-
క్షుద్రపూజల కలకలం
-
భూత వైద్యుడి అరెస్ట్
గుంటూరు,అవనిగడ్డ : దెయ్యం వదిలిస్తానని చెప్పి ఊపిరాడకుండా చేసి ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వి.పోతురాజు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో డీఎస్పీ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని తుంగలవారిపాలేనికి చెందిన తుంగల వెంకట సీతారామాంజనేయులు (38) స్నేహితుడు జూన్ 16వ తేదీ చెట్టుమీద నుంచి పడి మరణించాడు. అప్పటి నుంచి సీతారామాంజనేయులు పిచ్చిíపిచ్చిగా ప్రవర్తించసాగాడు. గాలి సోకిందనే అనుమానంతో కుటుంబ సభ్యులు తొలుత కోడూరు మండలం గుడుమోటులో ఇమామ్ దగ్గరకు తీసుకెళ్లాడు. అయినా మార్పు రాకపోవడంతో అవనిగడ్డలో ఇమామ్ ఉంటాడని, అతనైతే ఎలాంటి భూతాన్నయినా వదిలిస్తాడని చెప్పడంతో సీతారామాంజనేయులు తండ్రి తుంగల ప్రసాదరావు మహమ్మద్ నియాజ్ అహ్మద్ వద్దకు వెళ్లారు. దెయ్యం వదిలించడానికి రూ.8 వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఈ మేరకు రూ.5 వేలు అడ్వాన్స్ చెల్లించడంతో ఈ నెల 27వ తేదీ నియాజ్ అహ్మద్ తుంగలవారిపాలెం వచ్చాడు. ప్రసాదరావు ఇంటి ముందు వరండాలో సీతారామాంజనేయులును కూర్చోబెట్టి బక్కెట్లలో నీళ్లు, మగ్, తెల్లటి టవల్ తీసుకురమ్మని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం ముక్కు, నోరు కనబడకుండా తెల్లటి టవల్ను ఎడం చేత్తో ముఖానికి గట్టిగా కప్పేసి, కుడిచేత్తో మగ్గుతో నీళ్లు ముంచి ముఖానికి కొట్టసాగాడు. సీతారామాంజనేయులు విదిలించుకునే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఊపిరాడటం లేదని ఈ చర్యను వారించే ప్రయత్నం చేశారు. ఇలా అయితేనే దెయ్యం వదులుతుందని చెప్పిన నియాజ్ అహ్మద్ అదేపనిగా ముఖంపై నీళ్లు కొట్టడంతో చివరకు ఊపిరాడక సీతారామాంజనేయులు చనిపోయాడు. ఈ మేరకు మృతుని తండ్రి ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ వి.పోతురాజు ఆధ్వర్యంలో సీఐ ఎస్వీవీఎస్ మూర్తి నేతృత్వంలో ఎస్ఐ మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మంగళవారం స్థానిక కోడూరు ఆటో స్టాండ్ వద్ద మహమ్మద్ నియాజ్ అహ్మద్ను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. -
భారతదేశాన్ని మంత్రగాళ్లు పాలిస్తున్నారుః మోడీ
గత పదేళ్ల యూపీఏ పాలన మంత్రగాళ్ల పాలన అనిబీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పరోక్షంగా యూపీఏను, దాని అధినేత సోనియాగాంధీని విమర్శించారు. భారతీయ జనతాపార్టీ ఓ మాంత్రికుడిని తెచ్చిందని, ఆయన రాత్రికి రాత్రే అంతా మార్చేస్తానంటున్నాడని తనను ఉద్దేశించి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన జంషెడ్పూర్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రస్తావించారు. యూపీఏ పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోందని, తత్ఫలితంగా ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయని, రైతుల కష్టాలు పెరిగాయని, సైనికుల తలలు తెగిపోతున్నాయని అన్నారు. ఈ మంత్రగాళ్ల పాలన వల్ల దేశం గత పదేళ్లుగా తీవ్ర దుస్థితిలో ఉందని, తనను తాను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలను కష్టాల్లో పడేసిందని మోడీ మండిపడ్డారు. తాను చాలా పేద కుటుంబంలో పుట్టానని, అందువల్ల పేదల కష్టాలు తనకు తెలుసని, అదే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాళ్లకు పేదల కష్టాలు ఏం తెలుస్తాయని పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement