-
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
‘నేను మలాలా కాదు.. భారతదేశంలో సురక్షితంగా ఉన్నా’
లండన్: ప్రపంచవేదికపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ప్రచారాన్ని కశ్మీర్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్ పార్లమెంట్లో ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమంలో యానా మీర్ ప్రసంగించారు. భారత్లో అంతర్భాగం అయిన కశ్మీర్లో తనకు భద్రత, స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ విషయంలో పాకిస్తాన్ భారత్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘నేను మలాలా యూసఫ్జాయ్ని కాదు. ఎందుకంటే నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నా. భారతదేశంలో అంతర్భాంగా ఉన్న నా మాతృభూమి కశ్మీర్లో ఉన్నా. నేను ఎప్పుడూ అక్కడి నా దేశం నుంచి శరణార్థిలా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను మలాలా యూసఫ్జాయ్ని అస్సలు కాను. నా దేశాన్ని, నా మాతృభూమి (కశ్మీర్)ను అణచివేయబడిన ప్రాంతమని వ్యాఖ్యానించిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నా. సోషల్ మీడియా, ప్రపంచ మీడియాలో ఉన్న టూల్కిట్ సభ్యులు నా దేశంలోని కశ్మీర్ను సందర్శించకుండా అణచివేత పేరుతో వండివార్చిన తప్పుడు కథనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని అన్నారు. I am not a Malala I am free and safe in my homeland #Kashmir, which is part of India I will never need to runaway from my homeland and seek refuge in your country: Yana Mir @MirYanaSY in UK Parliament. #SankalpDiwas pic.twitter.com/3C5k2uAzBZ — Sajid Yousuf Shah (@TheSkandar) February 22, 2024 ‘భారతీయులను మతం ప్రాతిపాదికన చూడటం ఆపేయండి. ఆ ప్రాతిపాదికతో మా దేశాన్ని ముక్కలు చేయటాన్ని మేము అనుమతించం. ఈ ఏడాది ‘సంకల్ప్ దివాస్’ యూకే, పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేకులు.. ప్రపంచ మీడియా, ప్రపంచ మానవ హక్కుల వేదికలపై భారత్పై దుష్ప్రచారాన్ని ఆపేయాలని ఆశిస్తున్నా. ఉగ్రవాదం మూలంగా వేలాది కశ్మీరీ తల్లులు తమ పిల్లలను పొగొట్టుకున్నారు. నా కశ్మీరీ సమాజం ఇక నుంచి ప్రశాంతగా జీవించాలనుకుంటుంది. కృతజ్ఞతలు.. జైహింద్.. ’ అని యానా మీర్ తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్లోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వార్తలను ప్రచురించవద్దని ఆమె అంతర్జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో వైవిధ్యాన్ని పెంపొందించడంలో ఆమె చేసిన కృషికి ‘డైవర్సిటీ అంబాసిడర్ అవార్డు’తో ఆమెను సత్కరించారు. ప్రతికూల మీడియా కథనాలను ప్రతిఘటిస్తూ డి రాడికలైజేషన్, యువత అభివృద్ధిలో భారత సైన్యం తీసుకుంటున్న చొరవలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారింది. -
బ్రిటన్ పార్లమెంటేరియన్లకు ‘స్ప్రెడింగ్ జాయ్’
లండన్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయ్ అలుక్కాస్ తన స్వీయ జీవిత చరిత్ర ‘స్ప్రెడింగ్ జాయ్’ను బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులకు అందజేశారు. బ్రిటిష్ సౌత్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ కామర్స్ (బీఎస్ఐసీసీ) లండన్లోని గ్రిమాండ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మారి్టన్ డే, వీరేంద్ర శర్మ, స్టీఫెన్ టిమ్స్ సహా బరోనెస్ ఉడ్డీన్లకు తన ఆత్మకథను బహూకరించారు. బ్రిటిష్ పార్లమెంటేరియన్స్కు నా కథను తెలియజేయటం ఎంతో సంతోషాన్ని ఇచి్చందని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోయ్ అలుక్కాస్ ఈ సందర్భంగా అన్నారు. కాగా ఇటీవల తన ఆత్మ కథను భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా జోయ్ అలుక్కాస్ అందజేశారు. -
గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారం
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంట్ తనను సత్కరించినందుకు గాను ఓ బెంగాలీగా చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. ఈ సన్మానం కోసం యూకే ప్రతినిధులు ఆరు నెలల కిందటే తనను సంప్రదించారని వివరించాడు. బ్రిటన్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని పేర్కొన్నాడు. London, UK | I was felicitated by the British Parliament as a Bengali so it was a nice feeling. It was in the Parliament. They had contacted me six months ago. They do this award every year and I got it: BCCI President Sourav Ganguly pic.twitter.com/Q8k3PdiO2k — ANI (@ANI) July 13, 2022 కాగా, జులై 13 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్పై సంచలన విజయం నమోదు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గంగూలీ సేన ఆ చిరస్మరణీయ విజయం సాధించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జులై 13, 2022న బ్రిటన్ పార్లమెంట్ గంగూలీని గౌరవించింది. ఆ మ్యాచ్లో నాటి యువ భారత జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 3 బంతులుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. యువరాజ్ సింగ్ (69), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్)లు మరపురాని ఇన్నింగ్స్ను ఆడి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ఆ మ్యాచ్లో కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం కెప్టెన్ గంగూలీ షర్ట్ విప్పి ప్రదర్శించిన విజయదరహాసం భారత క్రికెట్ అభిమాని మదిలో చిరకాలం మెదులుతూనే ఉంటుంది. నాడు కెప్టెన్గా గంగూలీ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకుంటూ బ్రిటన్ పార్లమెంట్ నిన్న దాదాను సత్కరించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న టీమిండియా రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఓడినప్పటికీ.. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్లోనూ రోహిత్ సేన 1-0లో ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: Sourav Ganguly: అప్పుడు సచిన్, ద్రవిడ్.. నేను! ఇప్పుడు కోహ్లి వంతు! కానీ.. -
ప్రాతఃస్మరణీయుడు
నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్ పార్లమెంట్కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’. ‘ఒక నల్లజాతీయుడిని ప్రజాప్రతినిధిగా చూసుకోవడానికి బ్రిటిష్ ప్రజలు సిద్ధంగా లేరు.’ ఇది 1886లో నాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ సాలిస్బరీ చేసిన ప్రకటన. ఆ సంవత్సరం బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆసియా వాసిని గురించి కన్జర్వేటివ్ పార్టీ వాడైన సాలిస్బరీ ఈ మాట అన్నాడు. ఆయనే దాదాభాయ్ నౌరోజీ. ఆసియా నుంచి బ్రిటిష్ పార్లమెంట్కు ఎన్నికైన తొలి ఆసియా వాసి ఆయనే. ఆయన భారతీయుడు కావడం ఇంకొక చరిత్రాత్మక సంఘటన. మొత్తం బ్రిటిష్ జాతీయులంతా ఆయనను వ్యతిరేకించలేదు. ఆయనకు మద్దతుగా ఒక అద్భుత వనిత, చరిత్ర మహిళ నిలిచారు. ఆమె ఫ్లారెన్స్ నైటింగేల్. ‘నల్లజాతీయుడు’ అంటూ సాలిస్బరీ అత్యంత సంస్కార హీనంగా మాట్లాడినా అది నౌరోజీ విషయంలో వరమే అయింది. అప్పటికి ఇంకా రవి అస్తమించని సామ్రాజ్యంగానే వెలిగిపోతున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్య పత్రికలలో ప్రముఖ స్థానం సంపాదించింది. దీనితో రాత్రికి రాత్రి నౌరోజీ ఇంగ్లండ్లో ప్రముఖ వ్యక్తి అయిపోయారు. సాక్షాత్తు ఇంగ్లండ్ ప్రధాని ప్రస్తావించిన ఆ నల్లజాతీయుడు ఎవరు? ఆయన దాదా భాయ్ నౌరోజీ (సెప్టెంబర్ 4,1825–జూన్ 30, 1917)! భారతదేశంలో బొంబాయి నగరం నుంచి వచ్చారు. అయినా తెల్లవాళ్లలాగే పాలిపోయినట్టు కనిపించే శరీరం వర్ణంతో ఉండే నౌరోజీని నల్లజాతీయుడు అని ఎందుకంటున్నారు అన్న సందేహం కూడా అప్పుడే వచ్చింది. చర్చ మొదలైంది. నౌరోజీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాతఃస్మరణీయుడు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. మూడు పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలకు అధ్యక్షత వహించిన నాయకుడు. బొంబాయిలోనే గుజరాతీ మాట్లాడే పేద కుటుంబంలో నౌరోజీ పుట్టారు. ఆయన నాలుగో ఏటనే తండ్రి నౌరోజీ పలాన్జీ దోర్దీ కన్నుమూశారు. కుమారుడిని పెంచే బాధ్యత తల్లి మానేక్బాయి మీద పడింది. ఆమె కొడుకును బాగా చదివించింది. ఆయన ఎలిఫెన్స్టోన్ ఇనిస్టిట్యూట్లో చదివారు. తరువాత అక్కడే ఆచార్య పదవిని పొందారు. తన జొరాస్ట్రియన్ మతంలో సంస్కరణల కోసం ఆయన పాటు పడ్డారు. 1855లో వ్యాపారం కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కొద్దికాలం తరువాత తన సొంత జౌళి పరిశ్రమను స్థాపించారు. ఇంగ్లండ్లో భారతీయుడు స్థాపించిన తొలి వాణిజ్య సంస్థ అదే. భారతదేశ దుస్థితికి కారణం– భారతీయ జీవనం గురించి ఆంగ్లేయులకి తెలియకపోవడమేనన్నారాయన. 1833 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ పాలకుల నుంచి 20 ఏళ్ల పాటు భారత్ను లీజ్కు తీసుకున్నారు. 1853లో ఈ లీజ్ను కొనసాగించడానికి ప్రతిపాదన వచ్చింది. దీనిని నౌరోజీ తీవ్రంగా వ్యతిరేకించారు. నౌరోజీ మళ్లీ 1892లో జరిగిన ఎన్నికలలో ఫిన్స్బరీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి ఈ ‘నల్లజాతీయుడు’ విజయం సాధించాడు. తక్కువ ఓట్లతోనే నెగ్గి ఉండవచ్చు. కానీ చరిత్ర సృష్టించాడు. నల్లవాడి గెలుపుని జీర్ణించుకోలేని ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి మళ్లీ ఓట్లు లెక్కించాలని కోరాడు. అదే జరిగింది. మొదట కేవలం మూడు ఓట్లు ఆధిక్యం ఉంది. తిరిగి లెక్కించినప్పుడు ఆ సంఖ్య ఐదుకు చేరింది. అప్పటికి కూడా ఆయనను గేలి చేయడం మానలేదు. దాదాభాయ్ నేరో మెజారిటీ (అత్తెసరు ఓట్లతో గెలిచినవాడు) అని పిలిచేవారు, తెల్లజాతీయులు. కానీ వాటిని పట్టించుకోలేదాయన. ‘మనం ప్రధానంగా యుద్ధం చేయవలసింది పార్లమెంటులోనే’ అనే వారాయన. నిజంగానే ఆ యుద్ధంలో విజయం సాధించారు. అక్కడి సంప్రదాయం ప్రకారం బైబిల్ మీద ప్రమాణం చేసి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ తాను పార్శీ మతస్తుడు కాబట్టి నౌరోజీ అందుకు అంగీకరించలేదు. చిత్రంగా జెండా అవస్తా మీద ప్రమాణం చేయడానికి ఆయనకు అనుమతి లభించింది. ఒక సందర్భంలో నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్ పార్లమెంట్కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’. పార్లమెంటులో ఉన్నది మూడేళ్లే అయినా నిర్మాణాత్మకమైన కృషి చేశారు నౌరోజీ. ఆ సమరానికి అనేక కోణాలు ఉన్నాయి. అందులో రెండు ముఖ్యమైనవి. ఒకటి – భారతదేశంలో ఇంగ్లండ్ చేస్తున్న ఆర్థిక దోపిడీ. రెండు– భారతదేశానికి స్వయం ప్రతిపత్తి. మూడు– మహిళలకు ఓటు హక్కు. భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నేతలంతా విధేయులే. బ్రిటిష్ జాతి భారతదేశం నుంచి వెళ్లిపోవాలని, సంపూర్ణ స్వాతంత్య్రం భారతీయుల పరం కావాలని ఆశించిన వారు కారు. స్వయం ప్రతిపత్తి, డొమీనియన్ స్థాయి కల్పిస్తే అదే చాలునన్న భావమే వారికి ఉంది. అయినా ఇంగ్లండ్ మూలంగా భారతదేశం ఎంత నష్టపోతున్నదో వారి దేశంలోనే, వారి పార్లమెంటు వేదికగానే నినదించదలిచినవారు నౌరోజీ. రాజకీయానికి ఆర్థిక కోణం ఎంత అవసరమో భారతీయులకు చెప్పినవారు నౌరోజీ. అందుకే రాజకీయాలకు నౌరోజీ గణాంకాలు కూడా నేర్పారని అంటూ ఉండేవారు. తన భావాలను, వాస్తవాలను ‘పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకంలో నౌరోజీ అమోఘంగా నమోదు చేశారు. డ్రెయిన్ థియరీ ఆయన మేధో జనితమే. 1886 ప్రాంతంలో భారత జాతీయాదాయం ఎంత? అంటే ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరికానికి భారతదేశం దఖలు పడ్డ దరిమిలా, ఇరవై ఎనిమిదేళ్లకు ఆర్థిక పరిస్థితి గురించి నౌరోజీ సంధించిన ప్రశ్న ఇది. బహుశా బ్రిటిష్ ఇండియాలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ గురించి గణాంకాల ఆధారంగా వెలువడిన తొలి ప్రశ్న ఇదే కావచ్చు. జాతీయాదాయం గురించి అధికారులు చెబుతున్న గణాంకాలను తాను విశ్వసించలేనని కరాఖండీగా చెప్పేశారాయన. ‘ది ఇండియన్ ఎకనమిస్ట్’ అన్న ఒక్క పత్రిక మాత్రమే ఇలాంటి వివరాలు ప్రచురిస్తూ ఉండేది. ఆ పత్రిక కూడా చాలినంతగా సమాచారం ఇవ్వడం లేదని ఆయన వాదన. అసలు అధికారుల లెక్కలు తప్పుతోవ పట్టించే విధంగా ఉన్నాయని అనేవారు నౌరోజీ. భారత్ అభివృద్ధి పథంలో సాగిపోతోంది అంటూ నోటిమాటగా చెప్పే మాటలు సరికావని కూడా తేల్చి చెప్పారాయన. దేశంలో సగటు వార్షిక తలసరి ఆదాయం ఎంత? ఇది చెప్పాలి అన్నారు. ఆకలితో నకనకలాడిపోతూ శ్రమించే కార్మికుడిని బట్టి కాదు, కార్మికుడు ఆరోగ్యంతో ఉంటే అతడి అవసరాలు ఎలా ఉంటాయో, ఆ ఆదాయం ఆధారంగా వివరాలు చెప్పాలని కోరారు. ఈ ప్రశ్నలు ఎందుకు వేయవలసి వచ్చిందో కూడా చెప్పారు నౌరోజీ. బ్రిటిష్ అధికారులు ఇచ్చిన గణాంకాల ప్రకారం 1867–1870 సంవత్సరాలలో సగటున భారతీయుడి తలసరి ఆదాయం ఏటా రూ. 20 మాత్రమే. శ్రామికుడు ఆరోగ్యంగా పనిచేయాలంటే ఉండవలసిన ఆదాయం రూ. 34. పై తరగతుల వారికీ, మధ్య తరగతుల వారికీ జాతీయాదాయంలో ఎక్కువ వాటా దక్కుతోంది. పేదలకి మాత్రం కనీస అవసరాలకు కూడా ఆదాయం అందడం లేదు. కాబట్టి బ్రిటిష్ ఇండియాలో రెండు భారతాలు ఉన్నాయని నిర్ధారించారాయన. సౌభాగ్యంతో వెలుగొందుతున్న భారత్ ఒకటి. ఇది బ్రిటిష్ వారికీ, కొందరు విదేశీయులకీ పరిమితం. రెండవది పేద భారతం. ఇది పేద భారతీయుల పరం. భారతీయుల మీద బ్రిటిష్ పాలకుల వివక్ష పన్నుల విషయంలో ఇంకా స్పష్టంగా తెలుస్తూ ఉంటుందని నౌరోజీ ఉదాహరణలతో చెప్పారు. పన్ను విధింపులో ఇది మరీ సుస్పష్టం. ఇంగ్లండ్లో విధించే ఆదాయం పన్ను 8 శాతం. అదే భారతదేశంలో మాత్రం 15 శాతం పన్ను విధించేవారు. మాంచెస్టర్ నుంచి దిగుమతి అయ్యే జౌళి ఉత్పత్తుల మీద సుంకం ఎత్తివేయడం గురించి ఇంగ్లండ్ కుత్సితానికి నిదర్శనంగా కనిపిస్తుంది. దీనితో భారతదేశంలోని జౌళి పరిశ్రమ నాశనం కావడానికి పునాది వేసినట్టయింది. ప్రభుత్వం తెచ్చే రుణాలకి అధిక వడ్డీ చెల్లించడం, ఐరోపావారు అందించే సేవలకి విపరీతంగా చెల్లింపులు చేయడం– ఈ రెండింటితోనే భారత్లో పేదరికం వీరవిహారం చేస్తోందని నౌరోజీ విశ్లేషించి చూపారు. భారతీయుల మీద భారం ఎక్కువగానే పడుతున్నదంటూ 1870లో నాటి ప్రధాని గ్లాడ్స్టోన్ వెల్లడించిన సంగతి గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, మరో 23 సంవత్సరాల తరువాత ఆయనే భారత్ భరిస్తున్న సైనిక వ్యయం ప్రమాదకర స్థాయిలో ఉందని కూడా అన్నాడు. అయినా బ్రిటన్ తన అవసరాల కోసం సైన్యాన్ని వినియోగించుకున్నప్పుడు తన వాటా తాను భరించవలసి ఉంటుందని కూడా నౌరోజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 37 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన తరువాత నౌరోజీ ఎగుమతి, దిగుమతుల వివరాలు కూడా ఇచ్చారు. భారత్ నుంచి జరిగిన ఎగుమతుల కంటే, దిగుమతుల విలువ 50 కోట్లకు పెరిగిందని ఆయన తేల్చారు. రైల్వేల నిర్మాణం కూడా బ్రిటన్ అవసరాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నది తప్పితే సాధారణ భారతీయుడికి అందుబాటులోకి రావడం లేదని నౌరోజీ ఆక్రోశించారు. అంటే రైల్వే వ్యవస్థ నిర్మాణం కోసం తెచ్చిన విదేశీ రుణభారం భారత్ మీద పడేది. ఈ వాదనలను బట్టి బ్రిటిష్ ప్రభుత్వం వైలీ కమిషన్ నియమించింది. భారతదేశంలో జరిగే ఆదాయ వ్యయాల గురించి నివేదిక ఇవ్వడానికి ఉద్దేశించిన కమిషన్ ఇది. పరిపాలనా వ్యయం, సైనిక వ్యయం భారత్, ఇంగ్లండ్ ఏ నిష్పత్తిలో భరించాలన్న అంశాన్ని సిఫారసు చేయడం కూడా ఈ కమిషన్ ఉద్దేశం. నౌరోజీ సేవలు చరిత్రపుటలకి అందేవి కావు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు 1894లో ఆయనకు ఒక లేఖ రాశారు– ‘పిల్లలు తండ్రి వైపు చూస్తున్నట్టు, భారతీయులు మీ వైపు చూస్తున్నారు. ఇక్కడ అచ్చంగా ఉన్న భావన ఇదే.’ దక్షిణాఫ్రికాలో భారతీయుల, విస్తృతార్థంలో చెప్పాలంటే నల్లజాతీయుల కడగండ్లను తీర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించవలసిందని నౌరోజీ ఎంపీగా ఉండగా గాంధీజీ రెండు పర్యాయాలు లేఖల ద్వారా కోరారు. గాంధీజీ ఆయనలో తండ్రిని చూశారు. కానీ జాతి ఆయనను ‘గ్రాండ్ ఓల్డ్మన్ ఆఫ్ ఇండియా’గా గౌరవించింది. ∙డా. గోపరాజు నారాయణరావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement