-
నిరసనలపై నిషేధం తగదు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్, బోట్క్లబ్ వంటి ప్రాంతాల్లో నిరసనలు, బైఠాయింపులపై పూర్తి నిషేధం విధించటం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు బదులు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా నిరసనలు తెలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జంతర్మంతర్, ఇండియా గేట్ దగ్గరి బోట్ క్లబ్ వద్ద వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళనలు చేపట్టరాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన నిషేధానికి వ్యతిరేకంగా మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ తదితర స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల సమస్య, హింసాయుత పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే విధించే 144వ సెక్షన్ వంటి ఆజ్ఞల్ని అధికారులు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీ తరఫు లాయర్ వాదిస్తూ..‘జంతర్మంతర్ రోడ్డులో వివిధ సంఘాలు, సంస్థలు, పార్టీలు చేపట్టే ఆందోళనల కారణంగా ప్రజా జీవనానికి ఆటంకం కలగటంతోపాటు, శబ్దకాలుష్యం, తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పూర్తిస్థాయి నిషేధం తగదని, ప్రజల నిరసన హక్కుకు భంగం కలగకుండా మార్గదర్శకాలు రూపొం దించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. -
బొమ్మల మాటున బొక్కే ఎత్తు..!
సాక్షి, కాకినాడ :హైదరాబాద్లోని టాంక్ బండ్ తరహాలో కాకినాడ బోట్క్లబ్ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రిలయన్స్ సంస్థ సమకూర్చిన రూ.60 లక్షలతో ఆధునికీకరించారు. క్లబ్ చుట్టూ కర్బ్వాల్ నిర్మించి గ్రావెల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. లోపల ఫౌంటెన్లు, ఆధునిక ఎలక్ట్రిక్ స్తంభాలు, లైట్లు, బాలల కోసం వివిధ రకాల ఆట పరికరాలు సమకూర్చారు. వాకర్స్కు అవసరమైన మరుగుదొడ్లు నిర్మించారు. పలురకాల మొక్కలు నాటారు. గ్రానైట్ రాతితో మలచిన ఆదికవి నన్నయ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బోయి భీమన్న వంటి కవుల, రఘుపతి వెంకటరత్నంనాయుడు, కందుకూరి వీరేశలింగం వంటి సంస్కర్తల విగ్రహాలను పెడెస్టళ్లపై ప్రతిష్టించారు. ఆధునికీకరించిన బోట్క్లబ్ను గత నవంబర్ 15న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ల సమక్షంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎంపళ్లంరాజు ప్రారంభించారు. విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. నాటి సభలో రిలయన్స్ సమకూర్చిన రూ.60 లక్షలతో బోట్క్లబ్ను ఆధునికీరించామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇప్పటికైనా పట్టించుకోండి ప్రత్యేకాధికారి గారూ.. కాగా ‘నగర పాలక సంస్థ కమిషనర్ అనుమతితో’ అంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల ఒకటిన రూ.18.03 లక్షలు వ్యయమయ్యే 19 పనులకు స్వల్పకాలిక టెండర్ నోటీసు జారీ చేశారు. ఆ పనుల్లో ఇప్పటికే క్లబ్లో ఉన్న కవులు, సంఘసంస్కర్తల విగ్రహాల ఏర్పా టు, వాటికి పెడెస్టళ్ల నిర్మాణం, గ్రానైట్ రాయి బిగింపు, కొత్త లైట్ల ఏర్పాటు వంటి రూ.9.76 లక్షల విలువైన పది పనులుండడం గమనార్హం. టెండర్ల దాఖలుకు ఈ నెల 9 వరకు గడువని, 10న సాయంత్రం టెండర్లు తె రుస్తామని జారీ అయిన నోటీసులో స్థానికేతరులెవరూ దాఖ లు చేయడానికి వీల్లేని రీతిలో బాక్సు టెండర్గా పిలి చారు. సాధారణంగా లక్షలోపు పనులను నామినేషన్ పద్ధతిలో ఇవ్వొచ్చు. ఇప్పటికే రూ.2.97 కోట్లతో 297 పనులను అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన అధికారులు ఇప్పుడు అంతా అయిపోయి వినియోగంలోకి వచ్చాక విగ్రహాలు, వాటికి పెడెస్టళ్లు, గ్రానైట్ బిగిం పు పేరుతో టెండర్లు పిలవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. పైగా రిలయన్స్ నిధులతో జరిగిన ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలవడాన్ని బట్టి రూ.9.76 లక్షల కార్పొరేషన్ నిధులను దొడ్డిదారిన పంచుకుకోనున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ క్లబ్ ఆధునికీకరణ పనుల్లో ఇవన్నీ లేవనుకుంటే అప్పుడు ఏ నిధులతో వాటిని చేయించారు, ఆ పనులకు ఇప్పుడెం దుకు టెండర్లు పిలవాల్సి వచ్చింది, ఎవరి ప్రయోజనం ఆశించి ఇలాంటి దొడ్డిదారి పద్ధతులకు తెర తీస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే టెండర్లోని మిగిలిన 9 పనులు కూడా ఈ బాపతుగా పూర్తయినవే కావచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ జోక్యం చేసుకొని కార్పొరేషన్ అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'లవ్ టుడే' హీరో కొత్త సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
No Headline
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
జగన్తోనే పారదర్శక పాలన
సమరోత్సాహంలో యువత
గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
జనం చిత్రవధ
బాబుది ముమ్మాటికీ నిరాదరణే..
సంక్షేమంలో ఛాలెంజ్
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement