Sakshi News home page

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

Published Wed, Oct 14 2015 5:04 PM

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - Sakshi

న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం చంద్రబాబు.. మోదీ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై నివేదికను మోదీకి అందజేశారు.

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబు.. మోదీని ఆహ్వానించారు. చంద్రబాబు అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు.

Advertisement

What’s your opinion

Advertisement