-
అప్పు ఇచ్చి కోరిక తీర్చమని వేధింపులు
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): అతను ఓ బార్కు యజమాని.. అంతకంటే ముఖ్యంగా ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్కు భర్త.. బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అతగాడు మహిళలపై తనదైన రీతిలో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే మహిళలనే టార్గెట్ చేసుకొని వారి అవసరాలకు ఆదుకుంటున్నట్లుగా నటిస్తూ ఆపై తన కోరిక తీర్చాలంటూ పీక్కుతింటుంటాడు. ఈ క్రమంలో వరుసకు కూతురు అయ్యే ఓ మహిళపై కూడా లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించింది. మేనల్లుడికి డబ్బులిచ్చి.. సేకరించిన వివరాల ప్రకారం సింగ్నగర్ ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నివసిస్తున్న తాళ్లూరి శ్రీనివాసరావు సింగ్నగర్ పైపుల రోడ్డులోని ఓ బార్లో పార్ట్నర్గా ఉంటూ వ్యాపారం చేస్తుంటాడు. అయితే తనకు మేనల్లుడి వరుస అయ్యే వ్యక్తికి గతేడాది రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పటి నుంచి డబ్బుల పేరుతో తరచూ ఇంటికి వెళ్తూ అతని భార్యతో మాట్లాడటం చేస్తుండేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో డబ్బుల కోసం వెళ్లి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలతో విసిగిపోయిన ఆమె భర్తకు చెబితే ఏమవుతుందోననే భయంతో శ్రీనివాసరావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లిపోయి సమాధానం చెప్పేది. అయితే ఇటీవల కాలంలో ఇదే విధంగా స్నానం చేస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన శ్రీని వాసరావు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పడంతో వారి ద్దరు సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై 376, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితుడిని గురువారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. దీనిపై సింగ్నగర్ పోలీసులను వివరణ కోరగా ఈ కేసుపై ఇంకా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
బార్ ఓనర్ అతి తెలివి...
ఓ బార్ ఓనర్ అతి తెలివి ప్రదర్శించాడు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా పాటించాడు. ఓ ఐడియాతో తన వైన్ షాప్ మూత పడకుండా కాపాడుకున్నాడు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులకు 300 మీటర్ల దూరంలోపు వైన్ షాప్లు ఉండాలి అన్న నిబంధను పాటించాడు. కేరళలోని ఎర్నాకులం జాతీయ రహదారి 17కు ఆనుకుని ఐశ్వర్య పేరుతో ఓ బార్ ఉంది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 300 మీటర్లలోపు మద్యం షాపులు ఉండకూడదు. అలా ఉంటే మూతేయాల్సిందే. అదే కష్టం ఐశ్వర్య బార్కు వచ్చింది. దీంతో బార్ మూసేయాల్సిన పరిస్థితి. కానీ ఆబార్ ఓనర్ అతి తెలివి ఉపయోగించి తప్పించుకున్నాడు. జాతీయ రహాదారికి 300మీటర్ల దూరంలో ఉన్న షాప్ మెయిన్గేట్ను మూసివేశాడు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశాడు. దేవస్థానాల్లో దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్ల తరహాలో వెనక్కి ముందుకు సుమారు 300 మీటర్లుకు పైగా క్యూలైన్లు ఏర్పాటు చేశాడు. దీంతో కోర్టు నిబంధనలు ఉల్లంఘించకుండా తన బార్ మూత పడకుండా కాపాడుకున్నాడు.దీనికోసం సుమారు లక్షన్నర రూపాయలను వదిలించుకోవాల్సి వచ్చింది. ఇదే బాటలో నడవటానికి పలు బార్లు, వైన్ షాప్ ఓనర్లు సిద్దమౌతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
ఎండగంట పడకుండా..
తప్పక చదవండి
- ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement