కరుణ నిర్ణయం
మరికొద్ది రోజుల్లో తొలి జాబితా
అధికారుల జాబితా కోసం ఈసీకి వినతి
రానున్న లోక్సభ ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేయడానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. యువజన విభాగానికి చెందిన నాయకులతో తొలి జాబితాను మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్ను డీఎంకే కోరింది.
సాక్షి, చెన్నై:
ఓ వైపు కూటమి ప్రయత్నాలు, మరో వైపు అభ్యర్థుల ఎంపికలో డీఎంకే అధిష్టానం బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహులను ఈనెల 20 నుంచి ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. అధినేత కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు వేగం పుంజుకున్నారుు. సగం నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు ముగిశాయి. ఇందులో ఎక్కువ శాతం యువతను అభ్యర్థులుగాఎంపిక చేయడానికి కరుణానిధి నిర్ణయించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ల కన్నా, యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనలో కరుణానిధి ఉన్నారు. పార్టీకి వెన్నెముకగా యువజన విభాగం ఉండటం, దానికి స్టాలిన్ నేతృత్వం వహిస్తుండటంతో ఆ విభాగంలోని నాయకులకు మెజారిటీ శాతం సీట్లు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అన్నాడీఎంకే జాబితాలో కొత్త ముఖాలు ఉండటంతో, తాము యువతకు పెద్ద పీట వేసే రీతిలో జాబితాను సిద్ధం చేస్తున్నట్టు డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు.
ఈసీకి లేఖాస్త్రం: కరుణానిధి సూచన మేరకు డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల జాబితాను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకోబోమని ఎన్నికల కమిషన్ ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, తమిళనాడు ప్రభుత్వం జిమ్మిక్కులు చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులకు ఉపయోగ పడే అధికారుల జాబితాను ఎన్నికల యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ జాబితాలో ఉన్న అధికారుల పేర్లు, వివరాల్ని వెబ్ సైట్లో తప్పని సరిగా పొందు పరచాల్సిందేనని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు గత అనుభవాల్ని ఎత్తి చూపుతున్నదని, ఈ దృష్ట్యా, ఎన్నికల అధికారుల పేర్లు, వివరాలు ముందుగానే తెలియజేయాలని డిమాండ్ చేశారు.
# Tag
Related news
-
Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్ ఫైట్
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది... కోయంబత్తూర్ బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటలూ మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్ నెగ్గారు. అయితే గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం! చెన్నై సౌత్ ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం. 2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. నీలగిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్.మురుగన్ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఎ.చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిటింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. రామనాథపురం ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె.నవాన్ ఖని (ఐయూఎంఎల్) ఓపీఎస్కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. తేని జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి.రవీంద్రనాథ్ పన్నీర్సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదు..
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు. అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు. కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్కుమార్ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది. చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
అవినీతి యూనివర్సిటి ఛాన్సలర్ మోదీ : సీఎం స్టాలిన్
చెన్నై: డీఎంకేని అవినీతి పార్టీ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి అనే ఓ యూనివర్సిటీ ఉంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్ అవుతారని అని సెటైర్లు వేశారు. ‘అవినీతి పేరుతో ఓ విశ్వవిద్యాలయం స్థాపిస్తే.. ఆ యూనివర్సిటీకి ప్రధాన మంత్రి మోదీ ఛాన్సలర్ అవుతారు. ఛాన్సలర్ కావడానికి ప్రధాని మోదీకి అన్ని అర్హతలు ఉన్నాయి. బీజేపీనే దేశంలో అతిపెద్ద అవినీతీ పార్టీ. దానికి ఉదాహారణ.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. అది ఒక్కటే కాదు.. పీఎం కేర్స్ ఫండ్, కేసుల్లో ఇరుకున్న ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరిన తర్వాత విచారణ ఉండకపోవటం. అసలు అవినీతితో కూడిన పార్టీ బీజేపీ’ అని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ఇక.. బుధవారం తమిళనాడులోని వెల్లూరులో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతి పార్టీ అని మండిపడ్డారు. ‘అవినీతికి మొదటి కాపీ రైట్ డీఎంకేకు చెందుతుంది. ఎంకే స్టాలిన్ కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంది. తమిళనాడు ప్రజలను అవినీతి కుటుంబ పాలన కొనసాగించే డీఎంకే తమ ట్రాప్లో పడిపోయారు. డీఎంకే పార్టీ తమిళ సంస్కృతి, సాంప్రదాయానికి వ్యవతిరేకంగా ఉంది. సీఎం స్టాలిన్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు’ అని మోదీ విమర్శలు చేశారు. -
PM Narendra Modi: అవినీతికి మారుపేరు డీఎంకే
వెల్లూరు: తమిళనాడులో అధికార డీఎంకేపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతికి మారుపేరుగా మారిపోయిందని, రాష్ట్రాభివృద్ధిని ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాడులోని వెల్లూరు, మెట్టుపాళ్యంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే ముమ్మాటికీ కుటుంబ పారీ్టలేనని అన్నారు. అవినీతిపై మొదటి పేటెంట్ హక్కు డీఎంకేకు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కంపెనీ అయిన డీఎంకే పాతకాలపు ఆలోచనా ధోరణితో రాష్ట్రంలో యువత ఎదుగుదలను అడ్డుకుంటోందని విమర్శించారు. భాష, కులం, మతం, విశ్వాసం పేరిట ప్రజల్లో విభజనను సృష్టిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో దేశం ముందడుగు వేస్తుండగా, పెట్టుబడులను అడ్డుకొనేవారితో డీఎంకే అంటకాగుతోందని ఆరోపించారు. కచ్చతీవు అప్పగింత వల్ల లాభపడిందెవరు? తమిళనాడులో డీఎంకే తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష, విభజన అనే ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని బాగస్వామ్యపక్షాలకు బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అవినీతిపరులను కాపాడాలని కాంగ్రెస్, డీఎంకే ఆరాటపడుతున్నాయని విమర్శించారు. వారసత్వ పార్టీలకు సొంత కుటుంబ సభ్యులు, వారసులు తప్ప ఇతరుల సంక్షేమం పట్టదని అన్నారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును తాము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దింపితే వారసత్వ పారీ్టలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. మన దేశంలో అందర్భాగమైన కచ్చతీవును 1974లో అన్యాయంగా శ్రీలంకకు అప్పగించారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయని వివరించారు. కచ్చతీవు అప్పగింతపై ఏ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు ఉన్నాయి.. నాగపూర్: ఆరి్టకల్ 370 రద్దుతో తనకు అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు లభిస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు, దూషణలతో తనకు మేలు జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు మరిన్ని పెరుగుతాయని అన్నారు. ఆయన బుధవారం మహారాష్ట్రలో నాగపూర్ జిల్లాలోని కన్హాన్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ఉండబోవంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. -
తమిళనాట మోదీ సంచలన ప్రకటన.. డిఫెన్స్లో డీఎంకే!
సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రజలకు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. శ్రీలంకలో అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా భారత్కు తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ప్రధాని మోదీ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలూరులో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ఈరోజు దేశం మొత్తం కాంగ్రెస్, డీఎంకే పార్టీల మరో కపట నాటకం గురించి చర్చిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారు. ఎవరి ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Addressing a public rally in Vellore, PM Narendra Modi says, "Today the whole country is discussing another hypocrisy of Congress and the DMK party. When Congress was in government, these people gave Kachchatheevu Island to Sri Lanka. In which cabinet was… pic.twitter.com/Gr004Zxmea — ANI (@ANI) April 10, 2024 కచ్చాతీవు ద్వీపం వద్దకు వెళ్లిన వేలాది మంది తమిళనాడు మృత్స్యకారులను శ్రీలంక కోస్టల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్పై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా వెనక్కి తీసుకువస్తుంది. అదొక్కటే కాదు మరణ శిక్షలు విధింపబడిన వారిని కూడా సజీవంగా వెనక్కి తీసుకువస్తున్నాం. వారిని వారి వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత బీజేపీది అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి. డీఎంకేది విభజన రాజకీయం. తమిళులను చీకట్లో ఉంచేసింది. అవినీతి చేయడానికి డీఎంకే కాపీరైట్ తీసుకుంది. కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంటోంది. తమిళనాడులో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ గెలవబోతోంది అంటూ కామెంట్స్ చేశారు.
Related News by category
-
యువకుడికి అరుదైన డీప్ బ్రెయిన్ శస్త్రచికిత్స
సాక్షి, చైన్నె: ప్రొగ్రసివ్ మయోక్లోనస్ ఎపిలెప్సీతో బాధ పడుతున్న 23 ఏళ్ల యువకుడికి అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్ర చికిత్సను గ్లెనెగల్స్ హెల్త్ సిటీ వైద్యులు విజయవంతం చేశారు. రెండు చిన్న రంధ్రాల ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చా రు. ఈ శస్త్ర చికిత్స గురించి సోమవారం గ్లెనెగల్స్ న్యూరాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎంటర్ ఫర్ ఎపిలెప్సీ డైరెక్టర్ డాక్టర్ దినేష్నాయక్ వివరించారు. పది సంవత్సరాల వయస్సు నుంచి నాగ్పూర్కు చెందిన యువకుడు(23) అరుదైన మూర్చ వ్యాధి లక్షణాలతో బాధ పడుతూ వచ్చాడని పేర్కొన్నారు. హఠాత్తుగా కింద పడి పోవడం, మాట రాక పోవడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు ఇతడిలో క్రమంగా పెరిగాయన్నారు. కొంతకాలం స్వస్థలంలోనే చికిత్స పొందినా, ఆకస్మాత్తుగా పరిస్థితి దయనీ యంగా మారడంతో హెల్త్ సిటీలో చేర్చినట్టు తెలిపారు. అన్ని రకాల పరిశోధనలతో అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్ర చికిత్స నిర్వహణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. న్యూ రో సర్జన్ హెడ్ డాక్టర్ నిగెల్ సిమ్స్, అనస్తీషియా డాక్టర్ రమణన్ తదితర వైద్య బృందం సహకారంతో 8 గంటలు శ్రమించి రెండు దశల్లో శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. మెదడులోని నిర్ధిష్ట కేంద్రంలోకి ఎలక్ట్రోడ్లను అమర్చినట్టు వివరించా రు. ప్రస్తుతం యువకుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు, తన రోజు వారి పనులన్నీ తానే చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో హెల్త్ సిటీ సీఈఓ డాక్టర్ నగేష్ కే రావు పాల్గొన్నారు. -
రథోత్సవం
వైభవంగా సాక్షి, చైన్నె: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారి వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరగ్గా, సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేకువ జామున ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అభిషేకాది పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను వేర్వేరుగా అలంకరించారు. సర్వాలంకారంతో ఉన్న స్వామి అమ్మవార్లు రథంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అతిపెద్ద రథంలో సుందరేశ్వర స్వామి, మరో రథంలో మీనాక్షి అమ్మవారి ఆశీనులయ్యారు. ఆలయం ఆవరణ నుంచి ఉదయం 7 గంటలకు రథాలు ఒకదాని తర్వాత మరొకటి భక్త జనుల శివనామస్మరణ మధ్య ముందుకు కదిలాయి. మీనాక్షి అమ్మవారి ఆలయ తక్కర్ రుక్మిణి పళణి వేల్, దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చెల్లదురై, ఆలయ జాయింట్ కమిషనరన్ కృష్ణన్ రథాలకు జెండా ఊపారు. కీల్ మాసివీధి, తెర్కు మాసి వీధి, మేల్ మాసి వీధి, వడక్కుమాసి వీధులలో 5 కి.మీ దూరం రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ రథాలకు ముందుగా గజరాజులు, ఎద్దులు కదిలాయి. శివాచార్యులు, శివ శక్తులు శంఖం పూరిస్తూ, డమరకం వాయిస్తూ శంభో శంకరా, నమశ్శివాయ నామస్మరణ మారుమోగింది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గజేంద్రుడు తదితర దేవుళ్ల ఉత్సవ విగ్రహాలను సప్పరాలలో ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అడుగడుగునా భక్తజనులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్త కోటి శివనామ స్మరణ నడుమ స్వామివారి రథం ముందుకు సాగగా, వెనుక అమ్మవారి రథం అనుకరించింది. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి రథోత్సవం పూర్తయ్యింది 12.10 గంటలకు అమ్మవారి రథం ఆలయం వద్దకు చేరుకున్నాయి. వేలాదిగా భక్త జనం తరలి రావడంతో మదురై జన సంద్రంలో మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం చేసింది. అలాగే భక్తుల సేవలో పలు సంఘాలు తరలించాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గించే విధంగా శీతల పానీయాల్ని అందజేశాయి. నేడు వైగై నదీ ప్రవేశం ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం మంగళవారం వైగై నదీ తీరంలో జరగనుంది. మదురైలో శైవం, వైష్ణవం సంబంధిత రెండు ఉత్సవాలు చిత్తిరై మాసంలో జరిపే విధంగా 400 ఏళ్ల క్రితం ఈ గడ్డను పాలించిన తిరుమలై నాయకర్ చర్యలు తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అంతకుమునుపు వేర్వేరుగా ఈ ఉత్సవాలు జరిగినా, తిరుమలై నాయర్ ఆదేశాలకు అనుగుణంగా శైవ,వైష్ణవ ఉత్సవాల మేళవింపుగా చిత్తిరై మాసంలో కనుల పండువగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రెండు ఉత్సవాల మేళవింపుగా మీనాక్షి అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు తేనూరు నుంచి కళ్లలగర్ స్వామివారు (విష్ణుమూర్తి) బయలుదేరి రావడం, వైగై నదీ ప్రవేశ ఘట్టం జరగడం ఈ ఉత్సవాలలో ప్రత్యేకత. ఈ వేడుకల నిమిత్తం తేనూర్ నుంచి ఆదివారం రాత్రంతా బంగారు పల్లకిలో ప్రయాణించిన కళ్లలగర్ సోమవారం సాయంత్రానికి మదురైకు చేరుకున్నారు. రాత్రంతా దారి పొడవున భక్త జనులు కర్పూర హారతులు పట్టారు. అలాగే ఆ మార్గంలోని పలు ఆలయాల వద్ద స్వామివారిని ఆహ్వానిస్తూ పూజాది కార్యక్రమాలు జరిగాయి. మూండ్రు మావడి వద్ద స్వామి వారికి ఎదుర్ సేవ అత్యంత వేడుకగా జరిగాయి. తల్లాకులం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న అళగర్ స్వామికి ప్రత్యేక తిరుమంజనం జరిగింది. ఇక్కడి నుంచి మంగళవారం ఉదయం జరిగే విశిష్ట పూజల అనంతరం శ్రీవిల్లి పుత్తూరు ఆండాల్ ఆలయం నుంచి వచ్చిన పూల మాలను ధరించి, బంగారు అశ్వరథంపై స్వామివారు వైగై నదీ ప్రవేశానికి వెళ్లనున్నారు. ఇందుకోసం ఆళ్వార్ పురం వైగై నదీ తీరంలో సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తారు దీంతో గట్టి భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఆధ్యాత్మిక నగరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా మదురై ఉత్సవాల వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం అనంతరం జరిగే ఎదుర్ సేవ సందర్భంలో వాహనంపై ఎలాంటి నీరూ చల్లకూడదనే ఆంక్షలను కోర్టు ఇప్పటికే విధించింది. దీనిని అమలు చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే వైగై నది ప్రవేశ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పనులను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది. రథోత్సవంలో పాల్గొన్న భక్తులుమదురై వీధులు భక్త జన సంద్రమయ్యాయి. సోమవారం అంగరంగ వైభవంగా మీనాక్షి సుందరేశ్వర స్వామి రథోత్సవం సాగింది. ఇక చిత్తిరై ఉత్సవాల్లో మరో ప్రధాన ఘట్టమైన కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం మంగళవారం ఆళ్వార్ పురంలో జరగనుంది. ఇందుకోసం తేనూరు నుంచి కళ్లలగర్ స్వామి(విష్ణుమూర్తి) మదురైకు చేరుకున్నారు. భక్తులను అనుగ్రహించిన మీనాక్షీ సుందరేశ్వర స్వామి జన సంద్రమైన ఆధ్యాత్మిక నగరం నేడు కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం ఏర్పాట్లు పూర్తి మదురైకు చేరుకున్న స్వామి వారు -
పరందూరుకు మెట్రో
● పూందమల్లి నుంచి విస్తరణ పనులు ● నివేదిక రెడీ ● 19 రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, చైన్నె : పూందమల్లి నుంచి పరందూరుకు మెట్రో రైలు పనులకు సంబంధించిన నివేదిక తాజాగా సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 10,712 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మొత్తం 43.66 కి.మీ దూరం ఏర్పాటు చేసే మెట్రో రైలు మార్గంలో 19 రైల్వే స్లేషన్లు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. వివరాలు.. చైన్నెలో ప్రస్తుతం ఫేజ్ –1 పనులు ముగియడంతో రెండు మార్గాలలో మెట్రో రైలు సేవలకు విపరీతమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఫేజ్– 2లో మరో మూడు మార్గాలలో పనులకు కార్యాచరణ సిద్ధం చేశారు. రూ. 63, 246 కోట్లతో 118.9 కి.మీ దూరం లైట్ హౌస్ – పూందమల్లి మధ్య 26.1 కి.మీ, మాధవరం – సిరుచ్చేరి సిప్కాట్ మధ్య 45.8 కి.మీ, మాధవరం నుంచి షోళింగనల్లూరు వరకు 47 కి.మీ దూరం మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గలలో అత్యధిక దూరం రైలు భూగర్భ మార్గంలోనే పయనించనుంది. ఈ పరిస్థితులలో పూందమల్లి వరకు ఉన్న మెట్రో సేవను పరందూరు వరకు విస్తరించేందుకు కార్యాచరణను రూపొందించారు. కొత్త విమానాశ్రయం వరకు .. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో పెరిగిన రద్దీతో మరో ఎయిర్పోర్టు నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం కాంచీపురం జిల్లా పరిధిలోని పరందూరును ఎంపిక చేశారు. చైన్నె నుంచి 60 కి.మీ దూరంలోని పరందూరులో 4,798 ఎకరాల స్థలంలో రూ. 40 వేల కోట్లతో పనులు చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఏకనాపురం వేదికగా 13 గ్రామాల ప్రజలు ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వీరంతా లోక్ సభ ఎన్నికలను సైతం బహిష్కరించారు. ఈ పరిస్థితులలో కొత్త విమానాశ్రయ టెర్మినల్ రూపుదిద్దుకునే పరందూరుకు మెట్రో రైలు సేవలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత టెండర్ల ప్రక్రి యపై దృష్టి పెట్టాలని మెట్రో వర్గాలు నిర్ణయించాయి. అంచనా వ్యయంగా రూ. 10,712 కోట్లు పూందమల్లి – పరందూరు మధ్య మెట్రో రైలు పనులకు రూ. 10,712 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 43.66 కి.మీ దూరం వంతెన మార్గంలో పనులు చేపట్టబోతున్నారు. ఈ మార్గంలో 19 రైల్వే స్టేషన్లు, మల్లీ లెవల్ పార్కింగ్ సెంటర్లు, మాల్స్ తదితర నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సమగ్ర నివేదికలో పొందు పరిచారు. చైన్నె నగరంలో సగటున కి.మీ లేదా 1.5 కి.మీ దూరానికి ఒక మెట్రో రైల్వే స్టేషన్ ఉన్నాయి. అయితే పూందమల్లి – పరందూరు మార్గంలో కొన్ని చోట్ల రెండు, మరికొన్ని చోట్ల మూడు కి.మీ దూరానికి ఓ రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది. రైలు అతి వేగంగా విమానాశ్రయం వైపుగా దూసుకెళ్లే విధంగా దూరాన్ని పెంచి రైల్వే స్టేషన్ల ఏర్పాటు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు పూందమల్లి, నషరత్ పేట చెక్ పోస్టు, చెంబరంబాక్కం, తిరుమలిసై టౌన్షిప్, పాపన్ చత్రం, చెట్టి పేడు, తండలం, ఇరుంగాట్టు కోట్టై, పొన్నలూరు, శ్రీపెరంబదూరు, పట్టునూల్ చత్రం, ఇరుంకులం పారిశ్రామిక వాడ, మాంబాక్కం, తిరుమంగళం, సుంకువారి చత్రం, సంత వేలూరు, పిల్లై చత్రం, నీర్వల్లూరు, పరందూరులలో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఈ నివేదికలో వివరాలను పొందు పరిచారు. -
గుకేశ్కు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, చైన్నె: భారత యువ చదరంగ క్రీడాకారుడు గుకేశ్ దొమ్మరాజు ప్రఖ్యాత ప్రపంచ చెస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో విజయం సాధించడంతో తమిళనాడులోని రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ పేర్కొంటూ, గతంలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సాధించిన ఘనతను ప్రస్తుతం అతి పిన్న వయసులో చరిత్ర సృష్టించే విధంగా టైటిల్ను గుకేశ్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో తనను గుకేశ్ కలిసిన సందర్భంగా తీసిన ఫొటోను తన సామాజిక మాధ్యమంలో సీఎం స్టాలిన్ షేర్ చేశారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొంటూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నా రు. గుకేశ్ టైటిల్ దక్కించుకోవడం దేశానికే కాదు తమిళనాడుకు గర్వకారణంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తదితరులు సైతం గుకేష్కు అభినందనలు తెలియజేశారు. విశ్వనాథన్ ఆనంద్ సైతం శుభాకాంక్షలు తెలుపుతూ అత్యంత పిన్న వయస్సులో ఈ టైటిల్ దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఇదిలా ఉండగా కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన గుకేష్ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబానికి చెందిన కుర్రోడు అనే విషయం తెలిసిందే. చైన్నెలో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదా వరి జిల్లాకు చెందిన తెలుగు కుటుంబం రజనీకాంత్, పద్మ దంపతుల కుమారుడు గుకేశ్. అతి చిన్న వయస్సులో భారత గ్రాండ్ మాస్టర్గా ప్రస్తుతం చరిత్ర సృష్టించిన గుకేశ్ చైన్నె శివారులోని అయనంబాక్కంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. రజనీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, పద్మ మైక్రోబయాలజిస్టుగా ఉన్నారు. చైన్నెకు టైటిల్తో రాబోతున్న గుకేశ్కు ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుకేశ్ -
యాప్ కొంప ముంచింది!
● ఓటింగ్ శాతంలో గందరగోళంపై ఎస్ఈసీ వివరణ ● సరిహద్దుల్లో మరింత నిఘా సాక్షి, చైన్నె: ఓటింగ్ శాతం గురించి ఎప్పటికప్పుడు సమాచార సేకరణకు సిద్ధం చేసిన యాప్ కొంప ముంచటంతోనే తీవ్ర గందరగోళం ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రద సాహు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల రోజున యాప్ కారణంగా సమస్య ఏర్పడినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ బూత్ అధికారులు ఆయా బూత్లలో నమోదైన ఓట్ల వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. తప్పని సరిగా ఇందులో నమోదు చేయాలనే ఆదేశాలు ఇవ్వక పోవడంతో అనేక మంది పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం గురించి స్పష్టత ఇవ్వలేక పోయారని వివరించారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతం పరిశీలించి సంతకాలు చేసి తమకు తెలియజేసేలోపు జాప్యం నెలకొందన్నారు. దీంతో యాప్లో ఉన్న వివరాలు, సమాచారం ఆధారంగా మీడియాకు ఎప్పటికప్పుడు ఓటింగ్ గురించి వివరాలను తెలియజేశామన్నారు. ఈ ప్రక్రియలో జాప్యం, గందరగోళం కారణంగానే సమగ్ర వివరాలను ప్రకటించేందుకు కొంత సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. 12 జిల్లాలో తనిఖీలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్లో సడళింపులు చేశామని పేర్కొంటూ, తమిళనాడు పొరుగున ఉన్న కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఎన్నికలు జరుగుతుండటాన్ని పరిగణించి ఆ రాష్ట్రాల సరిహద్దులలో నిఘా ఉంచామన్నారు. ఈ రాష్ట్రాల సరిహద్దులలోని తమిళ జిల్లాలు తిరువణ్ణామలై, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, సేలం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, తేని, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్కాశి జిల్లాలో మాత్రం 57 ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీల్లో నిమగ్నమైనట్లు వివరించారు. ఈ బృందాలు షిఫ్ట్ల వారీగా విధులలో ఉంటాయని, ఇక్కడి నుంచి ఆ రాష్ట్రాలకు నగదు, ఇతర వస్తువులు తరలించకుండా తనిఖీలు విస్తృతంగా సాతున్నాయన్నారు. సరిహద్దులు దాటే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రంలోని జిల్లాల మధ్య రూ. 50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు. పైన పేర్కొన్న జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల సరిహద్దులు దాటే వారి వద్ద రూ.50 వేలకు పైగా నగదు ఉంటే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement