-
కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
రాయ్పూర్: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్, ఇండియా కూటమిలు కోపంతో ఉన్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. బస్తర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 500 ఏళ్ల కల నెరవేరి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయినందుకు రాముని మాతృమూర్తి పుట్టినల్లు అయిన ఛత్తీస్గఢ్ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అయితే రాముని గుడి విషయంలో కాంగ్రెస్ ఇండియా కూటమి మాత్రం కోపంగా ఉన్నాయని సెటైర్లు వేశారు. రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ తిరస్కరించిందని ఎద్దేవా చేశారు. ఆహ్వానం తిరస్కరించడం తప్పని మాట్లాడిన నేతలను ఆ ఫ్యామిలీ పార్టీ నుంచి బయటికి పంపించిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకునేందుకు తమకు లైసెన్స్ ఉందని కాంగ్రెస్ భావించిందని, అయితే 2014లో మోదీ ప్రభుత్వం వచ్చి ఆ లూఠీ లైసెన్స్ను రద్దు చేసిందన్నారు. ప్రజలు మోదీకి లైసెన్స్ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ దోపిడీ లైసెన్స్ను మోదీ రద్దు చేయగలిగాడని చెప్పారు. గిరిజనులను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించిందని, బీజేపీ మాత్రం గిరిజన మహిళన రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి.. ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్జెండర్ గురించి తెలుసా -
2018 గ్రూప్-1 రద్దు తీర్పు.. ఆందోళన వద్దన్న ఏపీ ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మెయిన్స్ను మళ్లీ ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ బోర్డుకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 2018లో 167 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సిందేనని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్కు వెళ్తామని ప్రకటించింది. -
మియాపూర్ లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
-
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు
-
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు అయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాత నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ సోమవారం రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక.. త్వరలో 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు సీఎం రేవంత్రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్-1కు సంబంధించి పూర్తి వివరాలపై కమిషన్ విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కమిషన్ వెల్లడించింది. ఇక.. రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. చదవండి: సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ -
జార్ఖండ్లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్–విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం–తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం–బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు బెంగళూరు–విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్–తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–భువనేశ్వర్ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా–సికింద్రాబాద్ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్–పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు సికింద్రాబాద్–పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్–సికింద్రాబాద్ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు సికింద్రాబాద్–ధనాపూర్ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 28 వరకు బెంగళూరు–ధనాపూర్ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్–హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ–నర్సాపూర్ (17226), హుబ్లీ–గుంతకల్లు (07337), గుంతకల్లు–హుబ్లీ (07338), బల్గెవి–కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట–బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
ఫార్ములా ఈ-రేస్ రద్దు...కేటీఆర్ సీరియస్
-
‘సీడబ్ల్యూసీ’కి వెళ్లని సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి వెళ్లాల్సిన సీఎం రేవంత్రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కారణంగానే ఇదే రోజు జరగాల్సిన కలెక్టర్ల సదస్సు కూడా వాయిదా వేశారు. అందుకు అనుగుణంగా ఉదయం తన నివాసంలోనే సాగునీటి శాఖపై రివ్యూ చేశారు. కానీ, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ షెడ్యూల్ మారిపోయింది. విద్యుత్పై చర్చ సందర్భంగా వాడీవేడిగా సభ సాగడంతో ఆయన అసెంబ్లీలోనే ఉండిపోయారు. ఒక దశలో సీఎం జోక్యం చేసుకొని విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటన పూర్తయిన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళతారనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరిగినా, సీఎం ఢిల్లీకి బయలుదేరలేదు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను సీడబ్ల్యూసీకి రాలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్కు చెప్పి ఢిల్లీ పర్యటన విరమించుకున్నారని సమాచారం. అయితే సీడబ్ల్యూసీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్న అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. కారణమేంటి? సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లకపోవడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడమే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధ, గురువారాల్లో రెండు కీలక అంశాలపై ప్రభు త్వం శ్వేతపత్రాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం సభలో లేకుండా పార్టీ సమావేశానికి వెళితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే సీఎం సభలో లేకుండా వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఎత్తిపొడిచే అవకాశం వచ్చి ఉండేదని, దీనికి తోడు కీలక రంగాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం సభలో లేకపోతే అధికార పక్షానికి కూడా సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందనే కారణంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని ప్రభుత్వ, పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కేవలం అసెంబ్లీ సమావేశాలే కాదని, మరో ముఖ్యమైన పనిలో ఉన్న కారణంగానే సీఎం ఢిల్లీ వెళ్లలేదనే చర్చ కూడా జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో మంత్రి ఉత్తమ్ కూడా రేవంత్రెడ్డితో చాలా సేపు అసెంబ్లీ లాబీల్లోని సీఎం చాంబర్లో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ తర్వాతే రేవంత్ తన టూర్ రద్దు చేసుకున్నారనే చర్చ కూడా జరిగింది. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్
భారతదేశంలోని బ్యాంకులపై గట్టి నిఘా పెట్టిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి జరిమానాలు విధించింది. కాగా ఇప్పుడు మరిన్ని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మకారిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నియమాలు డిసెంబర్ 04 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. సదరు బ్యాంకు వద్ద మూలధనం ఎక్కువగా లేకపోవడమే కాకుండా.. ఆదయ మార్గాలు కూడా లేకపోవడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) నిబంధనలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. నిబంధనలను అమలు చేయడంలో శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ విఫలం కావడం వల్ల.. కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇస్తే కస్టమర్లు ఇబ్బందిపడే అవకాశం ఉందని RBI భావించింది. ఇప్పటికే డిపాజిట్లు చేసుకున్న వారికి తిరిగి చెల్లించే పరిస్థిలో ఈ బ్యాంక్ లేకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు ఇన్ని రకాలా..! ఇవెలా ఉపయోగపడతాయంటే..? ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిన ఆర్బీఐ లెక్కకు మించిన లైసెన్సులను రద్దు చేసింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ బ్యాంకులు ఉండటం గమనించదగ్గ విషయం. -
మిచౌంగ్ తుపాను : దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్
సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాన్ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో) తెలిపారు. ఎస్సీఆర్ పరిధిలో రైళ్లపై తుపాన్ ఎఫెక్ట్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రస్తుతం రైల్వే ట్రాక్ లపై ఎక్కడా నీళ్ళు నిలవలేదు. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమచారం అందించాం. ఎస్ఎంఎస్లు, సామాజిక మాధ్యమాల్లోనూ అందించాం. ప్రయాణికుల రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేశాం. తుపాను తీరం దాటాక వీలైనంత త్వరగా రైళ్లు పునరుద్ధరిస్తాం’ అని సీపీఆర్వో తెలిపారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ప్లాన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి పట్టణానికి ప్రతిపాదించిన మాస్టర్ప్లాన్ను వెంటనే రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కామారెడ్డి రైతు జేఏసీ నాయకులు శనివారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతమున్న పాత మాస్టర్ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. మాస్టర్ప్లాన్ రద్దు చేయాలని ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ పాలకమండలి తీర్మానించిందని, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటామని చెప్పారు. మాస్టర్ప్లాన్ రద్దు కోసం జరిగిన ఆందోళనలలో రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కేసుల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. మాస్టర్ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ చేసిన ప్రకటనపై కామారెడ్డి రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?
న్యూఢిల్లీ: బాలీవుడ్నటి పరిణీతి చోప్రో భర్త, ఆప్ ఎంపీ, రాఘవ్ చద్దాకు ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను ఖాళీ చేయాలన్న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. అయితే ఏప్రిల్ ఆర్డర్ను రద్దు చేస్తూ అక్టోబర్ 5న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాఘవ్ చద్దా సవాలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాఘవ్ చద్దాకు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 18న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీతో కూడిన సింగిల్ బెంచ్ సమర్ధించింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం ఈ తీర్పుపై స్పందించిన రాఘవ్ చద్దా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. తన పోరాటం ఇల్లు లేదా దుకాణం గురించి రాజ్యంగ రక్షణ గురించి అని ట్వీట్ చేశారు. యువ ఎంపీగా తన నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ కక్షతోనే తన బంగ్లా కేటాయింపు రద్దు చేశారని విమర్శించారు.కోట్లాది మంది భారతీయుల తరపున మాట్లాడేవారిని, ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ తాను పార్లమెంటులో రెండు ప్రసంగాలు చేశానని, తన తొలి ప్రసంగం తర్వాత తన అధికారిక వసతి రద్దు చేశారన్నారు.అలాగే రెండో ప్రసంగం తరువాత ఎంపీగా తన సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడితే ఏమవుతుందో భయపడుతూంటే ఇక ఏ ఎంపీ పని చేయలేరంటూ తన ఎక్స్ పోస్ట్లో తెలిపారు. Ye makan ya dukan ki nahin, Samvidhan ko bachane ki ladhayi hai In the end, truth and justice have prevailed My statement on the Hon'ble Delhi High Court's ruling to set aside the unjust order to evict me from my official residence. pic.twitter.com/fA7BJ2zLYm — Raghav Chadha (@raghav_chadha) October 17, 2023 -
హైకోర్టు సీరియస్..గ్రూప్ 1 పరీక్ష రద్దు..
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ రద్దు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ: గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లి నిర్వహించాలన్న పిటిషన్పై విచారణ చేప్పట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. జూన్ 11వ తేదీన జరిగిన ఈ పరీక్ష రద్దు చేసి మళ్లి నిర్వహించాలని TSPSCని కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజీ కారణాల వలన ఒకసారి రద్దు చేసి మళ్ళీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు ఇది రెండవ సారి రద్దు అవ్వడం. ఇదీ చదవండి: బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్పీఎస్సీపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్ షీట్లపై హాల్టికెట్ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసిన విషయం తెల్సిందే. జూన్ 11న టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వాదనలు ఇలా జరిగాయి టీఎస్పీఎస్సీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ ఎం.రాంగోపాల్ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పా రు. అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్ కార్టు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్కు 3.8 లక్షల మంది అభ్యర్థు లు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మా త్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది -
కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు
ముంబయి: ఇండియా- కెనడా మధ్య వివాదాస్పద పరిస్థితుల ప్రభావం ఓ సింగర్ సంగీత కచేరి మీద పడింది. ముంబయిలో జరగనున్న ఖలిస్థానీ మద్దతుదారుడైన కెనడియన్ పంజాబీ సింగర్ శుభ్ సంగీత కచేరీ రద్దైంది. సింగర్ శుభ్ భారత పర్యటన కూడా రద్దైంది. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగీత కచేరి కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి బుక్ మై షో ఇప్పటికే రీఫండ్ కూడా చేసేసింది. ఖలిస్థానీలకు మద్దతు తెలుపుతున్నట్లు సింగర్ శుభ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్న నేపథ్యంలో.. సంగీత కచేరీని రద్దు చేయాలని భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. దీంతో శుభ్ పర్యటనకు స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ బీఓఏటీ ఈ మేరకు సంగీత కచేరిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ శుభ్ వివాదాస్పద భారత్ చిత్రపటాన్ని షేర్ చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్ను షేర్ చేయడంతో క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా శభ్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ -
వానదే విజయం
పల్లెకెలె: భారత్తో ఆసియా కప్ పోరులో పాకిస్తాన్ విజయలక్ష్యం 267 పరుగులు... పాక్ దీనిని ఛేదిస్తుందా లేక తొలి ఇన్నింగ్స్ తరహాలో భారత బౌలర్లు కూడా చెలరేగి ప్రత్యచ్చిని కట్టడి చేస్తారా... ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ... అయితే అందరి ఆసక్తిపై వర్షం నీళ్లు చల్లింది... పాకిస్తాన్ అసలు బ్యాటింగ్కు దిగే అవకాశమే రాలేదు. అత్యంత ఆసక్తికర, హోరాహోరీ సమరంగా అంచనాలు పెంచిన మ్యాచ్ చివరకు వరుణుడి బారిన పడింది. శనివారం భారత్, పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. భారత్ ఇన్నింగ్స్ పూర్తిగా సాగగా, ఆపై వానదే విజయమైంది. అర్ధాంతరంగా ముగిసిన మ్యాచ్లో టాప్–4 విఫలం కావడం భారత్ కోణంలో నిరాశపర్చే అంశం కాగా... ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ విశేషం. ముగ్గురు ప్రధాన పేసర్లు చెలరేగడం పాకిస్తాన్కు సంబంధించి పెద్ద సానుకూలాంశం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్కు 138 పరుగులు జోడించారు. షాహిన్ అఫ్రిది (4/35) బౌలింగ్ హైలైట్ కాగా, నసీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్ నెగ్గిన పాకిస్తాన్ ఈ ఫలితంతో ‘సూపర్–4’ దశకు చేరగా, రేపు నేపాల్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే సూపర్–4 దశకు అర్హత సాధిస్తుంది. టాప్–4 విఫలం... రోహిత్ శర్మ (22 బంతుల్లో 11; 2 ఫోర్లు), గిల్ (32 బంతుల్లో 10; 1 ఫోర్) కలిసి జాగ్రత్తగా భారత ఇన్నింగ్స్ను ప్రారంభించారు. రోహిత్ రెండు బౌండరీలు కొట్టినా గిల్ పదో బంతికి గానీ తొలి పరుగు చేయలేకపోయాడు. పాక్ బౌలర్ల జోరుతో కొద్ది వ్యవధిలోనే అంతా మారిపోయింది. చక్కటి బంతితో రోహిత్ను క్లీన్»ౌల్డ్ చేసి షాహిన్ మొదటి దెబ్బ కొట్టగా, అతని తర్వాతి ఓవర్లోనే కోహ్లి (4) బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన శ్రేయస్ (14), కెరీర్లో పాక్తో తొలి మ్యాచ్లో తడబడుతూనే ఆడిన గిల్ను రవూఫ్ పెవిలియన్ పంపించాడు. దాంతో 66/4తో భారత్ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కిషన్, పాండ్యా భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్ను నిలబెట్టింది. తాను ఆడిన గత మూడు వన్డేల్లో (వెస్టిండీస్తో) అర్ధసెంచరీలు సాధించిన కిషన్ ఇక్కడా అదే ఫామ్ను కొనసాగించగా... పాండ్యా పాక్పై మరోసారి సత్తా చాటాడు. వీరిద్దరు పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చక్కటి సమన్వయంతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 54 బంతుల్లో కిషన్, పాండ్యా 62 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వికెట్ల మధ్య పరుగెత్తడంలో కొంత ఇబ్బంది పడిన కిషన్ భారీ షాట్కు ప్రయత్నించడంతో ఈ భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పాండ్యా సహా 7 బంతుల వ్యవధిలో జట్టు తర్వాతి 3 వికెట్లు కోల్పోగా, నసీమ్ 49వ ఓవర్లో 2 వికెట్లతో భారత్ ఆట ముగించాడు. మళ్లీ మళ్లీ అడ్డుపడి... భారత జట్టు ఇన్నింగ్స్ సమయంలో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. 4.2 ఓవర్ల తర్వాత (స్కోరు 15/0) 33 నిమిషాల పాటు... 11.2 ఓవర్ల తర్వాత (స్కోరు 51/3) 20 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. భారత్ ఇన్నింగ్స్ ముగియగానే విరామ సమయంలో వచ్చిన వర్షం కారణంగా సమయం నష్టపోవాల్సి వచ్చింది. ఎంతసేపు నిరీక్షించినా తెరిపి లభించలేదు. రెండు సార్లు అంపైర్లు పరీక్షించినా ఆ వెంటనే చినుకులు రావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. చివరకు రాత్రి గం. 9.52కు మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. 5 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రద్దయిన వన్డే మ్యాచ్లు. రెండు జట్ల మధ్య మొత్తం 133 మ్యాచ్లు జరిగాయి. 55 మ్యాచ్ల్లో భారత్, 73 మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలుపొందాయి. 26 వన్డే ఫార్మాట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు కావడం 26 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1997లో టొరంటోలో జరిగిన సహారా కప్లో చివరిసారి ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) షాహిన్ 11; గిల్ (బి) రవూఫ్ 10; కోహ్లి (బి) షాహిన్ 4; శ్రేయస్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 14; కిషన్ (సి) బాబర్ (బి) రవూఫ్ 82; పాండ్యా (సి) సల్మాన్ (బి) షాహిన్ 87; జడేజా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 14; శార్దుల్ (సి) షాదాబ్ (బి) నసీమ్ 3; కుల్దీప్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 4; బుమ్రా (సి) సల్మాన్ (బి) నసీమ్ 16; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 20; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 266. వికెట్ల పతనం: 1–15, 2–27, 3–48, 4–66, 5–204, 6–239, 7–242, 8–242, 9–261, 10–266. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–2–35–4, నసీమ్ షా 8.5–0–36–3, రవూఫ్ 9–0–58–3, షాదాబ్ 9–0–57–0, నవాజ్ 8–0–55–0, సల్మాన్ 4–0–21–0. -
అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్
లక్నో: కాసేపట్లో పెళ్లి జరగబోతోందనగా కాస్త ముందుగానే కళ్యాణ మండపానికి వచ్చిన వరుడికి సూపర్ షాకిచ్చింది వధువు తల్లి. కళ్యాణ మండపానికి వధువుని వెంటబెట్టుకుని వచ్చే క్రమంలో డాన్సులు చేస్తూ ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ కనిపించిన అత్తగారిని చూసి కాబోయే అల్లుడు హతాశుడయ్యాడు. అత్తగారి విచిత్ర ధోరణికి మండిపడి పెళ్లి పెటాకులు చేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఉత్తరాదిలో పెళ్లిళ్లంటే ఆ ధూమ్ ధామ్ సందడే వేరు. పెళ్ళికి ముందు నుంచే ప్రతిరోజూ పెళ్లే అన్నంత కోలాహలంగా ఉంటుంది వాతావారణం. హల్దీ, మెహందీ, సంగీత్, షాదీ ఇలా పెళ్ళి పేరుతో పెద్ద తంతే నడుస్తుంది. ఇక అక్కడి పెళ్లిళ్లలో లింగ భేదం లేకుండా విందు చేయడం చిందులేయడం సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పధ్ధతి రుచించక వరుడు పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పంచాయతీ జరిపిన తర్వాత పెళ్ళికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన వరుడికి, రాజ్ పురకు చెందిన వధువుకి జూన్ 27న వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లిలో సందడి చేయడానికి డీజే కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందనగా వరుడు బంధువర్గ సపరివారసమేతంగా ముందే కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే వధువు తరపు బృందం ఊరేగింపుగా వచ్చారు. కానీ వధువు పల్లకికి ముందు వధువు తల్లి సిగరెట్ కాలుస్తూ తన్మయత్వంతో చిందులేస్తూ కనిపించింది. వధువు కోసం వేచి ఉన్న వరుడు అత్తని అలా చూసి షాక్ కి గురయ్యాడు. కోపోద్రిక్తుడై పెళ్లి వద్దనుకుని పెళ్లి మటపం నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం రెండువర్గాల పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వరుడు పెళ్ళికి అంగీకరించాడు. తర్వాత పెళ్లి కార్యక్రమం యధాతధంగా కొనసాగింది. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఓ వింత సంఘటన జరిగింది. ప్రధాని పేరు చెప్పలేకపోయాడని ఓ వధువు పెళ్లిని రద్దు చేసింది. అంతేకాకుండా వెంటనే వరుని తమ్ముడినే వివాహమాడింది. సైద్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదీ జరిగింది.. శివ శంకర్(27) నాసిర్పూర్ గ్రామానికి చెందిన రామ్ అవతార్ కుమారుడు. ఇతనికి సమీప గ్రామానికి చెందిన రంజన అనే అమ్మాయితో జూన్ 11న వివాహం జరిగింది. మరుసటి రోజు వధువు ఇంటి వద్ద ఓ చిన్న వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో వరుడు తన మరదలు, బావమరిదిని సరదాగ ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో మరదలు కూడా వరున్ని ప్రధాని ఎవరని ప్రశ్నించింది. దేశ ప్రధాని పేరు ఆయన చెప్పలేకపోయాడు. వధువు బంధువులు వరున్ని హేళన చేశారు. దీన్ని అవమానంగా భావించిన రంజన అక్కడికక్కడే అనంత్ను వివాహమాడింది. అనంత్ శివ శంకర్ సోదరుడు. వయస్సులో చిన్నవాడు. దీనిని రామ్ అవతార్ ఖండించాడు. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదీ చదవండి: స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే.. -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్జాయ్ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది. దీంతో ఖమ్మం సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు నిలిపివేశారు!. కాగా ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న అమిత్ షా భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, పార్టీ కమిటీల్లో మార్పులపై జరిగిన ప్రచారంతో కూడా కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. అమిత్ షా పర్యటన క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపే అవకాశం ఉందని ఊహించారు. అయితే తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దవ్వడంతో కాషాయ పార్టీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక.. ఆయన రావడం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో హైదరాబాద్కు రాకున్నా.. కనీసం ఖమ్మం సభకైనా ఆయన నేరుగా హాజరు అయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. చదవండి: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో -
111 జీవో రద్దుకు తెలంగాణ కేబీనెట్ ఆమోదం
-
తీవ్ర ఇబ్బందులు: రెండు రోజులు విమానాలను రద్దు చేసిన సంస్థ
న్యూఢిల్లీ: వాడియా గ్రూప్ యాజమాన్యంలోని బడ్జెట్ ధరల విమానాయాన సంస్థ గోఫస్ట్ ఫండ్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ కారణంగా రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) తీవ్రమైన నిధుల కొరత కారణంగా (బుధవారం, గురువారం (మే 3, 4 తేదీలు) విమానాలను రద్దు చేసింది. ఈ మేరకు గోఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనాను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. అంతేకాదు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసింది. ప్రాట్ అండ్ విట్నీ (P&W) ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో 28 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖోనా పీటీఐకి చెప్పారు. స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియల దాఖలు దురదృష్టకర నిర్ణయమని పేర్కొన్నారు. కానీ కంపెనీ ప్రయోజనాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్పై భారీ తగ్గింపు) -
బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
- రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
- Lok Sabha Election 2024: బెంగాల్లోకి అక్రమ వలసలు
- ప్రాణాలు తీస్తున్న గజరాజులు
- లయ తప్పుతున్న గుండె
- ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
- ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- 3 నుంచి బడిబాట
- Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
Advertisement