హైదరాబాద్: ఆంధ్రా సెటిలర్స్కు అండగా ఉంటా మని, టీఆర్ఎస్ భయపెడితే వారు భయపడాల్సిన అవసరం లేదని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రావాళ్లపై టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తోందని, కేసీఆర్, కేటీఆర్ వాడే భాష సరైంది కాదన్నారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం కన్వీనర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రా సెటిలర్స్కు అండగా ఉంటాం: ఐలయ్య
Published Thu, Nov 1 2018 5:45 AM
Related news
-
Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది..
వందేళ్ల చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎప్పుడూ ఒక మహిళను వైస్ చాన్సలర్గా చూడలేదు. కాని మొదటిసారి ప్రొఫెసర్ నైమా ఖాతూన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్మువి.సి.గా నియమించారు. దీంతో నైమా ఖాతూన్ చరిత్ర సృష్టించారు. ఆమె మైనారిటీ వర్గ మహిళలకు గొప్ప స్ఫూర్తి కాగలదంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నైమా ఖాతూన్ పరిచయం..నైమా ఖాతూన్కు ముస్లిం మహిళల చదువు గురించి చాలా పట్టింపు ఉంది. ‘ఉత్తరాదిలో నేను ప్రిన్సిపాల్గా పని చేసిన అలీగఢ్ విమెన్స్ కాలేజ్ చాలా ముందంజలో ఉంది. అక్కడ మూడు వేల మంది ముస్లిం ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కాని ఇదొక్కటే సరిపోదు. ఉత్తరప్రదేశ్, బిహార్లలో ముస్లిం బాలికల విద్య చాలా వెనుకబడి ఉంది. దక్షణాదిలో ముస్లిం సమూహాలు విద్యా రంగంలో ముస్లిం బాలబాలికలను ఫ్రోత్సహిస్తున్నాయి. ఉత్తరాదిలో ఆ పని జరగడం లేదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని జయించాలంటే విద్యార్జనకు మించిన వేరే మార్గమేదీ లేదు’ అంటుందామె.విద్యారంగంలో బాలికల విద్య కోసమే కాదు ఉన్నతవిద్యలో ముస్లింల ్రపాతినిధ్యం పెరగాలని కోరుకునే నైమా ఖాతూన్ను భారత ప్రభుత్వం గుర్తించి రెండు రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకమైన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ను చేసింది. దాదాపు 100 ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి ఇలా ఒక మహిళ వి.సి. పదవిలో కూచోవడం ఇదే మొదటిసారి.గమనించాల్సిన విషయం ఏమంటే ఇన్నాళ్లు పురుషులు మాత్రమే వి.సి.లుగా ఉన్న జె.ఎన్.యుకు శాంతిశ్రీ పండిట్ మొదటి మహిళా వి.సి. కావడం, అలాగే జామియా మిలియా ఇస్లామియాకు నజ్మా అక్తర్ తొలి వి.సి. కావడం (ఆమె పదవీకాలం ముగిసింది) పాతమూసలను బద్దలు చేయడమే. ఆ వరుసలో ఇప్పుడు నైమా ఖాతూన్ చేరారు.సైకాలజీప్రొఫెసర్..ఒడిశాకు చెందిన నైమా ఖాతూన్ ఉన్నత విద్య అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనే జరిగింది. అక్కడే ఆమె బి.ఏ. సైకాలజీ చదివింది. ఆ తర్వాత పి.హెచ్డి. వరకూ అక్కడే కొనసాగి 1988లో అదే యూనివర్సిటీలో లెక్చరర్గా తన ఫ్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత అసోసియేట్ప్రొఫెసర్గా,ప్రొఫెసర్గా పదోన్నతి పొంది సైకాలజీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ అయ్యింది.పొలిటికల్ సైకాలజీ అధ్యయనంలో భాగంగా ‘హిందూ ముస్లిం యువతపై రాజకీయ భావోద్వేగాల ప్రభావం’ అనే అంశం మీద ఆమె చేసిన పి.హెచ్డి. కీలకమైనది. అలీగఢ్ విమెన్స్ కాలేజ్కు ప్రిన్సిపాల్గా పని చేస్తూ ఉండగా ఆమెను వి.సి.గా పని చేసే అవకాశం వరించింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కనుక ఇ.సి. అనుమతి తీసుకోని ఆమె నియామకం చేసింది ప్రభుత్వం. నైమా ఖాతూన్ తరచూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో తన పరిశోధనా పత్రాలను సమర్పిస్తుంటారు.రాజకీయ ప్రాతినిధ్యం..భారతదేశంలో మహిళలకు రాజకీయ ్రపాధాన్యం లభించడం లేదని నైమా ఖాతూన్ అంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీలు పార్లమెంట్ వరకూ చేరుకోవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయని, రాజకీయ అధికారం లేకుండా కీలకమైన విధానమార్పు తేలేమని అభి్రపాయపడతారు. ‘ఆర్థిక శక్తిని, రాజకీయ శక్తిని పొందడటంలో అణగారిన వర్గాల స్త్రీలు నిస్సహాయంగా ఉన్నారు’ అంటారామె.ఇవి చదవండి: Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి! -
నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే...
గత ఐదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్లో అమలైంది. కానీ తమ పిల్లల్ని ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించిన వారు... పేదలు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతున్నదో తెలియదా? ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ప్రయోగాన్ని జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! 2024 ఆంధ్ర ఎన్నికలు గత రెండు ఎన్నికల కంటే పూర్తిగా భిన్నమైనవి. 2014లో ఒకవైపు మూడు పార్టీల కూటమికీ, వైసీపీకీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగాయి. అప్పుడు కేంద్రంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆనాడు కొత్త రాష్ట్ర రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన అంశాలు. 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలు విడివిడిగా కొట్లా డాయి. వైసీపీ తన కొత్త విద్యా విధానం, గ్రామాల అభివృద్ధి అంశాలతో 151 సీట్లు గెలిచింది. విడిగా పోరాడిన మూడు పార్టీలు మట్టికరిచాయి. చంద్రబాబుకు 23 సీట్లు, పవన్ కల్యాణ్కి 1 సీటు వచ్చాయి. గత ఐదేండ్లలో ఆ పార్టీలు ఊహించని విధంగా దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్లో అమలైంది. దీన్ని ఏపీ నాయ కులు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. వీరేకాక దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎం.వి. రమణ కూడా వ్యతిరేకించారు. సమస్య కోర్టుకు పోయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు జడ్జిగా రమణకు ఇంగ్లిష్ భాష పాత్ర ఎంతో తెలుసు. అయినా వ్యతిరేకించారు. వీరుకాక మీడియా రంగంలో ఈనాడు గ్రూపు, ఆంధ్రజ్యోతి గ్రూపు, టీవీ 5 నెట్వర్క్ అధిపతులు తమ పిల్లల్ని మంచి, మంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించి... రైతులు, కూలీలు, దళితులు, బీసీలు, ఆదివాసులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. ఈ ఎన్నికల్లో మళ్ళీ 2014 నాటి ప్రతిపక్ష గుంపు జత కట్టింది. జగన్ను ఓడించాలని వీళ్ళు రాత్రింబవళ్లు పనిచేసేది ఎందుకోసం? ముఖ్యంగా గ్రామీణ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు ఆపెయ్యడం కోసం. ఈ క్రమంలో జయప్రకాశ్ నారాయణ గురించి కొంత చర్చించాలి. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొంతకాలం ఆయన పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. ఆ దశలో తెలంగాణలో నక్సలైట్లకూ, తెలుగుదేశం పార్టీకీ తీవ్ర సంఘర్షణ జరుగుతున్నది. ఎన్టీఆర్ సన్నిహిత సోషలిస్టు నాయకుడొకరు కేజీ కన్నాభిరన్ (అప్పటి పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు)కు కబురుపెట్టి, ముఖ్యమంత్రితో హక్కుల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు నేను, కన్నాభిరన్, బాలగోపాల్, ఎం.టి. ఖాన్ వెళ్లాం. మేం వెయిటింగ్ రూంలో ఉండగా జయప్రకాశ్ నారాయణ ఆ మీటింగ్ను జరగ కుండా చూడాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఎన్టీఆర్ వినలేదు. మీటింగ్ జరిగింది. నక్సలైట్లను అణచివెయ్యాలి గానీ వారితో చర్చలేమిటని జేపీ ఆలోచన. ఆ విభాగాన్ని చూసే పోలీస్ ఆఫీసర్ అరవిందరావుది కూడా అదే ఆలోచన. మా పౌరహక్కుల టీమ్ ఇరుపక్షాల హత్యలు, కిడ్నాప్లు, ఎన్కౌంటర్లు ఆపించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న రోజులవి. అప్పుడు ఎన్కౌంటర్లు, టీడీపీ కార్యకర్తల కిడ్నాపులు చాలా జరిగాయి. ఆ తరువాత జయప్రకాశ్ నారాయణ ఈనాడు పేపర్, ఈటీవీ ద్వారా మేధావి అవతారమెత్తాడు. అక్కడి నుండి ఒక ఎన్జీవో పెట్టి, ‘లోక్సత్తా’ (అంటే ఇంగ్లిష్లో గ్లోబల్ పవర్) అనే రాజకీయ పార్టీ రూపందాల్చి, దానికి అలుపెరుగని, ఎన్నడూ దిగిపోని ఏకో ముఖ (అంటే ఆ పార్టీలో మరో ముఖమే కనపడదు) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్లోబల్ పవర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఉన్న మూడు పార్టీల కూటమి చాలనట్లు నాలుగో పార్టీగా అందులో చేరాడు. ఇప్పుడు జేపీ లక్ష్యమంతా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువు ఆపి, మళ్లీ తెలుగు మీడియం పెట్టేంత వరకూ పోరాటం చెయ్యడం! ఆయన మరో లక్ష్యం గ్రామాలలో స్కూళ్ల నిర్మాణం, సెక్రటే రియట్ నిర్మాణాలను ఆపి అభివృద్ధికి మార్గంగా అమరావతిని సింగ పూర్లా చూపడం! అభివృద్ధిపై ప్రపంచ యూనివర్సిటీలు చదివే గొప్ప పుస్తకం ఆయన రాసినట్లు, డెవలప్మెంటల్ ఎకనామిక్స్లో తాను అథారిటీ అయినట్లు నిరంతర యూట్యూబ్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. గ్లోబల్ పవర్ ఈనాడు నుండి ఇప్పుడు యూట్యూబ్కు మారింది. విద్యా వ్యవస్థ మీద కూడా జాన్డ్యూయి (కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్ గురువు) కంటే తానే మంచి ఎక్స్ఫర్ట్ అన్న రీతిలో ఉపన్యాసాలు ఇస్తారు. జేపీ ప్రపంచ మార్పు మీద ఇంగ్లిష్లోనో, తెలుగులోనో రాసిన మంచి పుస్తకం మార్కెట్లో ఉంటే చదవాలని ఉంది. కానీ ఇంతవరకు ఒక్కటీ కనిపించలేదు. 30,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు తీసు కున్నప్పుడు వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి. ఆయన సలహా, సహకారం లేకుండా చంద్రబాబు ఆ పని చెయ్యడు. ఇప్పుడు గ్రామీణ బడుల నిర్మాణం, ఇంగ్లిష్ మీడియం చదువు, అమ్మ ఒడి పథకం ఆపి, అమరావతి పట్టణం వచ్చే ఐదేండ్లలో కడితే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశానికే ఒక మోడల్ సిటీ వస్తుందని బహుశా జేపీగారి నమ్మకం. కానీ ఒక ఎనిమిదో తరగతి విద్యార్థి మా తల్లిదండ్రులు జగన్కు ఓటేసి గెలిపించకపోతే, ఇంగ్లిష్ మీడియం ఆగి పోతే, నాకొచ్చే బట్టలు, బూట్లు ఆగిపోతే నేను ఉన్న బట్టలు సర్దుకుని ఇంట్లోనుండి పారిపోతాను అన్నాడు. ఆ పిల్లోడి ఆశను ఏం చెయ్యా లని ఈ నాయకులు అనుకుంటున్నారు? ప్రజా మేధావికి తెలివి కన్నా, వాగ్దాటి కన్నా బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా! దేశంలో ప్రయివేట్ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతుందో వీరందరికీ తెలువదా? 2024–25 ఎకనమిక్ సంవత్సరానికి ధీరూబాయి అంబానీ కొడుకు, కోడలు నడిపే స్కూలు ఫీజు చూడండి: సంవత్సరానికి ఎల్కేజీ విద్యార్థి ఫీజు: 1,70,000. 8–10వ తరగతి పిల్లల ఫీజు: 5,90,000. 11–12వ తరగతి పిల్లల పీజు: 9,65,000. ఇటువంటి స్కూళ్లు దేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ మాతృభాషలో నడుస్తు న్నాయి? ఇంతింత ఫీజులలో ఇంగ్లిష్ మీడియంలో, విదేశీ సిలబస్తో చదివే పిల్లల్ని జగన్ మోడల్ విద్యా విధానం ద్వారా కాక ఎలా ఎదు ర్కొంటారు? ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది కాదు సమస్య. ఈ ఎన్నికల పోరాటంలో అక్కడ ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఇంగ్లిష్ క్వాలిటీ విద్యా ఎక్స్పెరిమెంట్ ఏమైతది అనేది కీలకమైన సమస్య. నేనొక సొంత పార్టీ పెట్టుకొని జగన్తో పొత్తు పెట్టుకొని ఈ వ్యాసం రాయడం లేదు. జగన్ ఇచ్చిన ఎమ్మెల్యే పదవో, రాజ్యసభ ఎంపీ పదవో తీసుకుని రాయడం లేదు. ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు మీద భయంతో రాస్తున్నాను. ఒక పబ్లిక్ ఇంట లెక్చువల్కు దోపిడీకి, అణచివేతకు గురౌతున్న ప్రజల జీవనం మారడం ముఖ్యం. రాజకీయ నాయకులకు రాజకీయాలలో తమ ఉనికి ముఖ్యం. తమ ఉనికి కోసమైనా రాజకీయ నాయకులు ప్రజల మార్పు కోసం, సమానత్వం సాధించడం కోసం చర్యలు చేపట్టి నప్పుడు వాటిని సమర్థించడం ప్రజా మేధావి ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలోని దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ఎక్స్పెరిమెంట్ జగన్ ప్రభుత్వం చేస్తున్నందున నేనీ విద్యా విధానాన్ని సమర్థిస్తున్నాను. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది... తమ పిల్లల భవిష్యత్తు కోసం! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మూడు విచిత్ర దారుల కలయిక
మంచి పంటలు పండే 30 వేల ఎకరాల భూమిలో అమరావతి నగర నిర్మాణమనే లాభసాటి దారి పట్టాడు చంద్రబాబు. అత్తారింటికి దారి వెతికే నటుడేమో పిల్లలకు యూట్యూబ్లుండగా బడులెందుకు అని ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని బీజేపీ చెబుతున్నది. ఈ మూడు దారులూ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక్కటయ్యాయి. ఇక జగనేమో విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించే బాట పట్టాడు. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇది అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్ను నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు మూడు విచిత్ర దారుల కలయిక జరిగింది. ఒకటి అమరావతికి దారి. ఆ దారి ఏది, ఏది అని 2019 నుండి చంద్రబాబు వెతుకుతున్నాడు. ఈయన దారి తప్పడమనేది 2014లోనే జరి గింది. రాష్ట్రానికి హైదరాబాదును మించిన రాజధాని తను, తన కొడుకు దశాబ్దాలు పాలించి అతి త్వరలోనే సింగపూర్ లాంటి సిటీ కడుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కృష్ణానది ఒడ్డున బంగారు పంటలు పండే 30 వేల ఎకరాల భూమిని రైతుల దగ్గరి నుండి తీసు కున్నారు. అప్పుడు కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూడా ఈ దారి తప్పిన దారిలో ఉంది. ఈ భూముల్లో మంచి పంటలు పండించుకునే రైతుల్ని అతి త్వరలోనే పెట్టుబడిదారులను చేస్తామని ఆశ పెట్టారు. ఇది విచిత్ర ఆశ. ఆ రైతులెలా నమ్మారోగానీ ఒక చిన్న రాష్ట్రం 30 వేల ఎకరాల్లో ఒక నగరాన్ని నిర్మించి, బాగా పంటలు పండే ఖరీదైన ఎకరా భూమికి బదులు 200 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇస్తామంటే ఎలా నమ్ము తారు? ఇక ఆ ఐదేండ్లలో సింగపూర్ నగర నిర్మాతలు రాష్ట్ర బడ్జెట్నంతా ఇతర దేశాల కాంట్రాక్ట్ బృందాలకు, మంత్రివర్గ కమిటీలు ప్రపంచ పట్టణాల నమూనాల అధ్యయనానికి ఖర్చు చేశారు. నగర నిర్మాణం జరగకముందే దాని చుట్టూ రింగురోడ్లు, ఉద్యానవనాలు తయారౌతున్నట్టు ప్రకటించారు. వీటి నమూనాలు గీయడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. చివరికి 2019 ఎన్నికలు వచ్చే నాటికి అమరావతికి దారేది? అనే స్థితిలో చంద్రబాబు ఆయన ప్రయివేటు విద్యా, వైద్య మంత్రివర్గ మిత్ర బృందం ఎన్నికలకు పోయింది. ఘోరంగా ఓడారు. ఇప్పుడు అత్తారింటికి దారేది? అని నిరంతరం వెతికే నాయకుడు లేని నాటకదారితో పొత్తు కుదుర్చుకున్నాడు బాబు. ఈ అత్తారింటికి నిరంతరం దారి వెతికే నటుడు పిల్లలకు యూట్యూబ్లుండగా బడులెందుకు, సినిమాలుండగా రైతులకు వ్యవసాయం పనులెందుకు, వెల్ఫేర్ స్కీములెందుకు? అని ప్రజల బతుకుదారులన్నీ మూసెయ్యాలని ఎన్నికల ముందే ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. ఈ ఇద్దరు కలిసి తమ విచిత్ర దారుల కలయిక చాలద న్నట్లు మళ్లీ బీజేపీని కూడా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని చాలా కాలంగా బీజేపీ చెబుతున్నది. వీళ్లంతా కలిసి పోటీ చేసి గెలిస్తే, రాష్ట్ర బడ్జెట్ను ఏ దారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనే కొట్లాట మొదలౌతుంది. చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలంటాడు. 30 వేల ఎకరాలతో సింగపూర్లు నిర్మించాలి! పవన్ తన కల్యాణం కోసం ఖర్చు చేయాలంటాడు. ఆయనకు అత్తారింటి దారి వెతుకులాట, ఆ దారిలో ఖర్చు చేయడం తప్ప ప్రజల అభివృద్ధి దారి, పిల్లల బడి దారి, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ విద్య, ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ వంటివి ఆయన నటనా జీవితంలో ఎరుగనివి. బీజేపీతో పొత్తు కుదిరింది కనుక అది గుడుల నిర్మాణం, పురాతన సంప్రదాయ చరిత్ర పరిరక్షణ, అభివృద్ధి, విశ్వగురుపీఠ ఏర్పాటు అమెరికాలో చేయాలనే ఆశయ సాధనకు డబ్బు ఖర్చు చెయ్యాలనే డిమాండ్ చేయడం మామూలే. జగన్ పరిపాలించిన ఐదేండ్లు ఏక కేంద్ర నిర్ణయాలు, ఖర్చు అభివృద్ధి ప్లాన్లు జరిగాయి. అందులో మొదటిది, అసాధ్యమైన 30 వేల ఎకరాల నగర నిర్మాణం ఆపడం; అది ఆపకుండా ప్రజల కోసం ఏ ఖర్చూ చెయ్యలేమని గుర్తించడం. రెండవది విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించటం; భవన నిర్మాణ ఖర్చును పట్టణ నిర్మాణ రంగం నుండి పల్లె నిర్మాణ రంగంలోకి మార్చడం; గ్రామాల్లో బడుల భవనాలు, హాస్పిటళ్లు, సెక్రటేరియట్లు నిర్మించడం; ఈ నిర్మాణ పనులను పెద్ద కాంట్రాక్టర్ల నుండి గ్రామ కాంట్రాక్టర్లకు మార్చడం; అందులో ముఖ్య గ్రామ ప్రజా కమిటీలకు నిర్మాణ బాధ్యతలు ఒప్ప జెప్పడం. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం చాలా ఉంటుంది. ఇంతకంటే పెద్ద రిస్కుతో కూడిన నిర్ణయం ప్రభుత్వ విద్యా విధానాన్ని ఆంగ్ల ప్లస్ తెలుగుతో జతపర్చి ఆధునిక విద్యా టెక్నాలజీని శ్రమ జీవుల పిల్లల బతుకుల్లోకి తీసుకెళ్లటం. ఇది భారతదేశం వంటి ప్రయివేటు విద్యా పెట్టుబడి–దోపిడీ వ్యవస్థ ఏ దేశంలో లేనంత బలంగా ఉన్న చోట ప్రయోగాత్మకంగానైనా చెయ్యడం ఊహకందనిది. ఇది విద్యా దోపిడీ, ప్రయివేటు పెట్టుబడుల డబ్బు విస్తరించి ఉన్న ఆస్తులు, వాటి చుట్టూ ఉన్న మాఫియాను బాగా బలహీనపర్చే నిర్ణయం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటేనే ఉగ్రరూపం దాల్చే ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం మాఫియాతో నేరుగా తలప డటం. ఈ మాఫియాకు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు దాసోహం చేసే రోజులివి. కార్మిక వర్గ రక్షకులమనే కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రయివేటు విద్యా మాఫియాను అంటకాగి బతుకుతూ ఉన్న దశ ఇది. ప్రయివేటు విద్యా రంగం ఈ దేశంలో మిగతా అన్ని పెట్టుబడిదారీ రంగాలను మించిన ఆస్తుల్ని, మంది మార్బలం, బస్సులు, కార్లు, వ్యాన్లు కలిగి ఉండి మారుమూల గ్రామాల్లో కూడా విస్తరించి ఉన్నందువల్ల దీని శక్తి ఉత్పత్తి రంగ పెట్టుబడి కంటే బలమైంది. దీన్ని ఎదిరించలేకనే అన్ని రాజకీయ పార్టీలు, చివరికి కమ్యూనిస్టు పార్టీలతో సహా, ఊకదంపుడు ‘మాతృభాష’ సిద్ధాంతం ప్రజలకు నేర్పి తమ పార్టీలను, తమ పిల్లల మెదళ్లను ప్రయివేటు విద్యా వ్యవస్థకు తాకట్టు పెట్టాయి. జగన్ దాన్ని బద్దలు కొట్టారు. ఇది మామూలు విషయం కాదు. భారతదేశ జ్ఞాన సంపద రూపు రేఖల్ని మార్చే పోరాటం ఇది. ప్రజా సంక్షేమ వ్యవస్థను భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వంగాని, ఏ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఊహించని స్థాయిలో ‘మనీ ట్రాన్స్ఫర్’ పద్ధతిలో ప్రజా బ్యాంకు ఎకౌంటుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది జగన్ ప్రభుత్వం. ఇటువంటి స్కీములను ఈ మూడు పార్టీల కూటమి కూడా చేస్తామనొచ్చు. కానీ అన్ని సమస్యలకు, ముఖ్యంగా విశాల ప్రజల బీదరికానికి మందు జగన్ ప్రారంభించిన క్వాలిటీ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వం ఇవ్వడంలో ఉన్నది. దానికి బద్ధ శత్రువు చంద్రబాబు, పచ్చి వ్యతిరేకి బీజేపీ, పిచ్చి వ్యతిరేకి పవన్. వీళ్లంతా ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం విద్యా పెట్టుబడిదారీ వర్గాన్ని తమ భుజాల మీద మోస్తారు. వీళ్ళు అధికారంలోకి వస్తే మొదట ఆగి పోయేది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్త పాఠ శాలల నిర్మాణం. ఇప్పటికే నిర్మించబడ్డ బడులకు మెయింటనెన్స్ డబ్బు ఆపివేత, మిర్రర్ ఇమేజ్ బుక్స్ ప్రింటింగ్ ఆపివేత. సంక్షేమాలు ఎన్ని చేస్తామని చెప్పినా 30 వేల ఎకరాల్లో సింగపూర్ నిర్మాణం కార్యక్రమం అన్నింటినీ ఆపేస్తుంది. అమరావతి భారీ నగర నిర్మాణ సమస్య ఈ మూడు పార్టీల మెడకు చుట్టుకున్న పెద్ద నాగు పాము. బాబు నిర్మించే పట్టణ పాముకు సరిపోయేన్ని పాలు వీరు పొయ్యకపోతే అది వీరిని కాటేసి చంపేస్తుంది. దానికి గ్రామాలను మాడ్చాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఒకే ఒక పరిష్కారముంది. అది ఈ ఎన్నికల్లో జగన్ని గెలిపించుడు. కనీసం ఇంకో ఐదేండ్లు విద్యా రంగం మార్పులతో ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగించు కుంటే క్రమంగా ఇటువంటి పథకాలు అవసరం లేని దేశంలోనే అభి వృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఈ మూడు దారుల కూటమే వస్తే మళ్లీ అగాథంలో ఆంధ్రప్రదేశ్ పడుతుంది. బాబు భయ మంతా గ్రామాల్లోని కూలీ నాలీ చేసుకొని బతికే వారి పిల్లలు మేధా వులు, నాయకులు అయితే తన కొడుకు, మనవడు ఏమౌతారనే. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్ను నిర్ణయిస్తాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు
వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాను మార్చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. దేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. అలాగే, ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్సార్సీపీకీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, భావోద్వేగ సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలకూ మధ్య పోటీ నెలకొంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు తమిళనాడులో వలె నామమాత్రపు ఆటగాళ్లుగా ఉన్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ రాష్ట్ర శాఖకు చంద్రబాబు వదిన పురందేశ్వరి నాయకత్వం వహిస్తుండగా, కాంగ్రెస్ రాష్ట్ర శాఖను జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల నడిపిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు, తమ సమీప బంధువులైన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఇబ్బంది పెట్టేందుకు మహిళా అధ్యక్షులను ఎంపిక చేశాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. 2014 ఎన్నికల నుంచి జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 102 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, 2019లో కేవలం 23 సీట్లు గెలుచుకుని జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన జనసేన, బీజేపీతో పొత్తుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇది కచ్చితంగా బాబులో ఉన్న అలజడిని తెలియజేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీపై చంద్రబాబు దూషణలు చేసినందున, ప్రధాని ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ‘అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు’ అనే తెలుగు సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ స్థితిని మోదీ చక్కగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకమైనవి. ఎందు కంటే వైఎస్ జగన్ 175 సీట్లలో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయత్నించని విధంగా రాష్ట్ర అభివృద్ధి నమూనాను మార్చేశారు. రాష్ట్రంలోని పాఠశాల, విశ్వవిద్యాలయ విద్య ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా వైఎస్ జగన్, భౌతిక అభివృద్ధి అని పిలుచుకునే అభివృద్ధి నమూనాను మానవ అభివృద్ధి నమూనాగా మార్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి జగన్ అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న మొదటి అడుగు – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం. భారతదేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థ చరిత్రలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పట్టణ పేదల పిల్లలను, వ్యవసాయ రంగంలోని శ్రామిక జనాల పిల్లలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటూ కదలలేని ప్రాంతీయ భాషా విద్యా విధానంలో ఉంచాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆలోచన పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల మెడకు చుట్టుకుంది. ధనవంతులు తమ పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పిస్తే, గ్రామీణ ప్రజలలో మాత్రం ప్రాంతీయ భాషావాదం ప్రచారం చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఆర్థిక స్థోమత లేని పిల్లలకు మంచి ఆహారం కోసం బడ్జెట్ను ఖర్చు చేయడానికి ఏ ప్రభుత్వమూ కూడా సిద్ధపడలేదు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల్లో చర్చలన్నీ రోడ్లు, భవ నాలు, అప్పుడప్పుడు డ్యామ్లకు మాత్రమే డబ్బు ఖర్చు చేసే విధంగా సాగుతుంటాయి. ఇలాంటి భౌతిక అభివృద్ధిలో భారీ మొత్తంలో డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళతాయి. పాఠశాల విద్యకూ, విశ్వవిద్యాలయ విద్యకూ; పేద పిల్లల తల్లిదండ్రుల ఖాతాలకు నగదు బదిలీ పథకాలకూ గణనీయమైన మొత్తంలో బడ్జెట్ను కేటాయించడం ద్వారా ఆ నమూనాను జగన్ ప్రభుత్వం మార్చింది. ఇది దళారుల పాత్రను రూపుమాపింది. ఈ మార్పు అంతరార్థం ఏమిటంటే దళారీ వ్యవస్థ బలహీనపడుతుంది. తాము పొరపాటున అధికారంలోకి వచ్చినా, పాత భౌతిక వనరుల అభివద్ధి నమూనా వైపు తిరిగి వెళ్లలేమన్నది ప్రతిపక్ష పార్టీల ఆందో ళన. అదే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే, సంస్కరణలు మరింత లోతుగా సాగుతాయి. పది పదిహేనేళ్లలో మంచి విద్యావంతులు, ఆత్మవిశ్వాసం ఉన్న గ్రామీణ యువత సామాజిక–రాజకీయ వ్యవస్థలోకి వస్తారు. మానవ వనరుల అభివృద్ధికి అలవాటు పడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి వారు అనుమతించరు. పైగా ఉద్యోగ స్వామ్యంతో పనిలేని అవినీతి రహిత కార్యకలాపాల కోసం పని చేస్తారు. వివిధ స్థాయుల పరిపాలనలో ‘సివిల్, పోలీసు నియంతల’ వలె పని చేయాలనుకునే అవినీతి ఉద్యోగులు, ఉన్నత స్థాయి బ్యూరో క్రాట్లు కూడా ఈ మానవ అభివృద్ధి నమూనాకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ నగదు బదిలీ జీవితాన్ని రుచి చూసిన పేద గ్రామీణ, పట్టణ ప్రజలు కొత్త వ్యవస్థకు కచ్చితంగా మద్దతు ఇస్తారు. ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. వృద్ధులకు, రోగులకు ప్రభుత్వం నుండి వృద్ధాప్య పింఛన్ అందేలా లేదా రేషన్ వంటి ప్రయోజనాలను ఇంటి వద్దే ఇచ్చేలా వీరు సాయపడుతున్నారు. మధ్య, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవకులపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గ్రామంలోని వాలంటీర్ ప్రతి గ్రామస్థునికీ ఒక సహాయ హస్తం! పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. ఉదాహరణకు, చైనా... విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఒక రకమైన సారూప్య వ్యవస్థను ప్రయత్నించింది. వారు పెద్ద సంఖ్యలో కాలినడక వైద్యులను నియమించారు. మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ లతో కూడిన అసమానమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను కూడా జగన్ కల్పించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడింది. ఆరోగ్య రంగంలో కూడా గ్రామ వాలంటీర్లు చక్కటి పని చేస్తున్నారు. ఈ కొత్త ప్రయోగాలన్నీ దేశంలోని కాంట్రాక్టర్ వర్గాన్ని ఆశ్చర్యపరిచాయి. కాంట్రాక్టర్ వర్గం భౌతికాభివృద్ధిని కోరుకుంటుంది కానీ భారీ స్థాయి మానవ శక్తి అభివృద్ధిని కాదు. తెలంగాణలో నా చిన్నతనంలో స్థానిక భూస్వాములు ఊరి స్కూల్ టీచర్లను చదువు చెప్పవద్దనీ, జీతం తీసుకుని ఇంట్లో సంతోషంగా ఉండమనీ అనేవారు. పల్లెటూరి పిల్లలందరూ చదువుకుంటే తమ పశువుల చుట్టూ బాలకార్మికులుగా ఎవరు పని చేస్తారు, పెద్దయ్యాక జీతగాళ్లుగా ఎవరు పని చేస్తారన్నది వారి తర్కం. ఆ సమయంలో భూస్వాములు విద్య ద్వారా మానవ శక్తిని అభివృద్ధి చేయడాన్ని భూస్వామ్య వ్యతిరేకతగా చూశారు. ఇప్పుడు ఏపీలో ఇంగ్లీషు విద్యావంతులైన మానవశక్తిని అభివృద్ధి చేయడాన్ని కాంట్రాక్ట్ వ్యతిరేక పెట్టుబడిగా చూస్తున్నారు. కాంట్రాక్ట్ పెట్టుబడికీ, ప్రైవేట్ విద్యా రంగానికీ, చంద్రబాబుకూ చాలా దగ్గరి సంబంధం ఉంది.2024 ఎన్నికలలో జగన్ గెలిస్తే ఈ మోడల్ దాని మూలాలను మరింత లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది. పైగా దానిని ఎవరూ మార్చలేరు. ఇది జాతీయ విద్యావ్యవస్థపై కూడా ప్రభావం చూపు తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం
కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం
Related News by category
-
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్
సాక్షి,కరీంనగర్: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. మానకొండూర్లో ఆదివారం(ఏప్రిల్27) నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. ‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. -
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్లో కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్పేట కారిడార్లో నాగోల్కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్మెంట్పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్రింగ్రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్పాస్తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్పేట మీదుగా ఎల్బీ నగర్కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. ♦ బైరామల్గూడ, సాగర్రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్మెంట్ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement