-
చైల్డ్ లైన్ దారిలోకొచ్చేదెపుడు?
2002వ సంవత్సరం డిసెంబర్ 13న బాల కార్మిక వ్యవస్థను దేశ వ్యాప్తంగా నిర్మూలిస్తూ ఆర్టి కల్ 24ను సవరించి 84వ రాజ్యాంగ సవరణ మేరకు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని చట్టాన్ని సవరించారు. ఆ నాటి నుంచి పిల్లల రక్షణ, పరిరక్షణకు చైల్డ్ లైన్ అనే సహా యక బృందం ఉండాలని ఆ సహాయక బృందం బాల కార్మికులను రక్షించడానికి రోజుకు 24 గంటలు వారానికి ఏడు రోజులు పని చేయాలనే సదుద్దేశంతో 1098 అనే ప్రత్యేక ఫోన్ నంబర్ను కేటాయిస్తూ చైల్డ్ లైన్గా, చైల్డ్ హెల్ప్ లైన్గా సంబోధిస్తున్నారు. చైల్డ్ లైన్ను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పిల్లల రక్షణకు 1098 అనే నంబర్ ఉన్నదని, ఎప్పు డైనా ఫోన్ చేస్తే పిల్లలను ఆదుకుంటారనే విషయం బహు కొద్దిమందికి మాత్రమే తెలుసన్నది అతిశ యోక్తి కాదు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో నడిచే ఈ చైల్డ్ లైన్ దక్షిణ భారత దేశంలో ఒకే ఒక్క చెన్నై కేంద్రంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చే ఫోన్లను స్వీకరిస్తూ ఆయా రాష్ట్రాలకు, జిల్లాలకు చేర వేస్తుంది. కేవలం ఒకే కేంద్రం నలుమూలల నుంచి∙వచ్చే ఫోన్లను స్వీకరించి మళ్లీ ఆ సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు చేరవేయాలంటే ఎంత కసరత్తు చేయాలి. సిబ్బంది ఎంత ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందనే పరిస్థితితోపాటు, అవసరాలకు అనుగు ణంగా ఈ వ్యవస్థ పని చేయగలుగుతుందా అన్నది ప్రశ్నలాగే మిగిలిపోతుంది. చైల్డ్ లైన్ వ్యవస్థలో ఒక్కో జిల్లాకు ఒక్కో యూనిట్గా పనిచేసే కేవలం ఎని మిదిమంది సిబ్బంది మాత్రమే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో అసలు చైల్డ్ లైన్ యూనిట్ లేదనేది సిగ్గుచేటైన వాస్తవం. అలాగే వందా ముప్పైకోట్ల జనాభా కలిగిన దేశానికి నాలుగు చైల్డ్ లైన్ కేంద్రాలు మాత్రమే ఉండటం ఘోరం.హైదరాబాద్ లాంటి మహా నగరంలో ఎనిమిది మందితోనే పని నెట్టుకొస్తోంది. ఈ పదిమందిలో ఒకరు కో–ఆర్డినేటర్, ఓ కౌన్సిలర్, ఆరుగురు కార్య కర్తలతో నెట్టుకొస్తున్నది. వీరికి కూర్చోవడానికి సరైన వసతి లేకపోవడంతో గతంలో కలెక్టర్ కార్యా లయంలో కూర్చునే వీరు ప్రస్తుతం భరోసా సెంటర్లో కూర్చోవడంతో మా పంచన చేరారనే భావనతో వారిని భరోసా అధికారుల వ్యక్తిగత పను లకు వినియోగిస్తున్నట్లు వినికిడి. ఈ చైల్డ్ లైన్ వ్యవస్థ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఉన్నప్పటికీ ఆ శాఖ నేరుగా నడిపించలేక కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఈ చైల్డ్ లైన్ను అంట గట్టడంతో ఆ స్వచ్ఛంద సంస్థలు సహితం చేసిన పనికి డబ్బులు రాబట్టుకునే సరికి విసిగి, వేసారి ఛీ.. చైల్డ్ లైన్ అనే స్థితికి వచ్చింది. ఆ స్వచ్ఛంద సంస్థ, వారి చైల్డ్ లైన్ సిబ్బందికి జీతాలు రాకపోవడంతో చివరకు ఆ పనినే వదులుకుంది.పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసినప్పుడు, హింసల నుంచి చేరదీసినప్పుడు, బిచ్చగాళ్ల, వ్యభిచార ముఠాల నుండి కాపాడిన ప్పుడు ఆ పిల్లలను చాలా సురక్షితంగా శిశు గృహా లకు, బాల బాలికల గృహాలకు రక్షించాల్సిన గురు తర బాధ్యత కలిగిన చైల్డ్ లైన్కు తగిన రక్షణగానే పిల్లలను తరలించడానికి వాహనాలుగానీ, పిల్లలకు అప్పటికప్పుడు ఆహారం, ప్రాథమిక వైద్యం కల్పించ డానికి ఎలాంటి వసతులు లేక కేవలం చైల్డ్ లైన్కు చెందిన కార్యకర్త సంఘటనా స్థలానికి వచ్చి పిల్ల లను సురక్షితంగా తరలించడానికి ఎవరు సహకారం అందిస్తారా అని బేలగా చూసే సందర్భాలు అను నిత్యం కనిపిస్తాయి. పిల్లలను రక్షించి వసతి గృహా లకు తరలించే సున్నితమైన, అత్యంత బాధ్యతాయు తమైన పని ప్రజారవాణా ద్వారానే జరుగుతుం డటం, కొన్నిసార్లు చైల్డ్ లైన్ వాలంటీర్లపై దాడులు సైతం జరిగిన సందర్భాలు లేకపోలేదు.పిల్లల రక్షణ, పరిరక్షణలో అత్యంత కీలక బాధ్యత వహించే చైల్డ్ లైన్ ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా కేంద్రాలుగా ఇంత పెద్ద దేశానికి పనిచేస్తూ దారి, గమ్యం లేక కొట్టుమిట్టాడు తుండటమే కాక, ఆ కార్యకర్తలు నెలకు కేవలం ఆరువేల రూపాయల జీతంతో పనిచేస్తున్నా రంటే, వారికి నిర్దిష్టమైన బాస్ లేక... ప్రతి ఒక్కరూ అధికారం చెలాయిస్తూ, ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదో, ఎవరికి కోపం వస్తే ఏమిటో అన్నట్లున్న చైల్డ్ లైన్ ఉద్యోగుల పరిస్థితి ఉంటే, అసలు చైల్డ్ లైన్కు ఒక కార్యా లయం, అస్థిత్వం ఎందుకు లేదు అన్నదే ప్రశ్న. స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఎందుకు చైల్డ్ లైన్ నిర్వహించలేక పోతున్నది? మానవ వనరులు లేకనా, పిల్లలకు సమస్యలు లేకనా? అసలు అధికారులకు మనసు లేకనా? పిల్లల పరిరక్షణలో కీలకపాత్ర పోషించే చైల్డ్ లైన్ను ఎప్పుడు దారిలో పెడతారన్నది ప్రశ్న? వ్యాసకర్త అచ్యుతరావు గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ఫోన్ నెంబర్: 93910 24242 -
బస్సు ఘటనపై సుమోటో కేసు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై బాలల హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. బస్సు ఘటనను సుమోటో గా స్వీకరించింది. సంఘటనపై పూర్తి విచారణ జరిపించి ఈనెల 19 లోగా నివేదిక సమర్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ కు బాలల హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మడకశిర-పెనుగొండ మార్గంలో బుధవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 16 మంది మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. బస్సు మడకశిర నుంచి పెనగొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారు. -
యువతులకు 500 టెక్నిక్స్
దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున కీచకుల అరాచకత్వానికి బలైన నిర్భయ త్యాగం వృధా కాలేదు. ఈ దారుణ ఘటనతో ప్రభుత్వంలోనూ, ప్రజలలోనూ, ముఖ్యంగా యువతలో స్పందన వచ్చింది. అవగాహన పెరిగింది. ఇంకా అవగాహన కలిగించవలసి ఉంది. సమాజంలో గౌరవంగా బతకాల్సిన స్త్రీని సాటి మనిషిగా చూడకపోగా అడ్డొస్తే హతమార్చడం అలవాటై పోయింది. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ అభయ లాంటి కేసులు నిత్యకృత్యంగా మారాయి. ఇంటా, బయటా ముప్పేట దాడికి గురవుతున్న మహిళ మనగడ సాగించాలంటే ఆత్మరక్ష తప్ప మరోమార్గం లేదని బాలల హక్కుల సంఘం చెబుతోంది. రోడ్సైడ్ రోమియోల వేధింపులు భరించలేకపోతున్నారా? ఆటపట్టించేవారి ఆటకట్టించాలనుందా? అసభ్యంగా ప్రవర్తించేవారి పనిపట్టాలనుందా? రోడ్డుపై ఏ దొంగో ఎటాక్ చేస్తాడని భయపడుతున్నారా? మీరు భయపడవలసి అవసరంలేదని బాలల హక్కుల సంఘం భరోసా ఇస్తోంది. మహిళలు ఇక తమను తాము రక్షించుకోవటం ఈజీ అని బాలల హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు.అల్లరిచేసేవారిని ఎలా మట్టికరిపించాలి? - చేయిపట్టి లాగేవాడిని ఎలా కుళ్ళబొడవాలి? హ్యాండ్బాగ్ను, మెడలో గొలుసును లాక్కెళ్లే దొంగల దుమ్ము ఎలా దులిపేయాలి? మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలనేదానిపై బాలల హక్కుల సంఘం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు ఏ ఏటికి ఆఏడు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలపై వేధింపులు రాష్ట్రంలో మామూలైపోయాయి. వరకట్నం, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులు, దోపీడి, దొంగతనాలు, కిడ్నాప్లకు మహిళలు నిత్యం గురవుతూనే ఉన్నారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులు సైతం పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీతో కలిసి బాలల హక్కుల సంఘం విద్యార్థినులకు స్వీయరక్షణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడి సమయంలో అవతలివ్యక్తిని మట్టికరిపించి తమను తాము కాపాడుకోడానికి 500 టెక్నిక్స్ను ప్రదర్శించారు. చిన్న వస్తువులతో ఎలా కాపాడు కోవాలో డ్రిల్ నిర్వహించి చూపించారు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమితో కలిసి స్కూళ్లూ, కాలనీల్లో స్వీయ రక్షణపై ప్రత్యేక కార్యక్రమాన్ని బాలల హక్కుల సంఘం చేపట్టింది. దాడి సమయంలో అవతలివ్యక్తిని మట్టికరిపించి కాపాడుకోడానికి ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించి 500 టెక్నిక్స్ను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే కరాటే, థైక్వాండో లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చు కోవాడం ద్వారా రక్షణ మాత్రమే కాకుండా పిల్ల శారీరక దారుడ్యం మెరుగుపడి ఆరోగ్యానికి సైతం మేలుచేస్తుందని నిపుణులు అంటున్నారు. బాలికలు, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించి అవగాహణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు, ఇండియన్ మార్షల్ అకాడమి నిర్వాహకుడు నరేందర్ చెప్పారు. మహిళల కోసం బాలల హక్కుల సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement