-
నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘ఆమెకు ప్రాణహాని ఉంది నిజమే’
న్యూఢిల్లీ: నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎక్కడా కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మకు ప్రాణహాని ఉన్నది నిజమేనని వ్యాఖ్యానించింది. ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నూపుర్ శర్మపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసే విషయంపై ఆగస్టు 10లోగా స్పందన తెలపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, జుమ్ముకశ్మీర్, అస్సాం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది. జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది. ఆ తర్వాతి నుంచే నూపుర్ శర్మను చంపేస్తామనే బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ ఛిస్తీ, యూపీ చెందిన వ్యక్తి.. నూపుర్ శర్మను హతమారుమాస్తామని బెదిరించిన విషయాలను ప్రస్తావించారు. చదవండి: వాట్సాప్ స్టేటస్గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
నూపుర్ శర్మను చంపిన వారికి ఆస్తినంతా రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్
జైపూర్: నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నూపుర్ శర్మ తల తెచ్చిన వారికి తన ఇల్లుతో పాటు ఆస్తినంతా రాసిస్తానని సల్మాన్ ఓ వీడియో విడుదల చేశాడు. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన ఆమెను హతమార్చాలని పిలుపునిచ్చాడు. తాను అజ్మేర్ దర్గా నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. వీలుంటే తానే ఆమెను తుపాకీతో కాల్చి చంపేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు దేశంలోని ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, అనేక చోట్ల తమపై దాడులు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సల్మాన్ను అరెస్టు చేశారు. సల్మాన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అజ్మీర్ దర్గా ప్రతినిధులు స్పష్టం చేశారు. దర్గా పవిత్ర స్థలం అని, అలాంటి చోట ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సల్మాన్ డ్రగ్స్కు బానిసయ్యాడని, అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ ఉదయ్పుర్లో కన్నయ్య లాల్ అనే టైలర్ను ఇద్దరు వ్యక్తులు ఇటీవలే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతడిని హత్య చేసిన అనంతరం వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు ఇద్దరు నిందితులను మూడు గంటల్లోనే అరెస్టు చేశారు. -
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్స వాల్లో సమర్పించే చాదర్(గిలాఫ్)ను సీఎం కేసీఆర్ గురువారం పంపారు. ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ను ముస్లిం మత పెద్దలు కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమిం చాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరో గ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థిం చారు. ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్, ముఫ్తి సయ్యద్ యూసఫ్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అజ్మీర్ దర్గా ఉర్సుకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ ఉర్సు 805వ వార్షిక ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుంచి అజ్మీర్కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–అజ్మీర్ (07125/07126) ప్రత్యేక రైలు ఈ నెల 31న మధ్యాహ్నం 3.15కు నాంపల్లి నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 5.15కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6న ఉదయం 9.55కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న రాత్రి 11.15కు నాంపల్లి చేరుకుంటుంది. కాచిగూడ–అజ్మీర్ (07129/07130) ప్రత్యేక రైలు మార్చి 31న రాత్రి 8.40కి కాచిగూడ నుంచి బయలుదేరి ఏప్రిల్ 2న ఉదయం 7.25కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న సాయంత్రం 7.25కు అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7 ఉదయం 7.30కు కాచిగూడ చేరుకుంటుంది. నెల్లూరు–అజ్మీర్ (07227/07228) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 7.40కి నెల్లూరు నుంచి బయలుదేరి ఏప్రిల్ 1న రాత్రి 9.30కు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5న రాత్రి 9.40కి అజ్మీర్ నుంచి బయలుదేరి ఏప్రిల్ 7న మధ్యాహ్నం 1.45కు నెల్లూరు చేరుకుంటుంది. మచిలీపట్నం–అజ్మీర్ (07131/07132) ప్రత్యేక రైలు మార్చి 31న ఉదయం 10.40కి మచిలీపట్నం నుంచి బయలుదేరి అదేరోజు నెల్లూరు–అజ్మీర్ ప్రత్యేక రైలుకు లింక్ అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 7న విజయవాడ వద్ద అజ్మీర్–నెల్లూర్ ఎక్స్ప్రెస్ నుంచి విడిపోయి ఉదయం 10.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. -
భిక్షగాళ్లకు బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు
మంచి సెంటర్ దొరికితే.. దానికి మించిన బిజినెస్ లేదు. సీజన్తో సంబంధం లేకుండా 365 రోజులూ సంపాదన. ఖర్చులు పోగా ప్రతిరోజూ బ్యాంకు ఖాతాల్లో పొదుపు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? రాజస్ధాన్లోని అజ్మీర్లోగల ప్రఖ్యాత ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ దర్గా దగ్గర భిక్షగాళ్ల వ్యవహారం. అవును.. అజ్మీర్ దర్గా దగ్గర భిక్షగాళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది. చేతినిండా డబ్బులు పడుతుండటంతో.. చాలామంది భిక్షగాళ్లు బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు కూడా నిర్వహిస్తున్నారట. బిహార్ నుంచి వచ్చిన పప్పు సింగ్ అనే భిక్షగాడు.. ప్రతిరోజూ తన ఖాతాలో కనీసం రూ. 200 అయినా డిపాజిట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడు అనుకోకుండా భిక్షగాడు అయ్యాడు. అతడు గతంలో ఒకసారి ప్రమాదానికి గురైనప్పుడు ఆశీర్వాదాల కోసం అజ్మీర్ దర్గాకు వచ్చాడు. అయితే.. కొంతమంది భక్తులు అతడు భిక్షగాడు అనుకుని భిక్షం వేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఇదేంటని తనకు కోపం వచ్చిందని, కానీ తర్వాత ఇదేదో ఆయన ఆశీర్వాదాలతోనే వచ్చిందని అనుకున్నానని తెలిపాడు. అలా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 200 డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పాడు. త్రిపుర నుంచి వచ్చిన మరో ఇద్దరు భిక్షగాళ్లు సోదరులు. వాళ్లిద్దరికీ కెనరా బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది. రజా ఇస్లాం, సహీదుల్ ఇస్లాం అనే ఈ ఇద్దరూ గత పదేళ్లుగా అజ్మీర్లోనే ఈ బెగ్గింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరులో సహీదుల్ అంధుడు. దాంతో రజా అతడికి సాయం చేస్తుంటాడు. నసీమా ఖాను అనే 62 ఏళ్ల మహిళ అజ్మీర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషన్గఢ్ నుంచి ప్రతిరోజూ వచ్చి దర్గా దగ్గర భిక్షాటన చేస్తుంది. ప్రతి రెండు మూడు రోజులకోసారి ఆమె తనకు వచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. ఏటీఎం కార్డుతో ఎంత మొత్తం ఉందో సరిచూసుకుంటుంది. ఇలా అజ్మీర్ దర్గా దగ్గర ఉన్న భిక్షగాళ్లలో దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహించుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement