-
నిలకడగా దాల్మియా ఆరోగ్యం
కోల్కతా : బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా గురువారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు కోల్కతాలోని బిర్లా ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 75 ఏళ్ల దాల్మియా ఈ ఏడాది మార్చిలో మూడో సారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచి అనారోగ్యంగానే ఉన్నారు. గత జూన్లోనే ఐపీఎల్ వివాదంపై కమిటీ విచారణకు అనారోగ్యం కారణంగా దాల్మియా సరిగా సహకరించకపోవడంతో అసలు బీసీసీఐని ఎవరు నడిపిస్తున్నారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
భారత్ ‘ఎ’ జట్టు కోచ్గా ద్రవిడ్
అండర్-19 టీమ్కు కూడా... కోల్కతా : మిస్టర్ డిపెండబుల్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను... భారత్ ‘ఎ’ జట్టు కోచ్గా నియమించారు. అండర్-19 జట్టు కోచింగ్ బాధ్యతలు కూడా తనకే అప్పగించారు. శనివారం ఈడెన్గార్డెన్స్లో తొలిసారి సమావేశమైన బీసీసీఐ సలహాదారులు సచిన్, గంగూలీ, లక్మణ్లతో కూడిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే బంగ్లాదేశ్ పర్యటనకు టీమ్ డెరైక్టర్గా కొనసాగుతున్న మాజీ ఆల్రౌండర్ రవిశాస్త్రి భవితవ్యంపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్ ’ఎ’, అండర్-19 జట్లకు కోచ్గా పని చేసేందుకు ద్రవిడ్ అంగీకరించారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సమావేశం అనంతరం వెల్లడించారు. ఇది భారత క్రికెట్కు శుభపరిణామమని వ్యాఖ్యానించారు. భారత్ తరఫున 164 టెస్టులు, 344 వన్డేలు ఆడిన ద్రవిడ్ను భారత జాతీయ జట్టుకు కోచ్గా నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ కుటుంబ బాధ్యతల వల్ల ఆ పదవిని చేపట్టేందుకు ఈ కర్ణాటక ఆటగాడు విముఖత చూపడంతో భవిష్యత్ కుర్రాళ్లను తీర్చిదిద్దే బాధ్యతలను అప్పగించారు. భారత్ ‘ఎ’ జట్టుతో పాటు ద్రవిడ్ కూడా విదేశీ టూర్లకు వెళ్తాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ‘ఎ’ జట్టుకు విదేశీ టూర్లు సలహా కమిటీ తొలి సమావేశం గురించి ఠాకూర్ మాట్లాడుతూ... ‘భారత్ ‘ఎ’ జట్టుకు ఎక్కువగా విదేశీ పర్యటనలు ఉండాలని సూచించారు. ఏ జట్టుకు అవసరమైనా సేవలందించేందుకు ముగ్గురు సంసిద్ధత వ్యక్తం చేశారు. 15 మంది ఫాస్ట్ బౌలర్లు, 15 మంది స్పిన్నర్లతో పూల్ను ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకమైన కోచ్లను నియమించాలని ముఖ్య ప్రతిపాదన చేశారు. అలాగే భారత క్రికెటర్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సమయం కేటాయిస్తామన్నారు’ అని కార్యదర్శి వెల్లడించారు. కమిటీ సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు లేవని కేవలం గౌరవ వేతనం మాత్రమే ఉంటుందని ఠాకూర్ స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement