-
ఆగని పాక్ దురాగతం
కాల్పుల్లో చిన్నారి, జవాను మృతి... - 9 మందికి గాయాలు - మిలిటరీ పోస్టులు, పౌరులు లక్ష్యంగా దాడులు జమ్మూ: జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. ఆదివారం రాత్రి నుంచి మోర్టార్ బాంబులు, ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణారహితంగా జరిపిన దాడుల్లో ఆరేళ్ల చిన్నారి బలయ్యాడు. తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 9 మంది గాయపడగా... ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాక్ సైన్యం... 25 సరిహద్దు ఔట్పోస్టు (బీఓపీ)లు, జమ్మూ జిల్లాలోని నివాస ప్రాంతాలైన ఆర్ఎస్ పురా, ఆర్నియా, సుచేత్గఢ్, కనచక్, పర్గ్వాల్ సెక్టార్లలో అసాధారణ రీతిలో కాల్పులు జరిపింది. రాత్రంతా లాల్యాల్-గర్ఖాల్ ప్రాంతంలోని బంకర్లలో ఉన్న బిహార్ కార్మిక కుటుంబానికి చెందిన విక్కీకుమార్ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన వెంటనే మోర్టార్ బాంబు శకలం తగిలి మరణించాడు. ఆర్ఎస్ పురాలో హరియాణ కురుక్షేత్రకు చెందిన బీఎస్ఎఫ్ జవాను సుశీల్కుమార్ మెడకు బాంబు శకలం తగిలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా, 30కి పైగా పశువులు కూడా కాల్పుల్లో మరణించాయని, మరో 130 గాయపడ్డాయని అధికారులు తెలిపారు. పాక్ దాడులను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. భారతే కవ్వించింది: పాక్ భారత సైనికులు హర్పాల్, పుఖ్లియన్, చర్వా సరిహద్దుల్లో కాల్పులు జరిపారని, ఇందులోఆరు నెలల పసిబిడ్డ సహా మరో పౌరుడు మరణించారని పేర్కొంది. ఏడుగురు గాయపడ్డారని వెల్లడించింది. ఉగ్రవాది హతం శ్రీనగర్: కశ్మీర్లోని కుప్వారా జిల్లా లోలబ్లో ఆదివారం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. -
పాక్ దాష్టీకంపై కన్నీరుమున్నీరు!
సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన విచక్షణారహితమైన కాల్పుల్లో ఒక భారత జవాను ఒకరు అమరుడయ్యారు. సోమవారం తెల్లవారుజామున జమ్మూ ఆర్ఎస్ పుర సెక్టర్లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా భారీ కాల్పులు, మోర్టార్ షెల్లింగ్ దాడులతో పాక్ రేంజర్లు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో హర్యానా కురుక్షేత్రకు చెందిన బీఎస్ఎఫ్ సుశీల్ కుమార్ ప్రాణాలు విడిచారు. సరిహద్దుల్లో పహారా కాస్తూ పాక్ కాల్పుల్లో ఆయన చనిపోయారన్న వార్త తెలియడంతో సుశీల్కుమార్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుశీల్కుమార్ భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతూ విలపించారు. దీంతో సుశీల్కుమార్ ఇంటి వద్ద, ఆయన గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
మళ్లీ బరితెగించిన పాకిస్థాన్!
జమ్మూ: సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. జమ్మూ ఆర్ఎస్ పుర సెక్టర్లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా భారీ కాల్పులు, మోర్టార్ షెల్లింగ్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను ఒకరు మృతి చెందగా.. ముగ్గురు జవానుకు గాయాలయ్యాయి. పాక్ రేంజర్స్ కాల్పుల్లో గాయపడిన జవానును వెంటనే జమ్మూలోని ఆస్పత్రికి తరలించినా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు. ఆర్ఎస్ పుర సెక్టర్లో అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా ఆదివారం పాక్ రేంజర్లు రెండుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. మోర్టార్ షెల్స్ర, తక్కువస్థాయి ఆయుధాలతో కాల్పులకు దిగారు. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు కూడా పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బదులిచ్చారు. ఇప్పటికే పాక్ సైన్యం కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ మృతిచెందగా.. తాజా కాల్పుల్లో మరో జవాను ప్రాణాలు విడిచాడు. గత శుక్రవారం జమ్మూకశ్మీర్లోని హీరానగర్ సెక్టర్లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతీకారంగా బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రస్థాయిలో కాల్పులు జరిపి ఏడుగురు పాక్ రేంజర్లను హతమార్చారు. పాక్ ఏకపక్ష కాల్పుల్లో గాయపడిన గుర్నామ్ సింగ్ రెండురోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్ను భారత సైన్యం ఆదివారం తీవ్రంగా హెచ్చరించింది. తమ సైనికులను కనీసం తాకాలని ప్రయత్నించినా పాక్ తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదని తేల్చిచెప్పింది. పాక్ సైన్యం ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే.. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉందని బీఎస్ఎఫ్ అడిషనల్ డీజీ అరుణ్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
మా జోలికొస్తే పాక్కు తగిన శాస్తి తప్పదు!
సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ను భారత సైన్యం ఆదివారం తీవ్రంగా హెచ్చరించింది. తమ సైనికులను కనీసం తాకాలని ప్రయత్నించినా పాక్ తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదని తేల్చిచెప్పింది. గత శుక్రవారం జమ్మూకశ్మీర్లోని హీరానగర్ సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ను పాక్ సైన్యం కవ్వింపు కాల్పుల్లో గాయపరచడంతో ప్రతీకారంగా బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రస్థాయిలో కాల్పులు జరిపి ఏడుగురు పాక్ రేంజర్లను హతమార్చిన సంగతి తెలిసిందే. పాక్ సైన్యం మొదట జరిపిన ఏకపక్ష కాల్పుల్లో గాయపడిన గుర్నామ్ సింగ్ రెండురోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన భౌతికకాయానికి జమ్ములోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అరుణ్కుమార్ సైనిక లాంఛనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత 24 గంటలుగా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. కానీ ఈ శాంతియుత వాతావరణం ఏ సమయంలోనైనా భగ్నం కావొచ్చు. అందుకు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. పాక్ సైన్యం ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే.. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు బీఎస్ఎఫ్ సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. సరిహద్దుల్లో ప్రస్తుత వాతావరణం తుఫాన్కు ముందు ప్రశాంతతలాంటిదా? అని అడిగితే.. ‘అది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ మేం దేనినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని అడిషనల్ డీజీ అరుణ్ కుమార్ తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement