తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా): తాండూరు పట్టణంలోని గుమస్తానగర్లో అద్భుతం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని దేవుడిగది నేలలోంచి తేనె ఊరింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గుమస్తానగర్కు చెందిన సొనీబాయి స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం ఉగాది పండుగ సందర్భంగా ఆమె ఓ కుండలో పచ్చడి తయారుచేసి దేవుడి గదిలో ఉంచింది.
ఆదివారం సాయంత్రం పచ్చడికుండ దగ్గర నేల నుంచి ఊటలాగ కనిపించింది. కుండలోంచి పచ్చడి కారుతోందేమోనని ఆమె మొదట భావించింది. ఊట ఎక్కువ కావడంతో పరిశీలించగా తేనె ఊరుతోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని తిలకించారు. దేవుడి మహిమ అని పూజలు నిర్వహించారు.
# Tag
Related news
-
తేనెని నేరుగా వేడిచేస్తున్నారా?
మనం నిత్యం కొన్ని పదార్థాలను నిల్వ చేసేటప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటాం. ఒకవేళ పాడైతే ఎండలో పెట్టడమో లేక ఓ సారి మంటపై వేడిచేయడమో చేస్తాం. కానీ అలా అన్ని వేళలా అన్ని రకాల పదార్థాలకు పనికిరాదు. ఏవీ వేడి చేస్తే మంచిది? వేటిని నేరుగా వేడి చేయకూడదు వంటి ఆసక్తికర ఇంటి చిట్కాలు తెలుసుకుందామా! తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకుపోతుంటుంది. అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. తేనెను ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు. ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి. నీటి వేడితో ఐదు – పది నిమిషాల్లో తేనె కరుగుతుంది. ఒకవేళ తేనెను నేరుగా వేడిచేస్తే పోషక విలువలు పోయి పాయిజన్గా మారిపోతుందట. పైగా నేరుగా వేడి చేయడం వల్ల జిగురు వంటి పదార్థంలా మారిపోతుంది. దాన్ని గనుక ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని, అమా అనే టాక్సిన్గా మారుతుంది. దీంతో మనకు కడుపు నొప్పి రావడం, శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగుటం వంటి దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పాల ప్యాకెట్లు ఫ్రిజ్లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్లను నేరుగా పెట్టకూడదు. ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చే లోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది. కాబట్టి ప్యాకెట్ని నీటితో కడిగి ఫ్రిజ్లో పెట్టడం మంచిది. వెల్లుల్లి రేకలు పొట్టు సులువుగా వదలాలంటే... వెల్లుల్లి రేకను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుక వైపు (మందంగా ఉండే వైపు, ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది) తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేక తేలిగ్గా విడివడుతుంది. పైనాపిల్ను కట్ చేయడానికి పెద్ద చాకులను (షెఫ్స్ నైఫ్) వాడాలి. ముందుగా కాయ పై భాగాన్ని, కింది భాగాన్ని తొలగించాలి. ఇప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి. ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి. బటర్ను వంట మొదలు పెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాలగిన్నె మూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది. అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. ఐస్క్రీమ్ సర్వింగ్ స్పూన్లు ఇంట్లో ఉండవు. పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి. ఒక స్లయిస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది. కాబట్టి ప్రతి స్లయిస్కూ ఓ సారి వేడి నీటిలో ముంచాలి. (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్కు చెక్!
చలికాలంలో చాలా మంది తమ ముఖాలు అందంగా కనిపించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. చలి తీవ్రతతో.. ముఖం నిగారింపు తగ్గడం, పెదవులు పొడిబారిపోవడం, కళ్లకింద నల్లరంగు చారలు ఏర్పడటంలాంటి సమస్యలు కనిపిస్తూంటాయి. వీటిని అధిగమించడానికి మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తెలియని ఫేస్క్రీమ్స్ వాడి లేని సమస్యలను కొనితెచ్చుకుంటారు. మరి వీటినుండి బయటపడాలంటే ఈ చిన్న చిన్న బ్యూటిప్స్ని వాడితే చాలు. అవేంటో చూద్దాం. రోజ్ వాటర్, తేనెతో.. రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ్ద నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. ఇంగువతో నిగారింపు.. రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్వాటర్ వేసి చక్కగా కల΄ాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాల΄ాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ΄్యాక్ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు ΄ోతాయి. చర్మం ΄÷డిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ఇవి కూడా చదవండి: ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..! -
దేశంలో ప్రతి రోజు ఎంత మంది కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుసా?
ఢిల్లీ: రైతులు, రోజువారి కూలీల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) సంచలన విషయాలను బయటపెట్టింది. దేశంలో ప్రతి రోజు 154 మంది రైతులు, రోజువారి కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో కుటుంబ సమస్యలు, అనారోగ్యం వల్లే అత్యధికంగా మరణిస్తున్నారని వెల్లడించింది. 2021లో ఈ సంఖ్య 144గా ఉంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో పనిచేసేవారు 6.6 శాతం కాగా.. రోజువారి కూలీలు 26.4 శాతం మేర ఉన్నారు. అంటే 2022 ఏడాదికి మొత్తం 1,70,924 మంది ఆత్మహత్య చేసుకోగా.. అందులో రోజువారి కూలీలే 44,713 మంది ఉన్నారు. ఇందులో మగవారి సంఖ్య 41,433 కాగా స్త్రీల సంఖ్య 3,752గా ఉంది. 2021లో ఆత్మహత్య చేసుకున్న రోజువారి కూలీలు 25.6 శాతంగా ఉన్నారు. 2022 నివేదిక ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న స్వయం ఉపాధి, వృత్తి నిపుణులు 9.6 శాతంగా ఉన్నారు. ఇందులో 14,395 మంది ఉద్యోగులు కాగా , 18,357 మంది స్వయం ఉపాధి వ్యక్తులు బాధితులుగా నమోదయ్యారు. 2022 ఏడాదికి మొత్తం ఆత్మహత్యల్లో నిరుద్యోగులు 9.2 శాతంగా ఉన్నారు. ఇందులో 12000 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2022 సంవత్సరానికి దేశంలో మొత్తం 1,70,924 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1,64,033గా ఉంది. 2021తో పోల్చితే 2022లో దాదాపు 4% మేరకు ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు(7,8776) మహారాష్ట్ర(6,275), మధ్యప్రదేశ్(5,371) తెలంగాణ(4,513) ముందు వరుసలో నిలిచాయి. ఇదీ చదవండి: National Crime Records Bureau: అయినా భర్త మారలేదు -
నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్ కపూర్ సైతం..
అప్పుడే పుట్టిన పిల్లలకు కొందరు తేనె పెడుతుంటారు. మాటలు తెనె పలుకుల్లా ఉంటాయని మన పెద్దవాళ్ల ఆలోచన. చెప్పాలంటే తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా మన పెద్దలు అప్పుడే పుట్టిన పిల్లలకు తేనె పెడుతుంటారు. ఇలా పెట్టడంతో పిల్లలు చనిపోయిను ఉదంతాలు కూడా ఉన్నాయి. ఐతే అసలు తేనె పిల్లలకు పెట్టొచ్చా? ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధా గుణాలు కలిగిన తేనె చిన్నారుల పాలిట విషమా? తదితరాల గురించే ఈ కథనం. ఏదీఏమైనా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తేనె అస్సలు పెట్టొదనే అంటున్నారు ఆరోగ్య నిపుణలు. బాలీవుడ్ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ సైతం ఇదే చెబుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలా చేసినప్పటికీ నిర్మొహమాటంగా మీ ముక్కు పచ్చలారని చిన్నారులకు తేనెను ఇవ్వనని గట్టిగా చెప్పండి అని అంటోంది సోనమ్. అది వారి ప్రాణాలను హరించే విషం అంటూ హితవు పలుకుతుంది. తాను కూడా తన కొడుకు వాయు కపూర్కి ఇవ్వలేదని. ఇది మన ఆచారమే అయినా..దాన్ని తను స్కిప్ చేశానని. అలాగే మీరు కూడా చేయండి అని సోషల్ మీడియా వేదికగా చెబుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో పూర్తిస్థాయి జీర్ణవ్యవస్థ ఉండదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రాణాంతకం కూడా కావచ్చు. దయచేసి ఇలాంటి పనులు మానుకుండి. కోరి కోరి గర్భశోకాన్ని అనుభవించొద్దు ఓ తల్లిగా చెబుతున్నా అని సోనమ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తోంది. “had an argument with Pandit ji for feeding Honey to newly born child because i don’t believe in these traditions”, like seriously ??? Wokeism at its peak!! pic.twitter.com/fBbQ7TVGVL — Moana (@ladynationalist) September 27, 2023 శిశువులకు తేనె ఎందుకు సురకక్షితం కాదంటే... శిశువులకు తేనె ఎందుకు సురక్షితం కాదని తెలుసుకోవడానికి తాను ఆరోగ్య నిపుణులను కూడా సంప్రదించినట్లు తెలిపింది సోనమ్. అంతేగాదు ఆమె శిశువులకు తేనె ఎందుకు ఇవ్వకూడదో వివరిస్తూ, సికె బిర్లా హాస్పిటల్ గురుగ్రామ్లోని నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ డాక్టర్ శ్రేయా దూబే చెప్పిన విషయాలను కూడా పంచుకుంది. తేనెలో క్లోస్ట్రిడియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుల ప్రేగులలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదికాస్త శిశు బోటులిజం అనే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఈ బొటులిజంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో.. ఒకటి ఆహారం ద్వారా వచ్చేవి, రెండు గాయం ద్వారా వచ్చే శిశు బొటులిజం. ఈ బ్యాక్టీరియా శిశువుల నరాలపై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, తేనెనూ ఏ విధంగానూ శిశువులకు తినిపించకపోవడమే మంచిదిని సోనమ్ గట్టిగా నొక్కి చెబుతోంది. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తేనెలో "క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే తక్కువ ఆక్సిజన్ పరిస్థితులలో ప్రమాదకరమైన టాక్సిన్లను (బోటులినమ్ టాక్సిన్స్) ఉత్పత్తి చేసే బాక్టీరియం ఉంటుందని పేర్కొంది. శిశు వైద్యురాలు డాక్టర్ మీనా జే మాట్లాడుతూ..వడకట్టలేని లేదా ప్రాసెస్ చేయని తేనె శిశువులకు ఇవ్వడం వల్ల న్యూరోటాక్సిసిటీకి గురై కండరాల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది శిశువుని మరణం అంచులదాక తీసుకువెళ్తుందని తెలిపారు. తొలుత మలబద్దకం, హైసోటోనియాతో మొదలవుతుంది. క్రమేణ పక్షవాతానికి దారితీసి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. చివరికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్లోని యశోద ఆస్పతత్రిలోని శిశు వైద్యుడు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి మాట్లాడుతూ.. తేనె వల్ల శిశు బొటులిజంకి గురవ్వుతారని అన్నారు. దీనివల్ల కండరాల బలహీనతకు దారితీసి కనీసం పాలను కూడా ఫీడ్ చేయలేనంత బలహీనంగా మారిపోయి విరేచనలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. నవజాత శిశువుల్లో అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. దీని ఫలితంగా మనం ఆచారం పేరుతో శిశువులకు తేనెను ఇచ్చేస్తాం. వారి ప్రేగుల్లో తేనెలో ఉన్న టాక్సిన్స్తో పోరాడే రక్షణ పూర్తిగా ఉండదు. జీర్ణసమస్యలు ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీసస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు తేనె ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి. ఇక ఇండియన్ పీడియాట్రిక్ ప్రకారం అప్పుడే పుట్టిన శిశువులకు జంతువులకు సంబంధించిన పాలు, పాల పొడి, టీ, నీరు, గ్లూకోజ్ నీరు లేదా ఇతర ఏ ద్రవాలు ఆహారంగా వ్వకూడదని హానికరం అని పేర్కొంది. ప్రజలు తేనెని శిశువులోని ప్రేగు కార్యకలాపాలను ఉత్తేజపరిచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుందని భావిస్తారు. వాస్తవానికి తేనె శరీరంలో చాలా నీటిని తీసుకుంటుంది. ఫలితంగా వదులుగా ఉండే మలం వస్తుంది .కానీ అప్పుడే ఉండే శిశువు శరీరంలో ఆ స్థాయిలో నీరు ఉండదు, పైగా అరిగించుకునేంత జీర్ణవ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉండదు. అందువల్ల ఇలాంటి ఆచారాన్ని మానుకోవాలని డాక్టర్ అమిత్ గుప్తా చెబుతున్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నవజాత శిశువుల తొలి ఆహారంగా ఆవుపాలు లేదా తేనె వంటివి ఇస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పుని గట్టిగా నొక్కి చెబుతున్నారు. తల్లిపాలు తప్ప మిగతావన్నీ శిశువుకు లేనిపోని ఆరోగ్య సమస్యలను కలిగించేవేనని అధ్యయనంలో వెల్లడైంది. కావునా మనం ఆ సంస్కృతులు, ఆచారాలు అనేవి ఆయా పరిస్థితులు దృష్ట్యా వచ్చినవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అంతటి స్థాయిలో లేవు అనేదాన్ని కూడా మనం గమనించి విచక్షణతో వ్యవహరించాల్సి ఉంది. (చదవండి: ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..) -
తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..?
తేనె ఆరోగ్యానికి చాలామంచిదని తినే ఆహరంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు చాలామంది. కానీ తేనెని ఇలా ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే ఎక్కువగా తీసుకుంటే అంతే హానికరం అని చెబుతున్నారు. ఈ తేనెను కొన్ని పదార్థాలతో కలిసి తీసుకొవద్దని హెచ్చరిస్తున్నారు కూడా. ముందుగా ఈ తేనె ఏవిధంగా ఆరోగ్యానికి హనికరమో చూద్దాం! తేనె వల్ల కలిగే దుష్ప్రయోజనాలు: పుప్పొడి గింజలు శరీరంపై పడితే అలెర్జీ ఉన్నవారు అస్సలు తేనెను తీసకోకూడదు. దీని వల్ల అలర్జీ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే చిన్న పిల్లలకు అయితే బోటులిజం అనే కండరాల బలహీనత లేక పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి రావడం, పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తేనెలో ఉండే ఫ్రక్టోజ్ చిన్న ప్రేగు శోషక సామర్థా్యన్ని తగ్గిస్తుంది. దీంతో కడుపులో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగాపెరగవచ్చు. అందువల్ల మధుమేహ రోగులు తేనెను తీసుకోకపోవడమే మంచిది. తేనెను ఇలా అస్సలు తీసుకోవద్దు! ►తేనె దేశీయ నెయ్యితో సమాన పరిమాణంలో అస్సలు తీసుకోవద్దు. ఇది అత్యంత విషం. ►గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు తేనెను ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు ►చాలా వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!)
Related News by category
-
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్
సాక్షి,కరీంనగర్: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. మానకొండూర్లో ఆదివారం(ఏప్రిల్27) నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. ‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. -
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్లో కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్పేట కారిడార్లో నాగోల్కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్మెంట్పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్రింగ్రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్పాస్తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్పేట మీదుగా ఎల్బీ నగర్కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. ♦ బైరామల్గూడ, సాగర్రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్మెంట్ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement