Sakshi News home page

రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు

Published Fri, Oct 7 2016 11:13 AM

four injured in road accident in nalgonda district

నల్గొండ : నల్గొండ జిల్లా కోదాడ మేళ్లచెరువు రోడ్డులో శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం... కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement