Sakshi News home page

జిల్లాకు రాహుల్ ?

Published Wed, Apr 29 2015 12:59 AM

Rahul Gandhi's tour to telangana

- మే రెండో వారంలో పర్యటన
- రైతు కుటుంబాలకు పరామర్శ
- టూర్ షెడ్యూల్‌పై టీపీసీసీ కసరత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే నెలలో జిల్లాలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల పర్యటనలో భాగంగా మే రెండో వారంలో ఆయన తెలంగాణకు రానున్నారు. దీంట్లో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేలా టీపీసీసీ పర్యటనను ఖరారు చేస్తోంది.

రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రైతు కుటుంబాలను కలుసుకునేలా టూర్ షెడ్యూల్‌ను రూపొందిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. యువనేత పర్యటనను విజయవంతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆగపల్లిలో చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి నుంచి నల్లగొండ జిల్లా మునుగోడు పర్యటనకు రాహుల్ వెళ్లేలా కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తో కాంగ్రెస్ నాయకత్వం సూత్రప్రాయంగా చర్చించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నందున.. దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీపీసీసీ నియోజకవర్గాల ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement