Top Stories
ప్రధాన వార్తలు
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
జగన్.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది?: చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్మోహన్రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తున్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురికొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్నగర్లో బస్సుయాత్ర చేస్తున్న జగన్పై హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఇప్పుడు ఏకంగా జగన్ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నారంటే జగన్పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్ జగన్ను దీటుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగజారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్పై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజారుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్లో ఆందోళన..అలాగే.. జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విసరండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లాడడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విషయాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువలుంటే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్సీఎం జగన్ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజానీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్రపడిన చంద్రబాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభావం, అవకాశవాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తటస్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీలేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేకపోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది.
ఓటుతో మోసగాళ్లకు వేటు: సీఎం వైఎస్ జగన్
డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే పంపితే అది జగన్ పాలన! అదే డబ్బులు తన అకౌంట్లోకి, తన జేబులోకి, తన పెత్తందారీ స్నేహితుల జేబుల్లోకి వేసుకుంటే అది బాబు పాలన! చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్కు, రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ 5 నాయుడికి, వదినమ్మకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బాబుది ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ 5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, మోసాల పాలన. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు.. ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు.. అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు నైజంగా, గుంపులు గుంపులుగా జెండాలు జత కట్టి వస్తున్నారు. ఈ పేదల వ్యతిరేకులు, మోసగాళ్లకు ఓటుతో పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం/సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరుకుట్రలు, వెన్నుపోట్లతో కూటమి కట్టి, జెండాలు జతకట్టి వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘58 నెలల కాలంలో నేను ఏం చేశానో చెబుతా. నీ 14 ఏళ్ల పాలనలో ఏం మంచి చేశావో చెప్పగలవా చంద్రబాబూ? నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా? జగన్ తెచ్చిన స్కీమ్లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తానని చెప్పగలవా? నేను తెచ్చిన పథకాల గురించి మాట్లాడతావ్ ఏమిటయ్యా బాబూ? నేను రూపాయి ఇస్తే.. నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్ ఏంటయ్యా చంద్రబాబూ?’ అంటూ ధ్వజమెత్తారు. ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకురాని ఆ మనిషిని నమ్మగలమా? అని సూటిగా ప్రశ్నించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన తొలి ఎన్నికల సభతో మలి విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం వేళ తిరుపతి జిల్లా వెంకటగిరిలో, సాయంత్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో పోటెత్తిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆయా సభల్లో ఆయన ఏమన్నారంటే...బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్లే!మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఇవి వచ్చే ఐదేళ్ల పాటు మన ఇంటింటి అభివృద్ధి, పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది చంద్ర బాబు గురించి చరిత్ర చెప్పిన సత్యం. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నాడు. బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఆహ్వానించడమే.మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడునాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతోనే. నా నమ్మకం ఆ దేవుడి దయపైనే. మేనిఫెస్టో హామీలను నూటికి 99 శాతం అమలు చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మీ దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏకంగా 130సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటింటికీ అందాయి. సచివాలయాల్లో నా తమ్ముళ్లు, చెల్లెళ్లుదశాబ్దాలుగా మన దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు. నా తమ్ముళ్లు, చెల్లెళ్లంతా ఈరోజు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తున్నారు. మెరుగుపడిన ఆస్పత్రులు, బడుల్లో సేవలందిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ నేను ‘‘నా..’’ అని ఆప్యాయంగా పిలిచే సామాజికవర్గాలకు ఇందులో ఏకంగా 80 శాతం ఉద్యోగాలు దక్కాయి.పౌర సేవలు.. విప్లవాత్మక వ్యవస్థలు ప్రజలకు అందించే సేవల డెలివరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా పౌర సేవలు, పథకాలను నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేశాం. నాడు – నేడుతో బాగుపడ్డ బడులు, ఇంగ్లీషు మీడియం చదువులు కనిపిస్తున్నాయి. మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి. ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికీ వస్తోంది. గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తున్నాడు. మన గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. రైతన్నచేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలన్నీ మీ బిడ్డ 58 నెలల కాలంలోనే తెచ్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్నాడు.పేదల ఆత్మగౌరవం కాపాడుతూ..పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటికే రూ.3 వేలు పింఛన్, రేషన్ అందజేస్తున్నాం. ఈరోజు ఇంటి వద్దకే క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ వస్తోంది. ఏది కావాలన్నా గడప వద్దకే వస్తున్న పరిస్థితులు మీరే చూస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులను ఎవరైనా ఊహించారా? గవర్నమెంట్ డబ్బులు లంచాలు, వివక్ష లేకుండా అందుతాయని గతంలో ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేసి చూపించాం.విద్యా విప్లవం..పేదింటి పిల్లల చదువుకునే ప్రభుత్వ బడుల్లో చదువులు, ఆహారం అత్యుత్తమంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పిల్లలు ధరించే యూనిఫాం మొదలు పుస్తకాల దాకా అన్నీ సమకూరుస్తున్నాం. క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, ఐఎఫ్పీ ప్యానెల్స్, ట్యాబ్లు, మారిన కరిక్యులమ్తో విద్యా విప్లవాన్ని తెచ్చాం. ఇదే పాలన మరో పదేళ్లు కొనసాగితే ఇప్పుడు ఒకటో తరగతిలో ఉన్న మీ పిల్లలు 2035 నాటికి టెన్త్ పరీక్ష ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్తో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ చూడని విధంగా హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే ఆన్లైన్ కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానమవుతున్నాయి. మహిళా సాధికారతకు దన్నుగా‘అమ్మ ఒడి’ అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా విన్నారా? ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు లాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా? దిశ యాప్, అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం లాంటివి గతంలో విన్నారా?రైతన్నకు అండగా..రైతన్నకు పెట్టుబడి సాయంగా పంట వేసే సమయంలో రైతు భరోసా అందించడం గతంలో ఎప్పుడైనా చూశారా?. గ్రామాల్లోనే ఆర్బీకేలు, సున్నా వడ్డీకే పంట రుణాలు, 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్, ఇన్ పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటలు సైతం కొనుగోలు లాంటివన్నీ చేసి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్ననూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాడు.100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకేమొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి మీ బిడ్డ అర్థం చెప్పాడు. చేతల్లో చూపించాడు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు డీబీటీ, నాన్ డీబీటీలో ఏకంగా 75 శాతం పైచిలుకు లబ్ధి చేకూరింది. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 68 శాతం మంత్రి పదవులు ఆ వర్గాలకే ఇవ్వడం ఓ చరిత్ర. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించిన చరిత్ర గతంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి.జన్మభూమి కమిటీలు మళ్లీ తెస్తానని చెప్పగలవా?చంద్రబాబు జన్మభూమి కమిటీలను తీసుకొస్తే మీ జగన్ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తెచ్చాడు. నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ వాటిని తీసుకొస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు? ఆ విషయం చెప్పే ధైర్యం లేక నేను తెచ్చిన వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలను కొనసాగిస్తానంటావేమిటి? నువ్వు వస్తే వలంటీర్లకు జీతం పెంచుతానంటావేమిటి? జగన్ స్కీమ్లను రద్దు చేస్తాననే ధైర్యముందా?అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు పరిపాలించావ్! నేను 58 నెలలే పరిపాలన చేశా. జగన్ అమ్మఒడి తీసుకొస్తే నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నావు. జగన్ చేయూత ప్రవేశపెడితే నువ్వు ఇంకా ఎక్కువమందికి ఇస్తానంటున్నావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్! జగన్ తెచ్చిన స్కీమ్లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబూ? జగన్ తెచ్చిన వలంటీర్, సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్ తెచ్చిన రైతుభరోసా కేంద్రాలను తీసేస్తానని చెప్పే ధైర్యం ఉందా? రైతు భరోసా సొమ్ము రద్దు చేసే ధైర్యం బాబుకు ఉందా?మోసాల బాబు విఫల హామీలు⇒ 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపిన పాంప్లెట్ గుర్తుందా? ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఊదరగొట్టారు. మంగళ సూత్రం తెంపుతున్న చేతిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు రావాలన్న అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేశాడా? ⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చాడా?⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎక్కడైనా కనిపిస్తోందా? ⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? ⇒ అవే మూడు పార్టీలు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్లు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యాయి.మన అభ్యర్థులను దీవించండిఅనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరణారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎం. గురుమూర్తి, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వై.విజయసాయిరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.మనం చేసిన మంచిలో మచ్చుకు కొన్ని..⇒ ఇంటి వద్దకే రూ.3 వేల పెన్షన్ అనగానే గుర్తుకొచ్చేది మీ జగన్. పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అమ్మఒడి అంటే మీ జగన్. అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, మహిళా సాధికారత, రైతు భరోసా, ఆర్బీకేలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, జీవనభృతికి ఇబ్బంది లేకుండా విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా, పేదవాడికి మందులు, టెస్టులు అందిస్తూ ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.⇒ స్వయం ఉపాధికి ఊతమిస్తూ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు, తోడు, లా నేస్తం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్, ఇంటికే పౌరసేవలు, పథకాలు చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్. నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడులు, గవర్నమెంట్ హాస్పిటళ్లు చూస్తే గుర్తుకువచ్చేది మీ జగన్. గ్రామంలోనే మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్.తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజీఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అన్న, ఎంపీ అభ్యర్థి శంకరన్నపై మీ చల్లని దీవెనలు ఉంచాలని సవినయంగా కోరుతున్నా. కాసేపటి క్రితం పెద్దారెడ్డి అన్న తాడిపత్రి నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ గురించి ప్రస్తావించాడు. తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజీని మళ్లీ మన ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కూడా ప్రస్తావించారు. అవన్నీ పెద్దారెడ్డి అన్నతో దగ్గరుండి మీకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నా.ఇవన్నీ కొనసాగాలంటే మన పార్టీకి ఓటేయండి...నేను చంద్రబాబు మాదిరిగా సెల్ఫోన్ కనిపెట్టానంటూ బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మీరే మార్కులు వేయాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కనీసం ఆరేడు విప్లవాత్మక కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీవద్ద ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేయండి. అవన్నీ ఇలాగే కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే మన పార్టీకి ఓటు వేయండని మీ బిడ్డ అడుగుతున్నాడు. అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పిల్లల్ని ఇలాగే చక్కగా చదివించాలనుకుంటే మళ్లీ మీ అన్నకు అధికారం ఇవ్వండి. పిల్లలు ఇలాగే ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటూ ఈ మార్పులు కొనసాగాలంటే మీ బిడ్డకే, ఫ్యాన్కు ఓటు వేయాలి. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పథకాలు సజావుగా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండాలి. చంద్రబాబు మార్కు దోపిడీ, జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ రాకూడదంటే ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి మరోసారి ఆశీర్వదించాలి.మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? నాడూ నేడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటి కంటే ఇప్పుడే గ్రోత్ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? కనీ వినీ ఎరుగని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు? అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపించగలిగాడు? అనేది ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయండి. మన రాష్టానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తుంటే సుమతీ శతకం ‘‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ’’ గుర్తుకొస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు వీళ్లలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా నివాసం ఉంటున్నారా? ఎన్నికలు వచ్చాయి కాబట్టే వీరంతా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఓడిన వెంటనే వీళ్లంతా మళ్లీ హైదరాబాద్కు వెళ్లిపోతారు. ఇదీ వాళ్లకు మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టీ పార్టీలకు, వాటి సభ్యులకు, నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునే వనరుల లాంటివి. వీరిలో ఏ ఒక్కరికీ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. మేం చేసిన మంచి చూసి మాకు ఓట్లేయాలని అడిగే ధైర్యం లేదు. చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే, ఇంటింటికి చేసిన మంచిని సగర్వంగా చెబుతున్న పార్టీ మనది. ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ చేసిన మంచి ఇదీ అని మీ బిడ్డ సగర్వంగా చెబుతున్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే తోడుగా, సైనికులుగా నిలవాలని కోరుతున్నా.
అక్రమాల ప్రియ
పేరేమో అందరికీ ‘ప్రియం’గా అనిపిస్తుంది.. వ్యవహార శైలి చూసినా, విన్నా అన్నీ అప్రియాలే... టీడీపీ హయాంలో మంత్రిగా అవకాశం లభించేసరికి దోపిడీకి లైసెన్సు పొందినట్లయింది.ఈమె గారి పతి పేరులోనే దేవుడు...∗ లీలల్లో రావణుడే... ఈ సతీపతుల విచ్చలవిడి దోపిడీకినంద్యాల సమీపంలోని ఓ నియోజకవర్గం అడ్డాగా మారింది. నీరు–చెట్టు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, తాగునీటి పేరిట వీరి అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీరి దోపిడీని లెక్కగడితే రూ.వంద కోట్లు దాటి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ దంపతుల కంటికి నదురుగా ఎవరి స్థలమైనా కనిపించినా.. లేదా.. స్థల వివాదాల్లో న్యాయం చేయాలని ఎవరైనా వీరి వద్దకు వచ్చినా.. పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చిందన్న చందంగా ఆ స్థలాలను కాజేసే దాకా వీరు నిద్రపోరు. ∗మాయ మాటలతో రైతులను వంచించడంలో ఈ దంపతులను మించిన వారు లేరని వీరిఅఘాయిత్యాలే చెబుతాయి..∗ఎవరైనా వీరి అన్యాయాలనుప్రశ్నించారో వారిపై విరుచుకుపడతారు. డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరనివీరి చరిత్ర చెబుతోంది. జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకపోవడం వీరికే చెల్లింది. సతి ఆదేశం.. పతి దౌర్జన్యం.. చింతకుంట గ్రామానికి చెందిన గూడా నరసింహుడు భార్య వెంకట లక్షమ్మకు ఆళ్లగడ్డ పట్టణ శివారులో 25 సెంట్ల స్థలముంది. ఆ స్థలాన్ని మహమ్మద్హుసేన్, నూర్ అహమ్మద్ల నుంచి 1995 మార్చి 27న కొనుగోలు చేసి రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఈ దంపతులు ఓ సర్వేయర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ద్వారా 1952లో అల్లిసా పేరిట రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ను బయటకు తీశారు. అవుకు మండలం సంగపట్నంలో నివసించే వారి మనవడు నూర్బాషాకు నచ్చజెప్పి మూడు భాగాలుగా చేసి 2022 డిసెంబర్1న అనుచరుల పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇప్పుడు ‘గూడా’ దంపతులు లబోదిబోమంటున్నారు. ఈ అరాచక దంపతుల దౌర్జన్యంలో ఇది మరో కోణం. సాక్షి, టాస్్కఫోర్స్: గత ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువ మహిళా మంత్రి అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారారు. అక్రమాలను అవలీలగా చేసేశారు. ఇప్పుడామె అధికారంలో లేకున్నా... కబ్జాలకు కొదవలేదు. ఎదిరించేవారిపై దౌర్జన్యాలకూ వెనుకాడటం లేదు. ఆమెతోపాటు ఆమె రెండో భర్త చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ పనిచేసినా వారికి వాటాలు ముట్టజెప్పాల్సి వచ్చేది.కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామకాల్లోనూ ఈ సతీపతుల వసూళ్ల దందా సాగింది. అభివృద్ధి పనుల్లోనూ ఆ దంపతులు రూ.కోట్లలో పర్సంటేజీలు మూటగట్టుకున్నారు. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ వసూళ్లు కొనసాగించారు. వివిధ పనుల్లో టెండర్లతో పని లేకుండా రూ.200 కోట్ల వరకూ స్వాహా చేశారు. అధికారం కోల్పోయినా తమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో అక్రమాలు... ఆమె టీడీపీ హయాంలో నియోజకవర్గంలో వివిధ పనుల కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుని వాటిని పక్కదారి పట్టించారు. అధికారులను బెదిరించి పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రతి పనినీ తన అనుయాయులకే టెండర్తో ప్రమేయం లేకుండా కట్టబెట్టించి వారి వద్ద పర్సంటేజీలు నొక్కేశారు. దౌర్జన్యాలకు నిదర్శనాలివిగో.. ∗ తాజాగా ఓ పంచాయితీ కోసం ఇంటికొచ్చిన ఓ ముస్లిం మైనార్టీ నాయకుడిని అందరూ చూస్తుండగానే మాజీ మంత్రి దంపతుల ఆదేశాల మేరకు అనుచరులు చితకబాది వారి వద్దనున్న రూ.1.30 కోట్లు దోచే యడం ఇప్పుడు సంచలనమైంది. ∗ జగత్ డెయిరీకి చెందిన అమాయక రైతుల పేర్లపై బ్యాంకు రుణాలు తీసుకుని మంత్రి తిరిగి చెల్లించకపోవడంతో ఆ రైతులు డిఫాల్టర్లుగా మారి పంట రుణాలూ పొందలేక అల్లాడిపోయారు. ∗ మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు ఆశపడి మున్సిపల్ శానిటరీ, స్వీపర్ పోస్టులతోపాటు టూరిజం శాఖలో విద్యుత్ సబ్స్టేషన్లలో ఉద్యోగాలను అమ్ముకున్నారు. ∗ నీరు చెట్టు పనుల్లో అడిగినంత కమీషన్ ఇవ్వలేదని భాచాపురం గ్రామ నాయకుడి చెక్బుక్ దొంగిలించి అతనిపై చెక్బౌన్స్ కేసు పెట్టి వేధించారు. ∗ మాజీ మంత్రి ప్రస్తుత భర్త ద్వారా ఖాళీ స్థలాలపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ కబ్జాలకు పాల్పడి బాధితులను చంపుతామని బెదిరించారు. వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురి చేశారు. ∗ అవసరమైనప్పుడు అప్పులిచ్చి ఆదుకున్న స్నేహితులు, శ్రేయోభిలాషులను మోసం చేశారు. రుణాలు ఎగ్గొట్టారు. వారిని ఇంట్లోకీ రానివ్వకుండా అవమానించారు.∗ తండ్రి ఇంటిపేరును దుర్వినియోగం చేయడంతో విసిగిపోయిన బంధువులు ఆమెకు దూరమయ్యారు. ఆమెను, ఆమె భర్తను బహిష్కరించారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ∗ నాలుగేళ్లుగా హైదరాబాద్కే పరిమితమైన మాజీ మంత్రి దంపతులు ఇప్పుడు ఎన్నికలు రావడంతో పదవి కోసం మళ్లీ నియోజకవర్గంలో తిష్టవేశారు. ∗ నంద్యాలకు ఆనుకుని ఉన్న నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా ప్రవహించే వక్కిలేరులో అప్పటి టీడీపీ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏటా నీరు–చెట్టు పేరిట పనులు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 350 పనులుగా దీన్ని విభజించి తన బంధువులైన రామతీర్థ పుట్టాలమ్మ ఆలయ అప్పటి చైర్మన్ (ప్రస్తుత బీజేపీ నాయకుడు), అప్పటి సహకార సంఘం చైర్మన్, కోటకందుకూరు మాజీ సర్పంచికి అప్పగించారు.వారు వాగులో అరకొర పనులు చేసి ఏకంగా రూ.3 కోట్లకు పైగా నిధులు కొల్లగొట్టారు. ఇందులో నాటి మంత్రికి సగం ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్ లేకపోయినా అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకున్నట్లు సమాచారం. ∗ రుద్రవరం మండలం నాగులవరం సమీపంలోని టీజీపీ పంట కాలువలో పూడిక తీసినట్టు అధికారులు బిల్లులూ మంజూరు చేశారు. ఇదే గ్రామానికి చెందిన నాటి మంత్రి అనుచరుడు ఇలాంటి పది పనులు సుమారు రూ.కోటితో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు పనులు నాసిరకంగా చేపట్టగా, ఆరు పనులను అసలు చేయకుండానే బిల్లులు ఆమోదింపజేసుకుని రూ.60 లక్షలు మింగేశారని సమాచారం. ఇలా పైపై పనులు చేపట్టి దాదాపు రూ.130 కోట్ల మేర నాటి మంత్రి, జన్మభూమి కమిటీలు, వారి అనుచరులు బొక్కేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే శనగ విత్తనాల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి మినుములను రప్పించి ఇక్కడి రైతులవే అని చెప్పి కొల్లగొట్టేశారు. తాగునీటి సరఫరా పేరుతో దోపిడీ... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుని అప్పటి మంత్రిగా అడ్డంగా దోచేశారు. పట్టణంలో ట్యాంకరుకు రూ.500 నుంచి రూ.750 వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. మంత్రి అనుచరులు ట్యాంకర్లను కొని మున్సిపాలిటీకి అద్దెకిచ్చారు. నీటిని వారు తరలించకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వేషంలో వెళ్లి కిడ్నాప్.. హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు మాజీ మంత్రి, ఆమె వర్గీయులు చేసిన కిడ్నాప్ సినిమాను తలపించింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల వేషంలో వెళ్లి కిడ్నాప్ చేయడంతో అప్పట్లో సంచలనమైంది. అయితే తీరా కిడ్నాప్ చేసిన మనుషులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు కావడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఏ1 నిందితురాలు. నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కిడ్నాప్ కేసులో ఓ మహిళా మాజీ మంత్రి జైలుకు వెళ్లడం అదే తొలిసారి.
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
ఈ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ పచ్చ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. స్పామ్ కాల్స్ పేరుతో జనాలకు ఫోన్లు చేసి విసిగిస్తోంది. ఫోన్ ఎత్తితే చాలు.. సీఎం జగన్పై అసభ్య పదజాలంతో దూషణలు వినిపిస్తోంది. నోటికి వచ్చిన మాటలతో తిట్ల దండకం అందుకుంటోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ బురద జల్లుతోంది. ఎవరో ఫోన్ చేస్తున్నారనుకుని ఆ ఫోన్ ఎత్తితే చాలు.. ఆ వాయిస్ కాల్లో సీఎం జగన్ను బండ బూతులు తిడుతున్నారు. పదే పదే కాల్స్ చేసి జనాలను సతాయిస్తున్నారు. ఈ క్రమంలో జనాలు అలాంటి స్పామ్ కాల్స్ను ఎత్తకపోవడంతో చివరికి ఎంతకు తెగించారంటే.. ఆ కాల్స్పై ట్రూకాలర్లో యువర్ జగన్, జగన్ లీడర్, మాస్ లీడర్ జగన్.. అంటూ పేర్లు వచ్చేలా చేసి.. జగన్ను అభిమానించే వారు ఫోన్లు తీసేలా చేస్తున్నారు. మరోవైపు షార్ట్ఫిలిమ్స్తో సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు.జగన్పై దు్రష్పచారం చేయడం, టీడీపీకి ఓటు వేయాలని కోరుతుండటంతో వాటిని టచ్ చేయాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎలాగైనా వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి.. దు్రష్పచారం చేస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే మీడియా సర్టీఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
ఐపీఎల్-2024లో వరుస ఓటుమల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 78 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. సీఎస్కే బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మార్క్రమ్(32) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా అందరూ విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తఫిజుర్ రెహ్మాన్, పతిరనా తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు జడేజా, శార్ధూల్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్లతో 98 పరుగులు చేశాడు.
రుతురాజ్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి గైక్వాడ్ ఔటయ్యాడు.ఇక సీఎస్కే బ్యాటర్లలో గైక్వాడ్తో పాటు మిచెల్(52), శివమ్ దూబే(39 నాటౌట్) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అందరూ పూర్తిగా తేలిపోయారు. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కట్ తలా వికెట్ సాధించారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్,నటరాజన్ ఇద్దరి కలిసి ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నారు.
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్రూఫ్లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024
‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది.
చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదు’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా నిలవండి అని కోరుతున్నాను. సెల్ఫోన్ నేనే కనిపెట్టా అంటూ బాబులా నేను బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు పెట్టి మార్కులు వేయమని అడుగుతున్నా. మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి పల్లె, పట్టణంలో కనీసం 6 వ్యవస్థలు ఏర్పాటు చేసాం. సచివాలయాలు, వాలంటీర్లు, నాడునేడుతో మారిన బడి, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ ప్రతి ఊరిలో కనిపిస్తాయి. ఇక మీదట కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి.’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.‘‘ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్, ఇంటి ముంగిటికే వచ్చే రేషన్... మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సంప్రదాయం. పేదలకు మనం ఇస్తున్న ఈ మర్యాద కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. చంద్రబాబు మార్కు రాజ్యం.. దోపిడీ సామ్రాజ్యం, గ్రామగ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీలు. లంచాలు, వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, ఎవరికి ఓటేసారు అనేది కూడా చూడకుండా అర్హులందరికీ ఇచ్చిన ఈ పథకాలన్నీ వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. 130 బటన్లు నొక్కి రూ.2,70,000 కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా అందించాం’’ అని సీఎం జగన్ చెప్పారు ‘‘మళ్లీ వచ్చే ఐదేళ్లూ ఇది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి అని కోరుతున్నాను. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా.. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష సేవలు... విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందాలంటే మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని సీఎం జగన్ కోరారు.
తప్పక చదవండి
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- శక్తులన్నీ ఏకమయ్యాయి
సినిమా
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్, ఇన్ఫ్లూయెన్సర్గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)
నేను వాటితో నటించాలంటే కాస్త రెమ్యునరేషన్ పెంచాల్సిందే: ట్రెండింగ్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ప్రసన్న వదనం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్కు జోడీగా కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్లో ఈ బ్యూటీని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. దీంతో మే 3న విడుదల కానున్న ప్రసన్న వదనం చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఈగర్గా ఎదురుచూస్తున్నారు.మంగళూరులో పుట్టిన పాయల్ రాధాకృష్ణ మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఆపై 'బెంగళూరు అండర్ వరల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చేరిన పాయల్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం అమెజాన్, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం ఆమె పనిచేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా యాక్టింగ్లో డిప్లొమా చేసిన ఈ బ్యూటీ 19 ఏళ్లకే సినిమా అవకాశాలపై కన్నేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో పాయల్ రాధాకృష్ణ కూడా మంచి ట్రెడిషినల్ డ్సాన్సర్. ఆమె అమ్మగారు డ్యాన్స్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు.మిగతా హీరోయిన్లకు భిన్నంగా తన ఆలోచనలు ఉన్న పాయలకు పెంపుడు జంతువులు అంటే ఏ మాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఎక్కువగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ కన్నడ బ్యూటీకి పెట్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. తనకు సంబంధించిన యాడ్స్ , సినిమాల్లో పెంపుడు జంతువులతో ఏదైనా సీన్ చేయాలంటే అందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతానని ఈ బ్యూటీ చెప్పుకొస్తుంది.సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తనకు తెలుగు భాష అంటే కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. పలు యాడ్లు చేస్తున్నప్పుడు తను తెలుగు మాట్లాడుతుంటే కొందరు కామెంట్లు కూడా చేశారని చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఆమె తెలిపింది. టాలీవుడ్లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమాలో అయినా నటించాలనేది తన కోరిక అంటూ తెలిపింది. కోలీవుడ్లో అయితే ధనుష్తో నటించాలని ఉందని పేర్కొంది. ప్రసన్న వదనం చిత్రంతో పాటు 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna)
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Bhaskar (@gully_boy_bhaskar)
నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్కి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్లో నా కెరీర్ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్ హీరోయిన్ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఫిల్మ్లో నటిస్తున్నారు.
ఫొటోలు
బిజినెస్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.హైదరాబాద్లో భారీగా లీజింగ్ హైదరాబాద్లోనూ ఆఫీస్ స్థలం లీజింగ్ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ లీజింగ్లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది.
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
ఒక నిమిషానికి దాదాపు 500 గంటల కంటెంట్ను అప్లోడ్ చేస్తున్న యూట్యూబ్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఫిబ్రవరి 14, 2005లో పేపాల్లో పనిచేస్తున్న స్టీవ్ చెన్, చాడ్ హార్లీ, జావెద్ కరీం యూట్యాబ్ను రూపొందించారు.2005 ఏప్రిల్ 23న ‘మీ ఎట్ ది జు’ అనే వీడియోను మొదటగా అప్లోడ్ చేశారు.మే 2005లో యూట్యూబ్ బెటా సైట్ను ప్రారంభించారు.సెప్టెంబర్ 2005లో మొదటగా 1 మిలియన్ మంది వీక్షించిన వీడియా ‘నైక్’ యాడ్.నవంబర్ 2005లో మొదటగా 3.5 మిలియన్ డాలర్లతో సెకోయా క్యాపిటల్ పెట్టుబడి పెట్టింది.మార్చి 2006లో మొదటగా యూట్యూట్లో ప్రకటనలు ప్రారంభించారు.జులై 2006 వరకు సగటున రోజూ 100 మిలియన్ వీక్షణలు వచ్చాయి.అక్టోబర్ 9, 2006లో యూట్యూబ్ను 1.65 బిలియన్ డాలర్లకు గూగుల్ కొనుగోలు చేసింది.యూట్యూబ్ వీడియో అప్లోడర్లుకు 2007 నుంచి అవార్డులను ప్రకటిస్తోంది.2008లో యూట్యూబ్ సినిమాలు, టీవీ షోలను అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది.జనవరి 2010లో మూవీ రెంటల్ సర్వీస్ను తీసుకొచ్చింది.మార్చి 2010లో ఉచితంగా స్పోర్ట్స్ కంటెంట్ అప్లోడ్ను ప్రారంభించింది.మే 2010లో రోజూ సగటున 2 బిలియన్ వీక్షణలు వచ్చేవి.2011లో 3 బిలియన్ వీక్షణలకు చేరింది.జనవరి 2012లో రోజూ 4 బిలియన్ వ్యూస్ వచ్చేవి.2012లో ప్రతి నిమిషానికి 60 గంటల కంటెంట్ అప్లోడ్ అయ్యేంది. ప్రతినెల కొత్తగా 800 మిలియన్ల మంది యూట్యూబ్ చూసేవారు.మొదటగా 2012 డిసెంబర్ 21న 1 బిలియన్ వ్యూస్ వచ్చిన వీడియా.. ‘గంగనమ్ స్టైల్’.మార్చి 2013లో 1 బిలియన్ యూజర్ల మార్కును తాకింది.సుసాన్ వోజ్కి ఫిబ్రవరి 2014లో యూట్యూబ్ సీఈఓగా నియమితులయ్యారు.యూట్యూబ్ కిడ్స్ అని పిలువబడే మొబైల్ యాప్ను యూట్యూబ్ 2015లో విడుదల చేసింది.2017 ఫిబ్రవరి నాటికి ప్రతి నిమిషానికి 400 గంటల నిడివి ఉన్న కంటెంట్ అప్లోడ్ అయ్యేది.ఆగస్టు 2017లో సర్వీస్ ప్లే బటన్తో లోగోను రీడిజైన్ చేశారు.ఏప్రిల్ 3, 2018న కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు జరిగాయి.2019 నాటికి ప్రతి నిమిషానికి 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ అప్లోడ్ అయ్యేది.పింక్ఫాంగ్ ఛానల్కు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో వ్యూస్ జనవరి, 2022 నాటికి 1400 కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. 2016 జూన్లో ఈ వీడియో అప్లోడ్ చేశారు.ఇదీ చదవండి: గూగుల్లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్అత్యంత వయసు కలిగిన యూట్యూబర్గా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన కర్రి మస్తానమ్మ(107) రికార్డు నెలకొల్పారు.యూట్యూబ్లో 70 శాతం ట్రాఫిక్ మొబైల్ ఫోన్ల ద్వారానే వస్తోంది.96 శాతం టీనేజర్లు దీన్ని వినియోగిస్తున్నారు.91 దేశాల్లో ఇది సేవలందిస్తోంది.యూట్యూబ్ 80 భాషల్లో సేవలందిస్తోంది. దాదాపు 95 శాతం మంది తమ స్థానిక భాషలో వీడియోలు వీక్షించవచ్చు.
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్ప్లస్ 12 (OnePlus 12), వన్ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది.
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో అప్డేట్తో యూజర్లను అలరించింది. నిన్న మొన్నటి వరకు వాట్సప్ యాప్ మొత్తం బ్లూ కలర్ థీమ్లో ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో గ్రీన్ ఇంటర్ ఫేస్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రశాంతత, స్థిరత్వం, ఇన్ప్పిరేషన్కు మారుపేరైన బ్లూ కలర్ను స్థానంలో గ్రీన్ కలర్ ఇంటర్ ఫేస్ను ఎందుకు అందుబాటులోకి తెచ్చిందా అని యూజర్లు చర్చించుకుంటున్నారు.వాట్సప్ గ్రీన్ కలర్లోకి ఎందుకు మారింది?వాట్సప్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ యూజర్లకు ఆధునిక, కొత్త అనుభవాన్నిఅందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా వినియోగం సైతం మరింత సులభతరం కానుందన్నారు. ఇక, ఇంటర్ పేస్, రంగులు, చిహ్నాల రంగుల్ని సైతం మార్చినట్లు వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. రంగులు మార్చడానికి కారణం?రంగు మార్పు కంటే వాట్సప్ వినియోగించే యూజర్ ఎక్స్పీరియన్స్ను మరింత మెరుగు పరిచేందుకు యాప్లో మార్పులు చేపట్టినట్లు వాట్సప్ వెల్లడించింది. దీంతో పాటు వాట్సప్ తన మెసేజ్ కీబోర్డ్లలో కొన్ని పదాలను క్యాపిటలైజ్ చేసింది. కొంతమంది వినియోగదారులు ఆన్లైన్, టైపింగ్ మొదటి అక్షరాలను క్యాపిటలైజ్ చేసిన మార్పును గమనించారు. ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ గమనించిన ఈ మార్పు ఆన్లైన్లో ముఖ్యమైన చర్చలకు దారితీసింది.
వీడియోలు
Watch Live : సీఎం జగన్ కందుకూరు బహిరంగ సభ
Watch Live: వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ
వదల బొమ్మాలి.. వదల..
Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ
సీఎం వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో పై మంత్రి రోజా హర్షం
ఇవాళ్టి నుంచే సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరి
నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం సీఎం జగన్
తాడిపత్రిలో ఎగిరేది మన జెండానే
పవన్ కళ్యాణ్ ని వదిలి 1000 మంది వైఎస్ఆర్ సీపీలోకి జనసేన నాయకులు
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్