-
కరీంనగర్లో ఆపరేషన్ బంటి సక్సెస్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మానుకొండూరులో అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ బంటి సక్సెస్ అయ్యింది. మత్తు మందు ఇచ్చి ఎలుగును బంధించిన అధికారులు చికిత్స కోసం వరంగల్కు తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం మానకొండూరు హనుమాన్ టెంపుల్ వద్ద ఎలుగుబంటి ఓ ఇంట్లోకి చొరబడింది. అనంతరం, వీధి కుక్కలు ఎలుగుబంటిని తరమడంతో అది పరుగులు తీసి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో గ్రామస్తులు.. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఎలుగును బంధించే ప్రయత్నం చేశారు. అయితే అది చిక్కకుండా తప్పించుకుంది. మానకొండూరు చెరువువైపు ఉన్న పొదల్లోకి ఎలుగు పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ జరిపి.. మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు దానిని బంధించారు. -
తిరుమల మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి మెట్ల నడకదారిలో ఎలుగుబండి సంచరించింది. 2వేల మెట్టదగ్గర సోమవారం ఉదయం భక్తులకు ఎలుగుబండి కనిపించింది. కాగా, ఎలుగు బండి సంచారంతో భక్తులు భయాందోళను గురవుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఇటీవల ఓ బాలిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అనంతరం, చిరుతను అధికారులు జూకు తరలించారు. ఇది కూడా చదవండి: చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు -
బాబోయ్.. భల్లూకం
సాక్షి, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి – కంచ నపల్లి రోడ్డుపై ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్ర వారం దొడ్డిగుట్ట వద్ద రహదారిపైకి ఒక్కసారిగా ఎలుగుబంటి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని కోరుతున్నారు. -
అదిగో పులి..ఇదిగో లెక్క
సాక్షి, ఆదిలాబాద్/మంచిర్యాల: ఒకప్పుడు అడపాదడపా కనిపించిన పులి.. ఇప్పుడు రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే పులి దాడిలో ఇద్దరు హతమైపోగా, రోజుకో చోట పులి సంచారం బయటపడుతోంది. తాజాగా బెజ్జూర్, వేల్పులగుట్టలో గుర్తించిన పులిపాదముద్రలు.. పెరిగిన పులుల సంచారానికి అద్దం పడుతున్నాయి. దీంతో అటవీ సమీప గ్రామాల్లో ‘అదిగో పులి అంటే.. ఇట్టే ఉలిక్కిపడే పరిస్థితులు నెలకొన్నాయి. పులుల జాడ, కదలికలను అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులుల జాడ కనిపెట్టేది ఎలా..? రోజుకు వందల కిలోమీటర్ల మేర సంచరించే పులుల అడుగులే వాటి ఆవాస పరిధి, సంఖ్య అంచనాకు ఉపయోగపడతాయి. ఇటీవల పులుల దాడులు, సంచారం పెరగడంతో వాటి కదలికలపై అప్రమత్తంగా ఉంటున్న అధికారులు.. పులుల జాడను ఎప్పటికప్పుడు కనుగొంటూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్క ల గ్రామస్తులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. పాదముద్రలే కీలకం పాదముద్రల పరిమాణం, ఆకారాన్ని బట్టి వయసు, ఆడ, మగపులా అనేది నిర్ధారిస్తారు. ఆడపులి అడుగు త్రికోణంలా, మగపులిది చతురస్రాకారంలో ఉంటుంది. పొడినేలపై కంటే తడి, ఇసుక నేలపై పాదముద్రల గుర్తింపు సులువు. పాదముద్ర చుట్టూ నలువైపులా గీతలు గీసి వాటి కొలతలు తీసుకుని అంచనా వేస్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు సంచరించే ప్రాంతాలను యానిమల్ ట్రాకర్లు, వాచర్లు, స్థానికులిచ్చిన సమాచారంతో గుర్తిస్తున్నారు. విసర్జితాలు, చెట్లపై గీతలు కొత్తగా అడవిలోకి వచ్చిన పులి సరిహద్దులను ఏర్పర్చుకునే క్రమంలో తన పరిధిలో అక్కడక్కడా మూత్రాన్ని వదులుతుంది. ఆ వాసనను బట్టే ఇక్కడ పులి ఉందని మరో పులి తెలుసుకుంటుంది. ఆడపులి తిరిగే పరి«ధి 20 – 30, మగపులి పరిధి 50–80 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అవి వదిలే విసర్జితాలు, తన ఆవాస పరిధిలో చెట్లపై గీసిన పంజా గీతలు, రాలిన వెంట్రుకలు పులులపై అంచనాకు ఉపకరిస్తాయి. (చదవండి: జస్ట్ మిస్.. పులికి బలయ్యేవారు..!) సీసీ కెమెరాలతో కచ్చితత్వం నైట్విజన్ కలిగిన సీసీ కెమెరాలతో పులుల కదలికలను అటవీ అధికారులు రికార్డు చేస్తున్నారు. అడవుల్లోని నీటి కుంటలు, శాకాహార జంతువులుండే ప్రాంతాలు, పులి రాకపోకలు సాగించే చోట్ల సీసీ కెమెరాలు బిగించి జాడ కనుగొంటారు. వీటి ఆధారంగానే ఆడ, మగ, చిన్న, పెద్ద, గర్భంతో ఉందా అనేది తెలుసుకుంటారు. పులి పంజాకు ఇద్దరు బలైపోయిన నేపథ్యంలో టైగర్ కారిడార్లో కెమెరా ట్రాప్ల బిగింపు ప్రక్రియ ముమ్మరమైంది. వేల్పులగుట్టలో పులి పాదముద్రలు పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం–రెడ్డిగూడెం గ్రామాల మధ్య వేల్పులగుట్ట వద్ద మిర్చి తోటలో బుధవారం పెద్దపులి పాదముద్రలను రైతులు, అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నెల 5న అశ్వాపురం పరిధి కనకరాజుగుట్టపై పులి ఆవును చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడ్రోజులకు కిన్నెరసాని వాగు నుంచి పాండురంగాపురం అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు అడుగుల ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. అవి పెద్దపులి అడుగులేనని పాల్వంచ ఎఫ్డీఓ తిర్మల్రావు, రేంజర్ అనిల్కుమార్ నిర్ధారించారు. టేకుల చెరువు వద్ద కూడా పులి పాదముద్రలు కనిపించాయని, రైతులు, గిరిజనులు అడవి వైపు వెళ్లొద్దని సూచించారు. రోజుకు వందల కిలోమీటర్ల మేర సంచరించే పులుల అడుగులే వాటి ఆవాస పరిధి, సంఖ్య అంచనాకు ఉపయోగపడతాయి. ఇటీవల పులుల దాడులు, సంచారం పెరగడంతో వాటి కదలికలపై అప్రమత్తంగా ఉంటున్న అధికారులు.. పులుల జాడను ఎప్పటికప్పుడు కనుగొంటూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్క ల గ్రామస్తులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. వాచర్లతో ట్రాక్ చేస్తున్నాం పులుల కదలికలను వాచర్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దాడులు జరిగిన ప్రాంతాల్లో గుర్తించిన పాదముద్రల ఆధారంగా ఏ పులి అనేది అంచనా వేస్తున్నాం. అడవిలో ఏర్పాటుచేసిన వందకుపైగా సీసీ కెమెరాలతో వాటి సంచారాన్ని పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉంటున్నాం. – శాంతారాం, జిల్లా అటవీ అధికారి,ఆసిఫాబాద్ అమ్మో.. ఎలుగుబంటి మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాళ్లపూసపల్లి రోడ్డులో బుధవారం ఎలుగుబంటి కనిపించిందనే సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే జిల్లాలో పెద్దపులి సంచారంతో భయపడుతున్న ప్రజలు ఎలుగుబంటి వచి్చందని తెలియడంతో ఉరుకులు, పరుగులు తీశారు. తాళ్లపూసపల్లి రోడ్డులో నరేశ్ అనే వ్యక్తి ఎలుగుబంటి కనిపించిందని స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మహబూబాబాద్ రూరల్ ఎస్సై సీహెచ్ రమేశ్బాబు, వార్డు కౌన్సిలర్ మార్నేని వెంకన్నతో పాటు పలువురు కర్రలు పట్టుకుని సమీప ప్రాంతాల్లో రెండు గంటల పాటు గాలించినా ఆచూకీ దొరకలేదు. -
ఉట్నూరు లో ఎలుగుబంటి సంచారం
గాంధారి: నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం ఉట్నూర్లో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గురువారం గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లిన ఉపాధి కూలీల వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. వారం రోజులుగా ఏదో ఒక చోట ఎలుగు బంటి కనిపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, అడవి జంతువులు నీటి కోసం అన్వేషిస్తూ జనావాసాల సమీపంలోకి ప్రవేశిస్తున్నాయని, ఎలుగుబంటిని తిరిగి అడవిలోకి పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
Advertisement