192 మంది బందీలు విడుదల | Sakshi
Sakshi News home page

192 మంది బందీలు విడుదల

Published Sun, Jan 25 2015 9:09 AM

192 మంది బందీలు విడుదల

నైజీరియా: బోకో హరామ్ తీవ్రవాదుల అపహరించిన వారిలో దాదాపు 192 మంది బందీలను విడుదల చేశారని నైజీరియా సైనిక ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. విడుదలైన వారిలో అత్యధుకులు మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. తీవ్రవాదులు రెండు ట్రక్కుల్లో బందీలను డమత్తురు సమీపంలోని గిర్భువా గ్రామంలో వారిని విడిచిపెట్టారని పేర్కొన్నారు.

జనవరి మొదటి వారంలో నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని యొబో గ్రామం నుంచి 218 మందిని బోకో హరామ్ తీవ్రవాదులు అపహరించారు.  అయితే ఈ కిడ్నాపులకు ముందు బోకో హరాం తీవ్రవాదులు సాయుధులై కట్రాకో గ్రామంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం గ్రామంలోని మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేశారు.

 

Advertisement
Advertisement