Sakshi News home page

'అల్ట్రాసిటీగా గజ్వేల్'

Published Sat, May 9 2015 2:12 PM

'అల్ట్రాసిటీగా గజ్వేల్' - Sakshi

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం తన సొంత జిల్లా మెదక్లో పర్యటించారు. జిల్లా పరిధిలోని సొంత నియోజక వర్గమైన గజ్వేల్లో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ను అల్ట్రాసిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఔటర్ రింగు రోడ్డుతో పాటు.. 24 గంటలు మంచి నీటి సదుపాయం కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలియజేశారు.

Advertisement

What’s your opinion

Advertisement