సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, పెరిగిపోతున్న రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు గాను దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సమావేశమవనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనే ఈ ఒక్కరోజు సదస్సు మంగళవారం గాంధీభవన్లో జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా దక్షిణాది రైతుల పరిస్థితిపై ఇందులో చర్చించనున్నారు.
మేనిఫెస్టో అంశాలపై ప్రతిపాదనలు ..
రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకొచ్చే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ప్రతిపాదనలు చేయడంతో పాటు వ్యవసాయ నిపుణులతో ఈ కిసాన్ కాంగ్రెస్ సదస్సులో చర్చించనున్నారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, అందులో మొదటి సదస్సు హైదరాబాద్లో జరగనుంది. ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ నానా పటోలేతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ సదస్సులో పాల్గొంటారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్రెడ్డి తెలిపారు.
రేపు కిసాన్ కాంగ్రెస్ సదస్సు
Published Mon, Jan 28 2019 3:22 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
Advertisement