హైదరాబాద్ : ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని విస్పర్ వ్యాలీలో జరిగిన అంత్యక్రియల్లో పలువురు పాల్గొన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో మరణించిన విషయం తెలిసిందే.
'ప్రగతి' హనుమంతరావు అంత్యక్రియలు పూర్తి
Published Tue, Mar 3 2015 12:10 PM
Related news
-
సీఆర్ ఫౌండేషన్కు ఎస్బీఐ వాహనం
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలను ఆదుకోవడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉంటుందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు. అవసరమైనవారికి వివిధ రూపాల్లో ఎస్బీఐ కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా సాయం అందిస్తోందని తెలిపారు. కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్కు మారుతీ ఈకో ఏడు సీట్ల వ్యాన్ను శుక్రవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యక్తిగా సామాజికసేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తి కలిగిస్తోందన్నారు. బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో 75 వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు స్వామినాథన్ జానకిరామన్ తెలిపారు. బ్యాంక్ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు, సామాజిక సంక్షేమంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలతో బలహీనవర్గాలను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఫణీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
అత్యాచార నిందితుడి అరెస్టు
సాక్షి యాలాల(హైదరాబాద్) : జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కిందట కేసు నమోదుతో పాటు అత్యాచార కేసును నమోదు చేసినట్లు చెప్పారు. యాలాల ఎస్ఐ విఠల్రెడ్డితో కలిసి విశ్వనాథ్పూర్ గ్రామంలో బాధిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన అనంతరం జరిగిన పరిణామాలను బాధితురాలి తల్లిని అడిగి తెలుసుకున్నారు. సమాజానికి చీడగా మారిన ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మతిస్థితిమితం లేని బాలికపై నక్కల శేఖర్ అత్యాచారం చేసిన ఘటనతో గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని పలువురు గ్రామస్తులు పోలీసుల ఎదుట వాపోయారు. నిందితుడి కుటుంబసభ్యులు తమ ఇంటి వద్ద మారణా యుధాలతో సంచరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ నిందితుడి కుటుంబసభ్యులు దౌర్జన్యానికి పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. నిందితుడికి కోర్టులో కఠినశిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. త్వరలో గ్రామంలో పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. నిందితుడు శేఖర్ను బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట సర్పంచ్ సత్యమ్మ, వైస్ ఎంపీపీ పసుల రమేశ్ ఉన్నారు. -
ఏబీకే ప్రసాద్కు సతీవియోగం
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ సతీమణి సుధారాణి కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలకు ఆమె మృతి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకు చెందిన సుధారాణిని, కృష్ణా జిల్లా ఉప్పులూరుకు చెందిన ఏబీకే ప్రసాద్ 1955లో వివా హం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు హేమలత, స్వర్ణలత, విశ్వభారతి, రాధి క ఉన్నారు. ఏబీకే ప్రసాద్ భార్య సుధారాణితో కలసి కొండాపూర్లోని చండ్ర రాజేశ్వర్రావు ఫౌండేషన్లోని వృద్ధాశ్రమంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. నివాళులర్పించిన ప్రముఖులు కిమ్స్ ఆస్పత్రి నుంచి మంగళవారం ఉదయం సుధారాణి భౌతికకాయాన్ని సీఆర్ ఫౌండేషన్కు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వర్దెల్లి మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, వార్త ఎడిటర్ సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ, ఇతర పాత్రికేయ ప్రముఖులు నివాళులర్పించారు. ఏబీకే ప్రసాద్ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధారాణి చితికి నిప్పంటించిన సోదరుడు ఏబీకే ప్రసాద్ సతీమణి సుధారాణి అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. సుధారాణి చితికి ఆమె సోదరుడు చలసాని వేణుదుర్గాప్రసాద్ నిప్పంటించారు. సుధారాణి మృతితో చండ్ర రాజేశ్వర్రావు ఫౌండేషన్లో విషాదఛాయలు అలముకున్నాయి. వృద్ధాశ్రమంలోని పలువురు ప్రముఖులు సుధారాణికి నివాళులర్పించారు. ఆప్తురాలిని కోల్పోయామని కన్నీళ్లపర్యంతమయ్యారు. -
'ప్రగతి' ఇంటి పేరు అభ్యుదయం ఆయన ఊరు
*విద్యార్థి నేతగా, ఉద్యమకారుడిగా సేవలు, ప్రగతి హనుమంతరావుగా గుర్తింపు నిరంతర శ్రామికుడు 'ప్రగతి ప్రింటర్స్ హనుమంతరావుగా' రాష్ట్ర ప్రజలకు చిరపరిచితుడైన పరుచూరి హనుమంతరావు సోమవారం రెడ్హిల్స్లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కేవలం రూ.6వేలతో ఆయన స్థాపించిన ప్రగతి ప్రింటర్స్ సంస్థ నేడు రూ. 200 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. తన ఉద్ధాన పతనాలు, ఒడిదొడుకులపై ఇటీవల ఆయన 'సాక్షి'తో ముచ్చటించారు. కృష్ణాజిల్లాలోని చల్లపల్లి సమీపంలోని చిట్టూర్పుకు చెందిన ఆయన సాధించిన విజయాలపై 'జ్ఞాపకాలు'...ఆయన మాటల్లోనే. ఎన్నో ఢక్కామొక్కీలు ఆ రోజుల్లో మాఊళ్లో బడి లేదు. దగ్గర్లోని అంగలూరు నుంచి ఓ పంతులు వచ్చి ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేవారు. ఆయన దగ్గర కొంతకాలం చదువుకున్న తరువాత 3వ ఫారమ్కు చల్లపల్లి హైస్కూల్లో చేరాను. మచిలీపట్నంలో ఎస్సెస్సెల్సీ పూర్తయ్యాక హిందూ కాలేజ్లో ఇంటర్లో చేరాను. ఒకవైపు చదువుకుంటూనే అఖిల భారత విద్యార్ధి సమాఖ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాన్ని. మొదటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా)పక్షాన బాంబేలో అప్పటి కమ్యూనిస్టు నేత ఎస్.ఎ.డాంగే నేతృత్వంలో తెలుగులో బుర్రకథలను ప్రదర్శించాము. అప్పటి ప్రఖ్యాత రచయిత కె.ఎ.అబ్బాస్ రచించిన ‘హమ్ ఏక్ హై’ హిందీ నాటం మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1956లో 'విశాలాంధ్ర' నుంచి బయటకు ఆ తరువాత విశాలాంధ్ర పత్రికలో చేరాను. వార్తలు రాయడంతో పాటు, ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. తాతినేని చలపతిరావు, మిక్కిలినేని రాధాకృష్ణ, బిఎన్ రెడ్డి, సావిత్రి (నటి), ఎస్.జానకి (గాయని) వంటి వాళ్లంతా ప్రజా నాట్యమండలి నుంచి వచ్చిన వాళ్లే. అప్పటికే పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. తాపీ ధర్మారావు కుమారుడు చాణక్య నా స్నేహితుడు. అతను నాగార్జున ఫిలిమ్స్ స్థాపించి ధర్మారావు రాసిన 'ఎత్తుకు పై ఎత్తు' సినిమా తీశారు. చాణక్య ఆహ్వానం మేరకు సినిమా రంగంలోకి వచ్చాను. అప్పటికే రామకృష్ణ హైదరాబాద్లో సారథీ స్టూడియో ఏర్పాటు చేశారు. నాగార్జున ఫిలిమ్స్ను కూడా తమతో కలిసి పని చేయాలని కోరడంతో 1957 ఆగస్టు 1న 'నాగార్జున ఫిలిమ్స్'గా తెలుగు సినిమా మొట్టమొదట హైదరాబాద్కు వచ్చేసింది. 1958లో 'మా ఇంటి మహాలక్ష్మి' 'ఆత్మబంధువు' వంటి సినిమాలు తీశాము. ఆ సమయంలో నెగెటివ్ ఫిల్మ్ కొరత ఎక్కువగా ఉండడంతో సినిమా రంగంలో ఎంతో కాలం ఉండలేకపోయాను. కదిలిన ఆంధ్ర... వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటంతో తెలంగాణ సమాజం యావత్తు యుద్ధభూమిగా మారింది. ఆ పోరాటానికి మద్ధతుగా ఆంధ్ర జిల్లాలన్నీ కదిలాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేశాము. ఆ రోజుల్లో బ్రిటీష్ మలబారు పోలీసులకు నేతృత్వం వహించిన పళయనప్ప ఆంధ్ర ప్రాంతంపై ఉక్కు పాదం మోపాడు. పోలీసులు నన్ను కూడా అరెస్టు చేశారు.‘ ఆర్ యూ కమ్యూనిస్ట్’ అని అడిగారు. కాదంటే వదిలేసే వాళ్లే. కానీ ‘ఎస్’ అన్నాను గర్వంగా. ఇంకేముంది. తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో వేశారు. 6 నెలల తరువాత కడలూరు జైలుకు మార్చారు. 3 ఏళ్లు అక్కడే ఉన్నాను. ఏకే గోపాలన్, కడియాల గోపాలరావు, మద్దుకూరి చంద్రశేఖర్, విశాలాంధ్ర ఎడిటర్ రాజగోపాల రావు, మోటూరి హనుమంతరావు వంటి పెద్దలంతా ఆ జైల్లోనే పరిచయమయ్యారు. 'ప్రగతి' మార్గంలో... వాసిరెడ్డి సీతాదేవి, నేను కలిసి చెరో రూ.6 వేల పెట్టుబడితో 1962 సెప్టెంబర్ 1వ తేదీన ‘ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్’ ప్రారంభించాము. లక్డికాఫూల్లో రెండు గదులు అద్దెకు తీసుకొని ప్రెస్ ఏర్పాటు చేశాము. నాణ్యత, నమ్మకం రెండింటిని నమ్ముకున్నాము. అప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఒకరిద్దరు ప్రింటర్స్ కంటే ఎక్కువే తీసుకున్నా అదే స్థాయిలో క్వాలిటీ అందించాము. ఆ తరువాత కొద్ది రోజులకు వాసిరెడ్డి సీతాదేవి తన భాగస్వామ్యాన్ని విరమించుకున్నారు. ఏడాదిన్నర కాలంలోనే 70 వేల పుస్తకాల ముద్రణకు ఆర్డర్ వచ్చింది. వ్యాపారం పుంజుకోవడంతో 1978లో లక్డికాఫూల్ నుంచి రెడ్హిల్స్కు మార్చాము. సంస్థ బహుముఖంగా విస్తరించింది. అత్యాధునిక ప్రింటర్లు, టెక్నాలజీ వాడడంతో దేశవిదేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ప్రింటింగ్ రంగంలో అనేక అవార్డులు లభించాయి. నాకు ఎంతో తృప్తిగా ఉంది అంటూ..ప్రగతి యాత్రను ముగించారు. ప్రజానాట్య మండలిలో.. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో మద్రాసులో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ నిర్వహణ బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. తరిమెల నాగిరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి పెద్దలంతా అప్పుడే పరిచయమయ్యారు. -
'ప్రగతి' హనుమంతరావు కన్నుమూత
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సోమవారం మరణించారు. కమ్యూనిస్ట్ ఉద్యమం, స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్న హనుమంతరావు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణాజిల్లా చిట్టూర్పులో 1921లో జన్మించిన పరుచూరి హనుమంతరావు బందరు హిందూ హైస్కూల్లో మెట్రిక్ వరకు చదివారు. మద్రాసు పచ్చయ్యప్ప కాలేజి నుంచి బి.ఏ. పూర్తిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొని రాజమండ్రి, కడలూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. బొంబాయి పీపుల్స్ ధియేటర్లో బలరాజ్ సహానీ వంటి ప్రముఖులతో కలిసి నాటక ప్రదర్శనలిచ్చారు. 1962లో హైదరాబాద్లో ప్రగతి ప్రెస్ స్థాపించి మంచి ప్రమాణాలు పాటించారు.
Related News by category
-
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్గార్డ్ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్రతన్లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024 -
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు. -
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement