Sakshi News home page

ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు'

Published Thu, Aug 21 2014 9:32 AM

ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు' - Sakshi

నిజామాబాద్ ‌: ఓ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.  బిక్కనూరు మండలం గుర్జకుంటకు చెందిన విద్యార్థినిని అదే గ్రామానికి చెందిన సునీల్ రెడ్డి ఫోటోలు తీశాడు.  వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిపై నిర్భయ, ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హారజపరిచి రిమాండ్కు తరలించారు.

 

Advertisement

What’s your opinion

Advertisement