-
రెండో రోజూ తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు రెండో రోజు మంగళవారం కూడా సమస్యలను చవిచూశారు. దేశవ్యాప్తంగా పలు సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం నుంచి దేశీయ పౌర విమాన సేవలు ఆరంభం అయిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 325 విమానాలు గమ్యస్థానాలకు బయల్దేరగా, 283 విమానాలు గమ్యస్థానాలకు చేరుకున్నాయి. మొత్తం 41,673 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్టు పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురి ట్వీట్ చేశారు. బెంగాల్ రాష్ట్రం నుంచి ఒక్క సర్వీసు కూడా నడవలేదు. చెన్నై విమానాశ్రయం నుంచి 20 విమానాలు టేకాఫ్ తీసుకోగా, మరో 20 ల్యాండయ్యాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 277 విమాన సర్వీసులకుగాను, 25 రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయం కేవలం 20 సర్వీసులను నిర్వహించింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలు విమానాల సంఖ్యపై పరిమితులు విధించాయి. కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే ఆ విషయం తెలియడంతో వారి నుంచి నిరసన వ్యక్తం అయింది. తొలిరోజు 428 విమాన సర్వీసులే దేశీయంగా పౌర విమాన సేవలు ప్రారంభమైన సోమవారం 428 విమాన సర్వీసులు నడిచినట్టు పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. 832 విమాన సర్వీసులు నడిచినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ట్వీట్ చేసిన కొద్ది గంటల తర్వాత సంబంధిత శాఖ నుంచి మంగళవారం ఈ ప్రకటన విడుదల అయింది. -
నేటి నుంచి ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు
తొలి విమానం బెంగళూరు-గోవాకు ముంబై: ఎయిర్ ఏషియా ఇండియా విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో దేశీయ విమానయాన రంగంలో తీవ్రమైన పోటీకి తెర లేచిందని నిపుణులంటున్నారు. ఇండిగో, స్పైస్జెట్, గో ఎయిర్, జెట్లైట్ల తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన సర్వీసులను అందిస్తుంది. టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ, ఎయిర్ ఏషియా, టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్ప్లేస్లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. టైర్ టూ నగరాలపై దృష్టి ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమానం నేడు బెంగళూరు నుంచి గోవాకు 3.10 గంటలకు ప్రారంభం కానున్నది. అత్యంత చౌక ధరలకే విమానయానాన్ని అందిస్తామంటున్న ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ టైర్ టూ నగరాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. బెంగళూరు-గోవా, బెంగళూరు-చెన్నైలకు విమాన చార్జీలను రూ.999కే అందించడం ద్వారా ఈ సంస్థ ఇప్పటికే ధరల పోరుకు తెర తీసింది. ఈ బుకింగ్స్ ప్రారంభమైన 10 నిమిషాలకే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement