-
19 కొత్త ఎయిమ్స్లలో ఆయుర్వేద శాఖలు
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుచేసిన 19 ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లలో ఆయుర్వేద శాఖలను నెలకొల్పనున్నట్లు ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), ఇతర పారమిలటరీ దళాలకు చెందిన ఏడు ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖలను ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 100 ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని నాయక్ తెలిపారు. అంటురోగాలుకాని వ్యాధుల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన జాతీయ పథకాన్ని ఇప్పుడున్న ఆరు రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు. -
ఐటీఐ చదివి.. డాక్టర్ అయ్యాడు
గోదావరిఖని: ఐటీఐ చదువుకొని ఆ పై బంగారు నగల దుకాణంలో పనిచేసి అటునుంచి డాక్టర్ అవతారమెత్తాడో ప్రబుద్ధుడు. నేచురోపతి పేరుతో దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని అమాయకుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్న ఓ నకిలీ డాక్టర్ ఆట కట్టించారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని మార్కండేయ కాలనీలో నివాసముంటున్న సంపత్కుమార్ ఐటీఐ చదువుకున్నాడు. అనంతరం పొట్టకూటి కోసం కాగజ్నగర్లోని ఓ గోల్డ్ షాపులో కూలీగా పని చేశాడు. అక్కడి నుంచి మెరుగైన జీవనం కోసం హైదరాబాద్ చేరుకొని ఆ పని ఈ పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాధించాలనే కాంక్షతో.. నేచురోపతి నకిలీ సర్టిఫికెట్ సంపాదించి మార్కండేయ కాలనీలో ఆయుర్వేదిక్ క్లినిక్ తెరిచాడు. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని నమ్మించి రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఇతని వ్యవహారం పై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పక్కా ప్లాన్తో క్లినిక్ పై దాడులు నిర్వహించిన పోలీసులు సంపత్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఓ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. -
అయ్యో.. ఆయుర్వేదం
► వంద పడకల ఆస్పత్రిలో 35 మందే సిబ్బంది ► ఏడాదిలో మందులు ఇచ్చేది రెండు నెలలే ► అవసరాలు తీర్చని అరకొర బడ్జెట్ ► రోగులకు సేవలందించలేని ఆయుర్వేదాస్పత్రి పోచమ్మమైదాన్ : ప్రాచీన కాలం నుంచి ఆదరణ పొందుతున్న ఆయుర్వేద వైద్యానికి పాలకుల నుంచి మాత్రం నిర్లక్ష్యమే ఎదురవుతోంది. కార్పొరేట్ ఆస్పత్రిని తలపించేలా రెండు ఎకరాల విస్తీర్ణంలో సొంత భవనంలో కొనసాగుతున్న వరంగలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలోని సమస్యలను పరిశీలిస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు. ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతుండడంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి.. ఆస్పత్రిని 58 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, ఉద్యోగుల భర్తీని ఎవరూ పట్టించుకోకపోవడంతో సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నారుు. ఇక ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులు ఇచ్చేందుకు సరిపడా బడ్జెట్ కేటారుుంచడం లేదు. మందుల విషయంలో రోగులకు సమాధానం చెప్పలేక విసిగిపోరుున వైద్యులు మందుల లేనందున రోగులు సహకరించాలి అని కోరుతూ ఏకంగా బోర్డు పెట్టడం గమనార్హం. 61 పోస్టులు.. 26 ఖాళీ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో మొత్తం 61 పోస్టులు మంజూరు ఉండగా.. కేవలం 35 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఏకంగా 26 పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్న వారిపై భారం పడడమే కాకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందడం లేదు. ఓ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుతో పాటు బయోకెమిస్టు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, టైపిస్టు, రేడియూలజిస్టు, ఇద్దరు డ్రైవర్లు, రిజిస్టర్ రైటర్, ముగ్గురు దాయాలు, మాసాజిస్టు, నర్సింగ్ ఆర్డర్లీ, ఎక్స్రే టెక్నీషియన్, ఇద్దరు వంట మనుషులు, క్లీనర్, ఇద్దరు స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్ ఆయుర్వేద ఆస్పత్రిలో పోస్టులు భర్తీ చేసేలా జిల్లా ప్రజాప్రతినిధులు చూపాలని పలువురు కోరుతున్నారు. అరకొర మందులు... ఆయుర్వేద ఆస్పత్రికి మందుల కోసం ఏటా రూ.4లక్షల బడ్జెట్ కేటారుుస్తున్నారు. ఏదై నా ఓ పెద్దాస్పత్రిలో ఫినారుుల్ కోసం కేటారుుంచే బడ్జెట్కు ఇది సమానమని వైద్యులు చెబుతున్నారు. ఈ బడ్జెట్తో ఏడాదిలో రెం డు నెలల మాత్రమే మందులు సరఫరా చే యగలుగుతున్నారు. ఇక మిగిలిన పది నెల లు రోగులకు మందులు ఇవ్వలేక.. ఎందు కు ఇవ్వడం లేదని అడిగే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైద్యులు, సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థారుులో మందులు ఇవ్వాలంటే ఏడాదికి రూ.40లక్షలు అవసరమవుతారుు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు కూడా. ఆ ప్రతిపాదనలు పరి శీలనలోనే ఉండడంతో ‘రోగులకు గమనిక .. మందుల సరఫరా కావడం లేనందున సహకరించగలరు...’ అని కోరుతూ ఓ నోటీ సు అంటించారు. ఇదేకాకుండా రేడియాలాజిస్ట్ అకాల మరణంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆస్పత్రికి వస్తున్న రోగులకు ఎక్స్రే తీయడ ం లేదు. ఫలితంగా రోగ నిర్ధారణ సాధ్యంకాక వైద్యులు పరిశీలించకపో గా... రోగులు ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లను ఆశ్రరుుంచాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలతో వంద పడకలు ఉన్న ఈ ఆస్పత్రికి ఏనాడూ 60 మందికి మించి రోగులు రావడం లేదు. అరుుతే, వచ్చిన రోగులకు కూడా సిబ్బంది, మందుల కొరత కారణంగా సరైన వైద్య సేవలందడం లేదు. మందు గోలీలు ఇవ్వలేదు ఆస్పత్రికి వస్తే వైద్యులు చూసినప్పటికీ ఒక్క గోళీ ఇవ్వలేదు. గోళీలు లేని ఆస్ప త్రి ఎందు కు? కాళ్లకు తిమ్మిర్లు వస్తున్నాయని చెబితే చిట్టీ రాసిచ్చారు. బయట దుకాణంలో అడిగితే మందులకు రూ.300 అవుతుందన్నారు. అవి కొనుక్కోలేకే కదా గవర్నమెంట్ దవాఖానాకు వచ్చింది. అందుకే ఇంటికి ఎల్తాన. - నర్సయ్య, రోగి ఎన్నోమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం... ఆస్పత్రిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నారుు. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్నోమార్లు వివరించాను. ఆస్పత్రిని సందర్శించిన ప్రజాప్రతినిధులందరికీ వివరాలు అందించాను. ఖాళీలు భర్తీ చేస్తేనే తప్ప రోగులకు సరైన న్యాయం చేయలేం. ఇక మందుల పరిస్థితి కూడా అదే. - సుద్దాల రాజమౌళి, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గితే డెంగ్యూ ఉన్నట్లేనా?
ఆయుర్వేదం కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. బరువు 82 కేజీలు. గత రెండేళ్లుగా రెండు మోకాళ్లలోనూ క్రమేణ నొప్పులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కీళ్లు కదల్చడం ఇబ్బందికరంగా ఉంది. ఎముకల వైద్య నిపుణులు మోకాళ్ల చిప్పలు మార్చే శస్త్రచికిత్సను సూచించారు. ఆయుర్వేద మందులతో ఈ సమస్య పరిష్కారమవుతుందా? దయచేసి వివరంగా తెలియజేయండి. - పి. సూర్యారావు, మెదక్ ఆయుర్వేదశాస్త్రంలో ఈ వ్యాధిని సంధివాతంగా వివరించారు. సాధారణంగా ఇది వయసుపైబడిన వారిలో కనిపిస్తుంటుంది. వయసు రీత్యా శరీరంలో వాత ప్రాబల్యం కలుగుతుంది. దీనికి తోడు తినే ఆహారంలో పోషక విలువలు లోపించడం, తగురీతిలో శరీరంలోని అన్ని కీళ్లకూ వ్యాయామం లేకపోవడం, అశాస్త్రీయంగా వాడే కొన్ని రకాల మందుల దుష్ర్పభావం, సొంతవైద్యాలు, నాటువైద్యాల ఫలితాలు ఇలాంటి సమస్యకు ఇతర కారణాలు. వీటి వల్ల వాతప్రకోపం జరిగి, అస్థి ధాతు శైథిల్యానికి దారితీస్తుంది. దీన్నే ధాతుక్షయం అంటే డిజెనరేటివ్ పరిస్థితిగా పరిగణించాలి. ఇక్కడ మోకాలి చిప్పలు (పటెల్లా అనే మృదులాస్థి) అరిగిపోవడం జరుగుతుంది. ఈ అరుగుదల తీవ్రతను బట్టి, మనకు కనిపించే లక్షణాలు ఉంటాయి. చికిత్సాసూత్రాలు: ఏ వ్యాధికైనా ముందుగా కారణాలను దూరంగా ఉంచాలి. మీరు ప్రధానంగా బరువు తగ్గాలి. షుగరు, బీపీ వంటి వ్యాధులేవైనా ఉంటే నియంత్రించుకోవాలి. విటమినులు, క్యాల్షియం లవణాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినండి. ఆకుకూరలు, పాలు, పెరుగు, తాజాపండ్లు, శుష్కఫలాలు మితంగా తినండి. మాంసరసం, చేపలు తగినంతగా తీసుకోండి. లభిస్తే తామరతూండ్లతో కూర చేసుకొని తినండి. మితిమీరి వ్యాయామం చేయవద్దు. శరీరం సహకరించినంతవరకు, తగురీతిలో వ్యాయామం చేయ్యండి. ముఖ్యంగా సోఫోలో కూర్చొని మోకాళ్లను మెల్లగా ముడుచుకోవడం, చాచడం 10 నిమిషాలు రెండుపూటలా చేయండి. క్రమక్రమంగా ఆ సామర్థ్యం పెరగడానికి వెసులుబాటు అవుతుంది. ఔషధాలు: క్షీరబలా (క్యాప్సూల్స్): ఉదయం 1, రాత్రి 1 ఖాళీ కడుపున మహాయోగరాజ గుగ్గులు (మాత్ర) : పూటకొక్కటి చొప్పున మూడుపూటలా (తిన్న తర్వాత) బృహత్వాతచింతామణి (మాత్రలు) : రోజుకొక్కటి అశ్వగంధారిష్ట (ద్రావకం) : నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి. పిండతైలం, మహానారాయణ తైలాలను సమానంగా కలిపి మోకాళ్లపై మృదువుగా, పావుగంట పాటు, రెండుపూటలా మర్దనా చేసి, వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఈ చికిత్సాక్రమం మూడు నెలలు పాటించి, తర్వాత పరిస్థితిని సమీక్షించుకోండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్నగర్, హైదరాబాద్. జనరల్ కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 17 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల మా అమ్మాయికి తీవ్ర జ్వరంతో ఒళ్లునొప్పులు కూడా ఉన్నాయి. రక్తపరీక్ష చేయిస్తే ప్లేట్లెట్ల సంఖ్య 1.10 లక్షలుగా ఉన్నట్లు తేలింది. అంటే మా అమ్మాయికి డెంగ్యూ ఉన్నట్లేనా? తనకు ప్లేట్లెట్లు ఎక్కించాలా? అసలు ప్లేట్లెట్లు ఎందుకు తగ్గుతాయి? జ్వరం, ఒళ్లునొప్పులతో మా అమ్మాయి కాలేజీకి వెళ్లలేకపోతోంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నందున చదువులో ఎక్కడ వెనకబడుతుందో అని ఆందోళనగా ఉంది. దయచేసి మా అమ్మాయి సమస్యకు పరిష్కారం చెప్పండి. - చంద్రకళ, నిజామాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీ అమ్మాయి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే డెంగ్యూ ఉన్నట్లు కాదు. చాలా కారణాల వల్ల శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. సరైన వ్యాధి నిర్ధారణ ద్వారా ఏ కారణంతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందో తెలుసుకొని చికిత్స అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్ల సంఖ్య 1.10 లక్షలకు తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే వైరల్ ఫీవర్లలో కూడా జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటితో పాటు నీరసం ఉంటే పండ్లసరాలు, కొబ్బరినీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తాగించండి. ఈ తరహా సమస్య ఉన్నవారికి బయటకు పంపించడం అంత మంచిది కాదు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ప్రదేశాలకు అసలు పంపించకూడదు. ముందుగా వైద్య పరీక్షలు చేయించి, వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధిని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. దాంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. మీ అమ్మాయికి సాధారణ జ్వరమే అయితే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గిన వెంటనే కాలేజీకి పంపించవచ్చు. అనారోగ్యంతో కాలేజీకి వెళ్లిన మీరు ఆశించిన ప్రయోజనం ఉండదు. ఆరోగ్యంగా ఉండి కాలేజీకి వెళ్తేనే చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా వైద్యులను సంప్రదించి, మీ అమ్మాయి సమస్య ఏమిటో తెలుసుకొని, అందుకు అనుగుణంగా చికిత్స చేయించుకోండి. డాక్టర్ కె. శశికిరణ్ సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ . ఎండోక్రైనాలజీ కౌన్సెలింగ్ నా భార్య గర్భవతి. ఇప్పుడు ఆరోనెల. ఇటీవలే థైరాయిడ్ పరీక్ష చేయిస్తే టీఎస్హెచ్ 5.3 అని తెలిసింది. ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదిస్తే ఆ విలువ 3 కంటే తక్కువగా ఉండాలని చెప్పి, థైరాక్సిన్ అనే మందు మొదలుపెట్టారు. దాని మోతాదు 50 ఎంసీజీ. నావి రెండు ప్రశ్నలు. మొదటిది... టెస్ట్ రిపోర్ట్లో టీఎస్హెచ్ నార్మల్ వ్యాల్యూ 0.3 - 5.5 అని ఉంది. మరి నా భార్యకు థైరాక్సిన్ మందు ఇవ్వడం ఎందుకు మొదలుపెట్టారు? రెండో ప్రశ్న కాన్పు తర్వాత ఈ హైపోథైరాయిడిజమ్ తగ్గుతుందా? - జీవీఆర్., కర్నూలు మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే.. 0.3 - 5.5 అనే నార్మల్ రేంజ్.. గర్భవతులకు వర్తించదు. గర్భిణిగా ఉన్నప్పుడు కలిగే ఒత్తిడులను తట్టుకోడానికి శరీరం థైరాయిడ్ హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ ఉత్పత్తి తగ్గితే అది వారికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మీరు చెప్పిన వివరాల ప్రకారం ఆమెకు తగినంత టీఎస్హెచ్ స్రవించడం లేదు. అందుకే ఆమెకు ఉన్న కండిషన్ను హైపోథైరాయిడిజమ్గా చెప్పవచ్చు. మీరు థైరాక్సిన్ ట్యాబ్లెట్లను నిరభ్యంతరంగా వాడవచ్చు. ఇక ప్రసవం అయిన మర్నాటి నుంచి మీ భార్యకు వచ్చే థైరాక్సిన్ మోతాదు తగ్గించాలి. అందుకే కాన్పు అయిన 4 - 8 వారాల తర్వాత మళ్లీ మరోసారి టీఎస్హెచ్ మోతాదులను పరీక్షించి, ఆమెకు ఇవ్వాల్సిన మోతాదులను నిర్ణయించాలి. దీనికోసం అప్పుడు మీ ఎండోక్రైనాలజిస్ట్ను మరోసారి సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ప్రసవం తర్వాత 2 - 3 నెలల్లో టీఎస్హెచ్ తగ్గి, మళ్లీ పెరుగుతుంది. దీన్ని పోస్ట్పార్టమ్ థైరాయిడైటిస్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నెలలు థైరాక్సిన్ మోతాదు తగ్గించి, అవసరాన్ని బట్టి మళ్లీ పెంచాల్సి ఉంటుంది. ఇక మీ భార్యకు ప్రెగ్నెన్సీలో వచ్చిన హైపోథైరాయిడిజమ్, ప్రసవం తర్వాత తగ్గుతుందా లేదా అన్నది ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేం. అయితే యాంటీ టీపీవో యాంటీబాడీస్ పరీక్ష ద్వారా కొంతమేరకు అంచనా వేయవచ్చు. వివరాల కోసం మీ ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించండి. గర్భధారణ తర్వాత వచ్చే హైపోథైరాయిడిజమ్లో ఎక్కువ శాతం కాన్పు తర్వాత కూడా కొనసాగుతుంది. మీరు నిర్భయంగా ఉండాల్సిన అంశం ఏమిటంటే... తల్లికి వచ్చిన హైపోథైరాయిడిజమ్ బిడ్డకు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. కానీ... కొంతమంది శిశువుల్లో జన్మతః థైరాయిడ్ గ్రంథే లేకపోవచ్చు లేదా సరిగా పనిచేయకపోవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడం కోసం చిన్నారి పుట్టిన 48 గంటల తర్వాత టీ4 అండ్ టీఎస్హెచ్ పరీక్ష తప్పనిసరి. డాక్టర్ వి. శ్రీ నాగేష్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ .
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement