పారిశ్రామికవేత్త యశ్ బిర్లా కోసం ఓ చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసు జారీ అయ్యింది. అతడిపైన, అతడి సంస్థ బిర్లా పవర్ సొల్యూషన్స్పైన ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముంబై పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యు) వారు ఈ నోటీసు జారీ చేశారు. తొలిసారిగా ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు 2013 డిసెంబర్ 31వ తేదీన ఈ కేసు నమోదు చేశారు. వర్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపార వేత్తను బిర్లా పవర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోటి రూపాయల మేర మోసం చేసిందని కేసు నమోదైంది.
తాను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితి తీరినా తిరిగి చెల్లించలేదని అతడు కేసు పెట్టాడు. అనంతరం ఈ కేసు ఈవోడబ్ల్యు విభాగానికి బదిలీ అయ్యింది. ఇప్పటివరకు ఇలా 28 మంది పెట్టుబడిదారులు ఈవోడబ్ల్యును ఆశ్రయించారు. అంతా కలిసి రూ. 20 కోట్ల మేర యశ్ బిర్లా తమను మోసం చేశాడని పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటికే బిర్లా పవర్ మాజీ ఎండీ పీవీఆర్ మూర్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. బిర్లాపై లుకౌట్ నోటీసును అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పంపారు.
యశ్ బిర్లా కోసం లుకౌట్ నోటీసు
Published Sat, Feb 1 2014 4:25 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement