Sakshi News home page

పోలీసు శాఖకు హోంమంత్రి అభినందన!

Published Mon, Sep 8 2014 7:08 PM

పోలీసు శాఖకు హోంమంత్రి అభినందన!

హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి తోడ్పాటును అందించిన పోలీసు శాఖను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అభినందించారు. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారని.. వారి కృషి అభినందనీయమని నాయిని అన్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ..  హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంపొందిస్తామని నాయిని అన్నారు. హైదరాబాద్‌ లోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో గణేష్‌ శోభాయాత్రను డీజీపీ అనురాగ్‌శర్మతో కలిసి నాయిని పర్యవేక్షిస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement