లలిద్దరూ తలలు పగిలి రక్తపు మడుగులో మూలుగు తూ కనిపించారు. పక్కనే రక్తంతో తడిసి పగిలిన ఇటుక కనిపించింది. భార్య చేతికి రక్తం మరకలు ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను గోదావరిఖలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి తీవ్రంగా గాయపడిన పెద్ద కుమారుడు అజయ్ చికిత్స పొందుతూ గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. చిన్న కుమారుడు ఆర్యన్కు కూడా తలకు బలమైన గాయాలు కావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్టౌన్ సీఐ పర్శ రమేశ్ పరిశీలించారు. మృతుల తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
‘గుండె’ను పిండేసిన స్ఫూర్తి
సాక్షి, గోదావరిఖని : ప్రాణాపాయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడో ఆర్టీసీ డ్రైవర్. ఒకవైపు గుండెపోటు బాధిస్తున్నా.. 52 మంది ప్రయాణికులు క్షేమండా ఉండాలనే ఏకైక తలంపుతో క్షేమంగా బస్సును రోడ్డు పక్కకు దించాడు. ఆ తర్వాతే తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ స్టీరింగ్పైనే కుప్పకూలిపోయాడు. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు బుధవారం ఉదయం 5.15 గంటలకు వయా యైటింక్లయిన్కాలనీ మీదుగా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. బస్సులో 52 మంది ప్రయాణికులున్నారు. 6.35 గంటల సమయంలో రాఘవాపూర్ సమీపంలో డ్రైవర్ మహేందర్ (45) ఛాతీలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ సమయంలో బస్సు వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఓ వైపు నొప్పి బాధిస్తున్నా బస్సును నియంత్రించి రోడ్డు పక్కన ఆపి.. స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు 108కు ఫోన్ చేసినా.. అది ఆలస్యమయ్యేట్లు కనిపించింది. డ్రైవర్ విషమ పరిస్థితి గమనించిన బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఓసీపీ–3లో పనిచేస్తున్న ఎంవీ డ్రైవర్ వెంకటరమణ, ఈపీ ఆపరేటర్ ఆకుల రాజయ్యలు.. మహేందర్కు ప్రథమ చికిత్స అందించారు. ఓసీపీ–1లో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న తిరుపతి బస్సును నడుపుకుంటూ 10 నిమిషాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మహేందర్ను పరీక్షించిన వైద్యులు.. గుండెపోటుగా నిర్ధారించి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందడంతో.. డ్రైవర్ మహేందర్కు ప్రాణాపాయం తప్పింది. తన ప్రాణాన్ని లెక్కచేయక మహేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి 52 ప్రాణాలు కాపాడారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి కరీంనగర్ తీసుకెళ్లేందుకు అంబులెన్స్లో డీజిల్ లేకపోవడంతో.. కండక్టర్ డబ్బులిచ్చి డీజిల్ పోయించడంతో బండి ముందుకు కదిలింది. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని డ్రైవర్ ప్రాణాలు కాపాడేందుకు బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు పరితపించారు. -
యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
కోల్సిటీ(రామగుండం): యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని అంబేడ్కర్నగర్కు చెందిన నేహ(15) నానమ్మ జులేఖాబేగం వద్ద ఉంటోంది. శనివారం ఆమె నానమ్మ తో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాబాయ్ రజాక్ ఇంటికి వెళ్లింది. సాయంత్రం బాబాయ్, నానమ్మ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో నేహ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ‘నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలేదు’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ కొంతకాలంగా ప్రేమ పేరుతో నేహను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి బాబాయ్, నానమ్మ తెలిపారు. నిం దితుడిని అరెస్ట్ చేయాలని మృతు రాలి బంధువులు, ముస్లింలు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐలు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని వారికి నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దు
వెల్దండ (కల్వకుర్తి): హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న కొట్రతండాపై ప్రత్యేక దృష్టి సారించామని, గ్రామస్తులు ఎవరూ కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఏఎస్పీ జోగుల చెన్నయ్య అన్నారు. మండలంలోని కొట్రతండాలో ఆదివారం అర్ధరాత్రి ఏఎస్పీ జోగుల చెన్నయ్య, కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో 30 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంపై పోలీస్ నిఘా ఉంచుతున్నామన్నారు. ప్రధాన జాతీయ రహదారులపై ఉన్న గ్రామాలు, తండాలు, పట్టణాలకు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. కొత్త వ్యక్తులకు ఆశ్రమం కల్పించ వద్దన్నారు. రౌడీ షీటర్లుగా పేరున్న వ్యక్తులతో సంబంధాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల తనిఖీలో అలాంటి వ్యక్తులను గుర్తిస్తే తండావాసులు ఇబ్బందులు పడతారన్నారు. తండాలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించిన వెంటనే సమీపంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే అక్రమంగా మద్యం, అధిక మొత్తంలో డబ్బులు నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. క్షుణ్ణంగా తనిఖీలు.. కార్డెన్ సెర్చ్లో భాగంగా బృందాలుగా విడిపోయిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతిఒక్కరి గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. వాహనదారులు వీటికి సంబంధించిన పత్రాలను, లైసెన్స్లను చూపించితే తీసుకెళ్లాలని సూచించారు. అలాగే గ్రామంలోని పలు కిరాణం షాపుల్లో మద్యం లభించడంతో దుకాణదారులను హెచ్చరించారు. ఇకపై ఇలాంటివి కనిపిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్దండ, కల్వకుర్తి సీఐలు గిరికుమార్ కల్కోట, సురేందర్రెడ్డి, ఆయా మండలాల ఎస్ఐలు వీరబాబు, ప్రదీప్, కృష్ణయ్య, నర్సింహ, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాతబస్తీలో అర్దరాత్రి కార్డెన్ సెర్చ్
పాతబస్తీలో అర్దరాత్రి కార్డెన్ సెర్చ్
Related News by category
-
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ’
హుజూరాబాద్: మాదిగల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ నమ్మించి ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి హుజురా బాద్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు,నాలుగు సీట్లు రావాల్సి ఉండగా ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెడ్డిలకు ఆరుసీట్లు, 50శాతం పైన ఉన్న బీసీలకు రెండు సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వంతో మాదిగలు నష్టపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎవరూ ఓటు వేయద్దని సూచించారు. బీజేపీ తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చామని అన్నారు. నాయకులు రుద్రారపు రామచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వెంకట్ స్వామి, డాక్టర్ తడికమళ్ల శేఖర్, బొరగల సారయ్య, రాజు పాల్గొన్నారు. ఏజీని కలిసిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కరీంనగర్క్రైం: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బి.సుదర్శన్ రెడ్డిని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షల ఇన్సూరెన్స్ను రూ.5లక్షలకు పెంచాలని, కొత్త సభ్యులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల స్టైఫండ్ ఇవ్వాలని వినతిపత్రం అందించగా.. సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్గా మహేందర్కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్గా దగ్గు మహేందర్ రాకేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేందర్ కన్వీనర్గా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహేందర్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన సహచర కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేయర్ యాదగిరి సునీల్రావును మహేందర్ రాకేశ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మర్యాదకపూర్వకంగా కలిశారు. మహేందర్కు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. -
అశ్వవాహనంపై రామయ్య
ఇల్లందకుంట: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరా మనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శేషం రామాచార్యులు, అర్చకుడు శేషం వంశీధరచార్యులు మంత్రోచ్ఛారణ మధ్య స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, సురేందర్రెడ్డి, కడారి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్, పెద్దికుమార్ పాల్గొన్నారు. -
ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్విని కుమార్ పాండేనేటి నుంచి ఇంటింటికీ కాంగ్రెస్కరీంనగర్: ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని ఎంసీఎంసీ కమిటీ సభ్యులకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్వినికుమార్ పాండే సూచించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లోని మీడియా సెంటర్, కంట్రోల్రూంను పరిశీలించారు. మీడియా సెంటర్ పనితీరుతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే ఎన్నికల ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెయిడ్ ఆర్టికల్స్ను పర్యవేక్షిస్తూ వ్యయ వివరాలు నమోదు చేయాలన్నారు. కంట్రోల్రూం పనితీరును అడిగి తెలు సుకున్నారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చిన కేసులు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార, పౌర సంబంధాలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కొండయ్య, ఏపీఆర్ఓ వీరాంజనేయులు, కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ ఎస్.నాగార్జున పాల్గొన్నారు. ● సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పంచ న్యాయాల (పాంచ్న్యాయ్) గ్యారంటీ కార్డులను నగరంలోని ప్రతీ గడపకు తీసుకెళ్తామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలిపారు. శనివారం నుంచి ఇంటింటికి వెళ్లి పంచ న్యాయాలు అందజేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. శుక్రవారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల తరహాలోనే కేంద్రంలో కాంగ్రెస్ పాంచ్న్యాయ్ను అమలు చేయనుందన్నారు. ఇటీవల తుక్కుగూడ సభలో రాహుల్గాంధీ ప్రకటించిన ఈ పంచన్యాయాల గ్యారంటీ కార్డులను ప్రతీ గడపకు చేరుస్తామన్నారు. కేంద్రం నుంచి రొటీన్గా వచ్చే నిధులు కాకుండా, సొంతంగా తీసుకొచ్చినవేమిటో, పనులేమిటో బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ఎంపీగా, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా పూర్తిగా వి ఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ హ యాంలో నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం వల్లే నగరం స్మార్ట్సిటీకి అర్హత సాధించిందన్నారు. వీటిని ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోతా మన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బిజీ షెడ్యూ ల్ వల్ల, సమాచారలోపంతో తాను కార్యక్రమానికి హాజరుకాలేకపోయానన్నారు. నాయకులు ఎండీ.తాజొద్దీన్, శ్రవణ్నాయక్, బొబ్బిలి విక్టర్, సమద్ నవాబ్, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
బండి, గంగుల ఒక్కటే
● వినోద్ను ఓడించింది వాళ్లే ● ఇద్దరూ కలిసే నగరాన్ని దోచుకున్నారు ● తీగలవంతెనపై విచారణ జరుగుతోంది ● మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక్కటేనని, ఇద్దరు కలిసి నగరాన్ని దోచుకున్నారని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉప్పు నిప్పులా ఉన్న గంగుల, బండి పాలు నీళ్లలా ఎందుకు కలిసిపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి వినోద్కుమార్ను ఓడించారన్నారు. నగరంలో భూ కబ్జాలపై స్థానిక ఎంపీగా సంజయ్ ఎందుకు మాట్లాడడంలేదన్నారు. స్మార్ట్సిటీ, గ్రానైట్ అక్రమాలపై ప్రశ్నించాల్సిన ఎంపీ ఎందుకు మౌనంగా ఉన్నాడని, ఎంపీ విధానాలను నిలదీయాల్సిన ఎమ్మెల్యే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎన్నిలకు ముందు సంజయ్ ఆస్కార్అవార్డు స్థాయిలో నటిస్తారని, ఒకసారి భార్య తాళి అమ్ముకున్నానని, మరోసారి ఎంఐఎం దాడి చేసిందని, ఇంకోసారి మూర్చవచ్చి పడిపోతాడన్నారు. నగరాన్ని లండన్ చేస్తాం, అద్ధంలా మారుస్తామని కేసీఆర్ చెప్పారని ఏమైందన్నారు. తీగలవంతెన నిర్మాణ అక్రమాలపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వాళ్లు లోపలికి పోవుడేనన్నారు. తాము అధికారంలోకి రాగానే భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పి చేసి చూపిస్తున్నామని, అదే కాంగ్రెస్ పాలన అని చెప్పారు. భూ కబ్జాల్లో ఎవరు జైలుకు వెళ్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. ఏ పార్టీ వాళ్లయినా భూ ఆక్రమణలకు పాల్పడితే వాపసు ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ముగిశాక నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు వెలిచాల రాజేందర్రావు, వైద్యుల అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement