-
ప్రభుత్వం మాది.. మా మాటే వినవా?
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరి శీలనలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని చెప్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై ప్రైవేట్ బీఈడీ కళా శాలల యాజమాన్యాల సభ్యులు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం వర్సిటీలో స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల మేరకు అధ్యాపకుల ధ్రువపత్రాలను తమ వద్ద నెల రోజుల పాటు డిపాజిట్ చేసుకుంటామని కమిటీ తెలిపింది. దీంతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం నాయకుడు, కర్నూలు ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్యగౌడ్ వెరిఫికేషన్ను అడ్డుకుని.. అధ్యాపకులందరినీ బయటికి పంపించేశారు. ఆయనతో పాటు అనంతపురం ఎస్కే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్పచౌదరి, మరికొందరు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఫూటుగా మద్యం సేవించి సాయంత్రం రిజిస్ట్రార్ ఛాంబర్కు వచ్చి నానా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం..నిన్ను బతకన్విం’’.. అంటూ రిజిస్ట్రార్ను నానా దుర్భాషలాడారు. రత్నప్పచౌదరి చెప్పు తీసి దాడి చేయడానికి యత్నించగా అక్కడున్న ఉద్యోగులు అడ్డుకుని వారించారు. వర్సిటీలోని ఉద్యోగులంతా వచ్చి రిజిస్ట్రార్కు అండగా నిలవడంతో వారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ విషయమై కర్నూలు తాలూకా ఎస్ఐ భాస్కరరాజును సాక్షి వివరణ కోరగా.. గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని..యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కాగా రిజిస్ట్రార్, ప్రొఫెసర్ అమర్నాథ్పై దాడిని నిరసిస్తూ ఆర్యూ విద్యార్థి జేఏసీ బుధవారం వర్సిటీ బంద్కు పిలుపునిచ్చింది. -
‘డి’ ర్యాంకు వస్తే మూసివేతే!
ఉపాధ్యాయ విద్య కాలేజీలకు ఎన్సీటీఈ ర్యాంకింగ్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఉపా ధ్యాయ విద్యా కాలేజీలకు ర్యాంకులు ఇవ్వా లని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిర్ణయించింది. ముఖ్యంగా బీఎడ్ కాలేజీలతో ముందుగా ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలపై సోమవారం ముంబై లో రెండో జాతీయ సమావేశం జరిగింది. ఇందులో కొత్తగా ర్యాంకింగ్, అక్రెడిటేషన్ ఫ్రేమ్వర్క్ను అమల్లోకి తేవాలని నిర్ణయిం చింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లోని సదుపా యాలు, విద్యా ప్రమాణాలను బట్టి ఈ ర్యాకింగ్లు ఇస్తారు. ఇందుకోసం అన్ని ఉపా ధ్యాయ విద్యా కాలేజీలు తమ వార్షిక పని తీరు డాటాను అందజేయాలని స్పష్టం చేసిం ది. వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు కేటగిరీల్లో: ప్రతి విద్యాసంస్థకు 4 కేటగిరీల్లోని అంశాలను 100 పాయింట్లుగా పరిగణనలోకి తీసుకొని ఎ,బి,సి,డిలుగా ర్యాంకింగ్ ఇస్తారు. అందులో ఫిజికల్ అసెట్స్ కు గరిష్టంగా 10పాయింట్లు, అకడమిక్ అ సెట్స్కు 20 పాయింట్లు, అధ్యాపకులు, అభ్యాసనా నైపుణ్యాలకు 30, 40 పాయింట్లు అభ్యాసన ఫలితాలకు లెక్కించి ర్యాంకులి స్తారు. సి ర్యాంకు వస్తే తమ ప్రమాణాలను 12 నెలల్లో పెంచుకునే సమయం ఇస్తారు. డి–ర్యాంకు వచ్చిన విద్యా సంస్థలను వెంటనే మూసివేయాల్సి ఉంటుంది. -
రెండేళ్ల కోర్సుతో కళాశాలలు మూతపడుతున్నాయి
► వర్సిటీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి సమస్య తీసుకువెళ్లాలి ► ఇన్చార్జి వీసీకి బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్ల వినతి ఎచ్చెర్ల క్యాంపస్ : జిల్లాలోని 17 బీఈడీ కళాశాలల ప్రధానాచార్యులు, కార్యదర్శులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిపాలన కార్యాలయంలో ఇన్చార్జి వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్యతో బుధవారం భేటీ అయ్యారు. ఈ మేరకు తమ సమస్యలు వివరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో బీఈడీ కళాశాలలు మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీఈడీ కళాశాలల పరిస్థితిపై సమీక్షించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి ( ఎస్సీ టీఈ) సంస్థ 2015-16 విద్యా సంవత్సం నుంచి రెండేళ్లు బీఈడీ కోర్సు పరిమితిగా మార్పు చేసిందని, ఏడాది నుంచి రెండేళ్లు కోర్సు చేయటం వల్ల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. 90 శాతం ప్రవేశాలు జరిగే బీఈడీలో ప్రస్తుతం 20 శాతం జరుగుతున్నాయని, మరో పక్క కన్వీనర్ కోటాల్లో సీట్లుకే ప్రవేశాలు పరిమితం అవుతున్నాయని, మేనేజ్మెంట్ కోటాలో కనీసం ప్రవేశాలు జరగటం లేదని వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తే ప్రవేశాలు 10 శాతం సైతం జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి, నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు కళాశాలలు నిర్వహిస్తే నష్టాల్లో కళాశాలల నిర్వహణ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేవారు. వర్సిటీ ద్వారా ఉన్నత విద్యా మండలికి సమస్యలు తెలియజేయాలని, ఉన్నత విద్యా మండలి బీఈడీ కళాశాలల పరిస్థితి జాతీయ ఉపాధ్యాయ మండలి దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. సమస్యలు వివరించిన వారిలో బీఆర్ఏయూ పాలక మండలి సభ్యులు బరాటం లక్షణరావు, ప్రిన్సిపాళ్లు అంబటి రంగారావు, బమ్మిడి సన్యాసిరావు, నర్సింహమూర్తి ఉన్నారు. -
బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా ఆర్జేడీ బాలయ్య
విద్యారణ్యపురి: హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ డైరెక్టర్ జి.కిషన్ గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సహదేవుడు తమపై అనుచి తంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ పలుమార్లు కళాశాల విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలు చేసిన విషయం విధితమే. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా, ఫిర్యాదు కూడా చేశారు. మంత్రి కడియం శ్రీహరి దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డి ఇటీవల కళాశాల సందర్శించి విచారణ జరిపారు. నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు అందజేశారు. ఈమేరకు ఆయ న స్థానంలో ఇన్చార్జిగా ఆర్జేడీ బాలయ్యను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సహదేవుడు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. -
ప్రశాంతంగా కానిస్టేబుల్ రాతపరీక్ష
► కమిషనరేట్ పరిధిలో 58, ► రూరల్లో 51 కేంద్రాలు ► హాజరైన 61,039 మంది అభ్యర్థులు వరంగల్ క్రైం : పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం నిర్వహించగా ప్రశాం తంగా కొనసాగింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 58 కేంద్రాలు ఏర్పాటుచేయగా, 37,704 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 35,337 మంది హాజరయ్యూరని కమిషనర్ సుధీర్బాబు తెలిపారు. అలాగే, రూరల్ పరిధిలోని జనగామ, న ర్సంపేటల్లో 51 సెంటర్లలో నిర్వహించిన రాత పరీక్షకు 27,341మందికి గాను 25,702 మంది హాజరయ్యూరని రూరల్ ఎస్పీ అంబ ర్కిషోర్ ఝా తెలిపారు. గంటరన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంత రం లోపలకు అనుమతించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీ సు నియామక పరీక్షలు కావడంతో పరీక్ష గదుల్లో అభ్యర్థుల ఫొటో తీయడంతో పాటు బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రల సేకరించారు. అలాగే, హాల్టికెట్లను స్కాన్ చేశారు. ఇంకా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేయ గా, బస్స్టేషన్, రైల్వేస్టేషన్ల నుంచి మినీ బ స్సుల ద్వారా వారిని కేంద్రాలకు తరలించా రు. కాగా, కమిషనరేట్ పరిధిలోని పలు కేం ద్రాలను సీపీ సుధీర్బాబుతో పాటు అదనపు డీసీపీ యాదయ్య, ఏసీపీలు సురేంద్రనాథ్, మహేందర్, జనార్దన్, వెంకటేశ్వర్రా వు, రవీందర్రావు, ఈశ్వర్రావు పర్యవేక్షిం చారు. అలాగే, రూరల్ పరిధిలోని కేంద్రాల ను ఎస్పీ అంబర్ కిషోర్ఝా పరిశీలించారు. పలు కళాశాలల్లో... కరీమాబాద్ / మామునూరు : వరంగల్ అం డర్ రైల్వేగేట్ తాళ్ల పద్మావతి ఫార్మసీ, బీఈ డీ కళాశాల, ఉర్సుగుట్ట వద్ద ఉన్న జేఎస్ఎం హైస్కూల్తో పాటు మామునూరు పోలీసుస్టేషన్ పరిధిలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో కానిస్టేబుల్ ప్రిలి మినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కాగా, పరీక్షా కేంద్రాలను వరంగల్ సీపీ సుధీర్బాబు, ఏసీపీలు సురేంద్రనాథ్, మహేంద ర్, సీఐలు వేణు, శ్రీనివాస్, సంతోష్, ఎస్సై లు రాంప్రసాద్, యుగేందర్, ఎస్సై వెంకట్రావు. ట్రెరుునీ ఎస్సై రాణాప్రతాప్, పీసీలు కటకం శ్రీను, స్వామి పరిశీలించారు. హసన్పర్తి, కేయూ పరిధిలో.. భీమారం : కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీ క్ష సందర్భంగా హసన్పర్తి, కాకతీయ యూ నివర్సిటీ పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీ సులు పలు ఏర్పాట్లు చేశారు. పీఎస్లు, బస్టాండ్ల వద్ద సహాయక వాహనాలు ఏర్పాటుచేయడంతో పాటు అభ్యర్థుల కోసం హెల్త్డెస్క్లు ఏర్పాటుచేశారు. సీఐలు ఎస్.ఎం.అలీ, రవికుమార్ పాల్గొన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement