-
‘అడవిలో అరాచకం’పై అట్టుడికిన తాడ్వాయి
నాలుగు గంటలపాటు వివిధ పార్టీల నేతల ధర్నా ఎస్ఎస్ తాడ్వాయి: అటవీశాఖ దాడులకు గురైన గొత్తికోయలకు న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన అధికారులపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఇక్కడకు రావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం జలగలంచ అటవీ ప్రాంతంలోని గొత్తి కోయలపై శనివారం అటవీశాఖ అధికారుల దాడికి నిరసనగా ఆదివాసీ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో తాడ్వాయి ఫారెస్ట్ కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అధికారులు స్పందించకపోవడంతో నాయకులు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. గిరిజనులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆదివాసీ సంఘాల నాయకులు, పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్, ములుగు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. వలస వచ్చిన ఆదివాసీలపై దాడులకు పాల్పడడం ఈ ప్రభుత్వానికే చెల్లుబాటు అవుతుందన్నారు. కలెక్టర్ సమాధానంపై నేతల అసహనం దాడి ఘటనపై మాట్లాడేందుకు కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ జయశంకర్ భూపా లపల్లి జిల్లా కలెక్టర్ మురళితో ఫోన్లో మాట్లాడారు. ‘ఏం జరిగిందో నాకేం తెలియదు. అయినా ఛత్తీస్గఢ్కు చెందిన గొత్తికోయల గురించి ఎందుకు సార్’ అని కలెక్టర్ సమాధానం ఇవ్వడంతో బలరాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐఏఎస్ అధికారి అయిఉండి ఏం మాట్లాడుతున్నావ్.. ఛత్తీస్గఢ్ గొత్తికోయలు అయితే మనుషులు కాదా .. అని ప్రశ్నించారు. ఈ సంభాషణ జరుగుతుండగానే ఫోన్ కట్ అయింది. సీతక్క కూడా కలెక్టర్తో ఈ విషయంపై ఫోన్లో మాట్లాడగా.. తనకేం తెలియదని కలెక్టర్ సమాధానం ఇచ్చారు. గూడేనికి తరలిన గొత్తికోయలు.. ధర్నా చేస్తున్న పలు పార్టీల నాయకులతో ములుగు డీఎస్పీ దక్షిణామూర్తి ఫోన్లో మాట్లాడారు. తాడ్వాయి అటవీశాఖ అధికారులు పడేసిన సామగ్రిని గూడేనికి తరలించి వారికి భోజన వసతి కల్పించాలన్న నాయకుల డిమాండ్ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అలాగే గిరిజనులపై జరిగిన దాడిపై ఆదివాసీ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులతో ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో చక్రధర్ ఫోన్లో హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. -
తమ్ముళ్ల తన్నులాట
హైదరాబాద్కు చేరనున్న నీరు-చెట్టు పంచాయితీ నీరు చెట్టు పనుల కేటాయింపుపై తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవలు చెలరేగాయి. చిలికిచిలికి గాలివానగా మారింది. తమ వారిపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసే స్థాయికి దిగజారింది. పనుల వివరాలపై ప్రశ్నించిన ఓ నాయకుడుపై కేసులు పెట్టటంతో పంచాయితీని హైదరాబాద్కు చేర్చారు. పనులు ఏ మండలానికి ఆ మండలానికే కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల మధ్య చెలరేగిన గొడవలు అందర్ని ముక్కున వేలేసుకుసేలా చేస్తున్నాయి..- గుడివాడ గుడివాడ: నీరు-చెట్టు తెలుగు తమ్ముళ్లకు వరంగా మారింది. పనులు చేజిక్కించుకునేందుకు నానా తం టాలు పడుతున్నారు. నియోజకవర్గంలో రూ.కోట్ల పనులు కొందరికి దక్కకపోవడంతో పార్టీ నేతల మధ్య చిచ్చు రేపుతుంది. పనులు పరిశీలిస్తున్న నాయకుడుపై అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి నెల కొంది. జిల్లాలోని పలు ప్రాంతాల నేతలు నియోజకవర్గంలో పనులు చేజిక్కించుకున్నారు. స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. నేతల మధ్య రగడ కొనసాగుతుంది. పప్పు, బెల్లాల్లా పంచారు.. గతంలో చంద్రయ్య డ్రెయిన్ ఆధునికీకరణ పనుల్లో ఉంది. దీనిని నీరు-చెట్టులోకి తీసుకొచ్చి పనులను తమ్ముళ్లకు పప్పుబెల్లాల్లా పంచారు. ఉయ్యూరు కేసీపీ ఫ్యాక్టరీ వద్ద డ్రెయిన్ మొదలై ఉప్పుటేరు వద్ద కలుస్తుంది. గుడివాడ చానల్లో పనులు నీరు-చెట్టు కింద పెట్టి మట్టిని అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంలోనూ తమ్ముళ్ల మధ్య గొడవలు రేగుతున్నాయి. సొంత వారే పగయ్యారు.. నందివాడ మండలానికి చెందిన కాకరాల సురేష్ నీరు-చెట్టు పనులు పరిశీలించేందుకు వెళ్లారు. ఆయనపై సొంత పార్టీ వారే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement