వైద్యులకు మంత్రి యు.టి.ఖాదర్ సూచన
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం
సామాజిక బాధ్యతగా గుర్తించాలని హితవు
బెంగళూరు : వైద్య విద్యను పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవచేయడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ సూచించారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావాలని పేర్కొన్నారు. మడికేరిలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైద్యులు, కుటుంబ సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో ఉచితంగా విద్యతో పాటు వసతి, భోజనాన్ని పొందిన వారు సైతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప గొప్ప చదువులు చదివిన తాము పల్లెలకు వెళ్లడమా అన్న భావన చాలా మందిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. తాము గొప్ప చదువులు చదివామన్న భేషజాన్ని వైద్యులు వదిలి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అన్నారు. హెచ్1ఎన్1తో పాటు డెంగీ, మలేరియా, పాముకాటు, కుక్కకాటు తదితర అన్ని చికిత్సలకు అవసరమైన మందులు ఆస్పత్రుల్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
Related news
-
అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య
విశాఖ సిటీ: వైద్యురాలుగా స్థిరపడాలనుకుంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఎంత ఖర్చయినా తన కుమార్తెను డాక్టర్గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించారు. కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ హాస్టల్లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాశ్చాత్య పోకడలకు ఇమడలేని విద్యార్థిని ఇంటికి వెళ్లిపోతానని వేడుకున్నప్పటికీ.. పాస్పోర్ట్ తీసుకొని మొత్తం ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విద్యారి్థని తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పుకొని దేశం కాని దేశంలో తిండీ, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతోంది. అక్కడి పరిస్థితులను, ఆమె బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. దాని ద్వారా కజకిస్తాన్ దేశంలో ఆల్మటీ నగరంలో కాస్పియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటుకు డబ్బు చెల్లించారు. ఆ సమయంలోనే అక్కడి వసతి ఏర్పాట్లపై భవాని తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. గరŠల్స్, బాయ్స్కు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బు చెల్లించారు. భవాని ఈ నెల 11వ తేదీన కజకిస్తాన్కు వెళ్లింది. యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కలి ్పంచారు. కొద్ది రోజులపాటు సర్దుకున్న భవాని అక్కడి వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అబ్బాయిలతో కలిసి ఉండడం, వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్కు మార్చాలని కోరాడు. చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్కు కొంత మంది సీనియర్ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి వేరే హాస్టల్కు మార్పించినట్లు చెప్పింది. డబ్బు చెల్లిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామంటూ.. అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను అక్కడ ఉండలేనని, ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. ఫీజు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్పోర్ట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. హాస్టల్లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు. -
వైద్య విద్యలో ‘వెనుకబాటు’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అణగారిన వర్గాల సంఖ్య తక్కువగా ఉంటోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఇతర మైనారిటీలు తక్కువగా ఉంటున్నారు. ఎంబీబీఎస్లో కొంతమేరకు ఫర్వాలేదు కానీ, ఆపై స్థాయి మెడికల్ కోర్సుల్లో ఆయా వర్గాల శాతం తక్కువగా ఉండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఓసీలు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 2021–22లో వైద్య కోర్సుల్లో పాసైన వారిని ఆధారం గా చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 75 శాతం కాలేజీలను సర్వే చేశారు. ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నా, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వచ్చేసరికి వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఆ కోర్సులు సాధించడం, వాటిని పూర్తి చేయడానికి వయసు మీద పడటం ఒక కారణంగా చెబుతుండగా, పెళ్లి, పిల్లలు తదితర కారణాల వల్ల కూడా వాటిని చదవడానికి ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్లో ఓబీసీలు 24.4% సర్వేలో భాగంగా ఎంబీబీఎస్ పాసైన 54,547 మందిని ఎంపిక చేశారు. వారిలో పురుషులు 26,474 మంది (49 శాతం), మహిళలు 28,073 (51 శాతం) మంది ఉన్నారు. ఎంబీబీఎస్లో ఎస్సీలు 4,539 మంది (పురుషులు 2,310 మంది, మహిళలు 2,229 మంది) ఉండగా, వీరి శాతం 8.3గా ఉంది. ఇక ఎస్టీలు 2,100 మంది (పురుషులు 1008, మహిళలు 1092 మంది) ఉన్నారు. వీరి శాతం 3.8 శాతంగా ఉంది. ఓబీసీల్లో మొత్తం 13,350 మంది (పురుషులు 6,682, మహిళలు 6,668 మంది) ఉండగా, వీరు 24.4 శాతంగా ఉన్నారు. దివ్యాంగులు 112 (0.2 శాతం) మంది ఉన్నారు. ముస్లింలు 2,005 మంది ఉన్నారు. వారిలో పురుషులు 929 మంది, మహిళలు 1079 మంది ఉన్నారు. వీరి శాతం 3.6 శాతంగా ఉంది. ఇతర మైనారిటీలు 1,178 (2.1శాతం) ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో 210 (0.4 శాతం) మంది ఉన్నారు. ఇక ఓసీలు 57 శాతం మంది ఉన్నారు. ఎండీల్లో ఎస్సీ, ఎస్టీలు 11.3% ఎండీ కోర్సుల్లో జనరల్ మెడిసిన్, అనెస్థీíÙయా, చెస్ట్, రేడియాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్ వంటివి వస్తాయి. ఎండీ కోర్సుల్లో 15,732 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 7,343 (46 శాతం), మహిళలు 8,389 (54 శాతం) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1220 (7.7 శాతం) మంది, ఎస్టీలు 561 (3.6 శాతం) మంది, ఓబీసీలు 3,404 (22 శాతం) మంది, దివ్యాంగులు 12 (0.08%) మంది, ముస్లింలు 543 (3.5%) మంది, ఇతర మైనారిటీలు 357 (2.2%) మంది, ఈడబ్ల్యూఎస్ 187 (1.2%) మంది ఉన్నారు. ఓసీలు 59 శాతంగా ఉన్నారు. ఎంఎస్ కోర్సుల్లో ముస్లింలు 3.3% ఎంఎస్ కోర్సుల్లో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, చెవి, ముక్కు, కంటి తదితర సర్జరీ కోర్సులు వస్తాయి. ఎంఎస్లో 4,713 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 2,521 (53%) మంది, మహిళలు 2,192 (47%) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 337 (7.1%) మంది, ఎస్టీలు 128 (2.7%), ఓబీసీలో 1021 (21.6%) మంది, ముస్లింలు 155 (3.3%) మంది, ఇతర మైనారిటీలు 102 (2.1%) మంది, ఈడబ్ల్యూఎఎస్లో 8 (0.2%) మంది ఉండగా, ఓసీలు 63 శాతంగా ఉన్నారు. డీఎం కోర్సుల్లో ఓసీలు 89 శాతం మెడికల్ సూపర్ స్పెషాలిటీ (డీఎం కోర్సులు)ల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర కోర్సులు వస్తాయి. వీటిల్లో 469 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 362 (77%), మహిళలు 107 (23%) మంది ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (1.49%), ఎస్టీలు ముగ్గురు (0.6%), ఓబీసీలు 29 (6%), ముస్లింలు 0.6%, ఇతర మైనారిటీలు 9 (1.91%) మంది ఉండగా, ఓసీలు 89 శాతం మంది ఉన్నారు. ఎంసీహెచ్ కోర్సుల్లో మహిళలు 15 శాతమే ఎంసీహెచ్ (సర్జికల్ సూపర్ స్పెషాలిటీలు) జీర్ణకోశ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, వ్యాసు్కలర్ సర్జరీ తదితర కోర్సులు ఉంటాయి. వీటిల్లో 337 మందిని సర్వే చేశారు. పురుషులు 287 (85%), కేవలం మహిళలు 50(15) మంది మాత్రమే ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (2%), ఎస్టీలు ముగ్గురు (1%), ఓబీసీలు 15 (4.4%), ముస్లింలు ఒకరు, ఇతర మైనారిటీలు ముగ్గురు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో ఒకరు ఉండగా, ఓసీలు 90 శాతంగా ఉన్నారు. సూపర్ స్పెషాలిటీల్లో తగ్గుతున్న మహిళలు: డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా చేరుతుంటే, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో పురుషుల శాతమే ఎక్కువగా ఉంటోందని నివేదిక చెబుతోంది. ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వెళ్లేసరికి మహిళల శాతం చాలా తక్కువగా ఉంటోంది. దీనికిగల కారణాలను అన్వేషించాల్సిన అవసరముంది. ఆ మేరకు మహిళలకు వెసులుబాటు కల్పించాలి. దీనిపై జాతీయ మెడికల్ కమిషన్ దృష్టిసారించాలి. -
రెండు దరఖాస్తులు చాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సరళతరం చేసింది. ఎయిమ్స్ వంటి జాతీయస్థాయి మెడికల్ కాలేజీలతోపాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్లకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లకు కేవలం రెండు దరఖాస్తులతో పోటీపడొచ్చు. ఇందులో ప్రైవేటు కాలేజీల కోసం ఒకటి, ప్రభుత్వ కాలేజీల కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చు. విద్యార్థి కోరుకున్నచోట సీటు రాకుంటే.. తదుపరి కౌన్సెలింగ్లలో పాల్గొనవచ్చు. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయని ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించాయి. జాతీయ స్థాయి మెరిట్ అయినా వేర్వేరుగా..: దేశవ్యాప్తంగా 681 మెడికల్ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్బీ ఇలా 67,802 పీజీ మెడికల్ సీట్లున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రెండింటిలోనూ సీట్లను నీట్ ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అఖిల భారత ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తున్నారు. అభ్యర్థులు తమ రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారిని రాష్ట్ర కేటగిరీగా గుర్తించి, తదనుగుణంగా మెరిట్ జాబితాలను తయారు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లోని 15శాతం ఆలిండియా కోటా సీట్లకు, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్యూ, ఏఎంయూ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహించేది. అభ్యర్థులెవరైనా ఈ 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్లకోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ అధికారులు కూడా.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లకు ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేసి అడ్మిషన్లు చేస్తారు. ప్రైవేట్ సీట్లకూ జాతీయస్థాయి కౌన్సెలింగ్ ప్రస్తుతం రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు ఆయా రాష్ట్రాల్లోనే కౌన్సెలింగ్ జరుగుతోంది. వాటిలో కనీ్వనర్ కోటాకు వేరుగా, బీ కేటగిరీ, ఎన్నారై కోటాల సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలోని ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కౌన్సెలింగ్ కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఎన్ఎంసీ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కేటగిరీల సీట్లకు ఒకే దరఖాస్తు సరిపోతుంది, ఒకేసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. ► ఉదాహరణకు తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించగా, మిగతా 15శాతం ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. ఈ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఒకే దరఖాస్తు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఎక్కడో ఒకచోట సీటు పొందవచ్చు. నచ్చినచోట చేరవచ్చని, లేకుంటే తదుపరి కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని ఎన్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ► గత ఏడాది దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. అందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. ఒకేసారి విస్తృతంగా కౌన్సెలింగ్ ప్రస్తుత నిబంధనల మేరకు అభ్యర్థులు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్ వర్సిటీల్లోని కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, కొందరైతే 50 నుంచి 60 దరఖాస్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రాల్లోని కాలేజీల్లో 15% జాతీయ స్థాయి ఓపెన్ కోటాకు ఏ రాష్ట్రంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగేది. ఆ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రాల్లోని మిగతా కనీ్వనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరిపేవారు. ఈ ఏడాది నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి సీట్లన్నింటికీ ఒకేసారి.. అంటే ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
14న 5 వైద్య కళాశాలల ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్ఐడీసీ -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది.
Related News by category
-
నేడు రాయదుర్గం వైఎస్సార్సీపీ ఆత్మీయ భేటీ
బనశంకరి: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతుగా బెంగళూరులో నివాసం ఉండే రాయదుర్గం ప్రజలతో ఈనె 20వ తేదీ శనివారం బెంగళూరులో ఐటీ వింగ్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. సుంకదకట్టెలో పీ అండ్ టీ లేఔట్లో మాగడి రోడ్డు శివనంది కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఆరంభమవుతుంది. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఐటీ వింగ్ తెలిపింది. హాజయ్యేవారు ఈ లింక్లో https://-docs.googl.com/forms/d/e/1FAlpQLScSNUBRFOiOeQ6Yxaoqvcdnhxtjey9oBLcqW5BT-UsBmt2Q4A/viewform లో రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ముచ్చుమర్రి రాకేశ్రెడ్డి–6302989417 , శరన్– 7893830381, రాజశేఖర్రెడ్డి– 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
పలు ప్రాంతాలకు వర్ష సూచన
బనశంకరి: వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బెంగళూరు నగర, గ్రామాంతర, దక్షిణకన్నడ, గుల్బర్గా, రాయచూరు జిల్లాల్లో కొద్ది గంటల్లో వర్షం కురుస్తుందని భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మూడు చెరువుల పునరుద్ధరణబనశంకరి: రెండు నెలలుగా బెంగళూరు నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చడంతో ప్రజల దప్పిక తీర్చేందుకు రాయల్ చాలెంజర్స్ నడుం బిగించింది. ఇందులో భాగంగా మూడు చెరువులను అభివృద్ధి చేసింది. ఇండియా కేర్స్ ఫౌండేషన్తో కలిసి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇట్టిగల్పుర, సాదేనహళ్లి, కణ్ణూరు చెరువుల్లో పూడిక తొలగించారు. ఇట్టిగల్పుర, సాదేనహళ్లి చెరువులనుంచి సుమారు 1.2 లక్షటన్నుల పూడికను తొలగించారు. పూడిక మట్టిని 52 మంది రైతులు తమ పొలాలకు తరలించారు. చెరువుల్లో పూడిక తొలగించడంతో 17 ఎకరాల మేర నిల్వ ఉంటుంది. కణ్ణూరుచెరువు చుట్టూ ఔషధమొక్కలు, వెదురు ఉద్యానవనం నిర్మించినట్లు ఆర్సీబీ తెలిపింది. 24 నుంచి నిషేధాజ్ఞలు మైసూరు : ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24న సాయంత్రం ఆరు గంటలనుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మైసూరులోని 200 పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ బీ రమేష్ శుక్రవారం తెలిపారు. నగరంలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదన్నారు. ఊరేగింపులు, సభలు, ధర్నాలు నిషేధించినట్లు తెలిపారు. -
నేడు ప్రధాని మోదీ రాక
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని వివిధ లోక్సభ నియోజకవర్గాలు, గ్రామీణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వస్తుండడంతో కార్యకర్తల్లో, ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. నరేంద్ర మోదీ కార్యక్రమం శనివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని విహార్గేట్లో జరగనుందని తెలిపారు. శుక్రవారం ప్యాలెస్ మైదానంలో ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను విజయేంద్ర పరిశీలించి ఆ తర్వాత జరిగిన ప్రధాని భారీ బహిరంగ సభ కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయేంద్ర మాట్లాడుతూ చిక్కబళ్లాపుర కార్యక్రమం తర్వాత బెంగళూరులో ప్రధాని మోదీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 60 వేల మంది కూర్చొనేలా సీట్లను ఏర్పాటు చేసినట్లు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హుబ్లీలో జరిగిన ఘటన కేవలం వ్యక్తిగత కారణాలతో జరిగినట్లు సీఎం, హోం మంత్రి చెప్పడం శోచనీయమని, దేశద్రోహులకు రక్షణ కలిగించేలా వారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఒక్కరోజే 8 హత్య కేసులు నమోదు అయ్యాయని, ఇలా నేరాలు రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు, చిక్కబళ్లాపురంలో బహిరంగ సభలు ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర -
రైస్పుల్లింగ్ పేరుతో వంచన
బనశంకరి/కృష్ణరాజపుర: రైస్ పుల్లింగ్పేరుతో నకిలీ తామ్రపాత్ర చూపించి వంచనకు పాల్పడిన ముగ్గురు వంచకులకు బేడీలు పడ్డాయి. పంజాబ్కు చెందిన సన్నిగిల్, తమిళనాడువాసి రమేశ్, బెంగళూరు నగరనివాసి శివశంకర్ అనే నిందితులను శుక్రవారం జయనగరపోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ. 69.79 లక్షల నగదు, నకిలీ తామ్రపాత్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జయనగర 6 వబ్లాక్ యడియూరుచెరువు వద్ద రైస్పుల్లింగ్ తామ్రపాత్ర విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. శుక్రవారం జయనగర పోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్చేశారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరిచారు. నిందితులనుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని 5 రోజులపాటు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా నిందితులు చాలా చోట్ల అనేక మందిని వంచించినట్లు పోలీసులు తెలిపారు. రూ.69.79 లక్షలు స్వాధీనం -
అర్ధరాత్రి మారణకాండ
సాక్షి బళ్లారి: గదగ్ నగరంలో గురువారం అర్ధరాత్రి మారణకాండ చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27), పరశురామ (55), లక్ష్మీ (45), ఆకాంక్ష(16)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు పైఅంతస్తులో గాఢ నిద్రలో ఉండగా దుండగులు చొరబడి వేట కొడవవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యోదంతానికి పాల్పడ్డారు. గదిలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై పారింది. దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితులు యత్నించగా వెంటాడి నరికినట్లుగా ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించాయి. భీతావహంగా ఘటన స్థలం హత్య జరిగిన స్థలం రక్తం మడుగులతో భీతావహంగా ఉంది. ఇంటిలోని వస్తు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. మహిళలు అనే కనికరం లేకుండా కొడవళ్లతో నరికి హత్య చేయడం నగరవాసులను కలవరపాటుకు గురి చేసింది. హంతకులు ఎవరు.. హత్యోదంతం కుటుంబ గొడవలతోనే జరిగినట్లు కొందరు చెబుతున్నారు. హంతకులు ఎవరు, ఏ ప్రాంతంనుంచి వచ్చారు..లోపలకు ఎలా చొరబడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ వీఎస్ నేమగౌడ ఆధ్వర్యంలో క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గదగ్లో దారుణహత్యలు ఒకే ఇంటిలో నలుగురు హతం మారణాయుధాలతో చెలరేగిన దుండగులు కుటుంబ కలహాలే హత్యలకు కారణమా? ఆ రాత్రి వెళ్లిపోయి ఉంటే.. సునంద ప్రకాష్ బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27) వివాహా నిశ్చితార్థానికి కొప్పళకు చెందిన పరుశురామ్(55), లక్ష్మి (45) దంపతులు తమ కుమార్తె ఆకాంక్ష(17)తో కలిసి వచ్చారు. 18వ తేదీ ఉదయం వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాలు ముగిసిన తర్వాత బంధువులు, మిత్రులు వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్లగా పరుశురామ, లక్ష్మి, ఆకాంక్ష కొప్పళకు తిరిగి వచ్చేందుకు గురువారం రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బంధువుల ఒత్తిడితో కార్తీక్ బాకళె ఇంటిలోనే వారు బస చేశారు. కార్తీక్బాకళె(27)తో పాటు పైఅంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి జరిగిన హత్యోదంతంలో కార్తీక్ బాకళెతోపాటు పరశురామ, లక్ష్మి, ఆకాంక్షలు కూడా బలయ్యారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement