Sakshi News home page

ఆ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలి

Published Tue, Jun 17 2014 12:27 AM

IJU and TUWJ condemn ban of tv9, andhrajyothy programs

ఐజేయూ, టీయూడబ్ల్యూజే
టీవీ9 కార్యక్రమంపై ఖండన
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) ఖండించాయి.  ఈ నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛకు, సమాచారాన్ని తెలుసుకునే హక్కుకు విఘాతం కలిగిస్తున్నదని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, విరాహత్ అలీలు సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. టీవీ చానళ్లలో ప్రసార నాణ్యత, మంచీ చెడ్డలను నిర్ణయించే అధికారాలను సొంతం చేసుకునే ప్రయత్నాలను ఎంఎస్‌ఓలు విరమించుకొని, తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. ప్రజాప్రతినిధుల పట్ల టీవీ-9 ప్రసారం చేసిన కార్యక్రమాన్ని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ఖండిస్తున్నాయని పేర్కొన్నారు.


 

Advertisement

What’s your opinion

Advertisement