-
ఒకవైపు వర్షాలతో అతలాకుతలం.. వరద నీటిలో చేపల వేట (ఫొటోలు)
-
కోతికి కొత్త ఉపాయం..!
* వానరాన్ని పట్టిస్తే రూ.400 నజరానా * మానుకోట మునిసిపాలిటీలో అమలు * నెల రోజులుగా 926 కోతుల పట్టివేత * భద్రాచలం అడవులకు తరలింపు వరంగల్: జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తున్న కోతులను ఎదుర్కొనేందుకు వరంగల్ జిల్లా మహబూబాబాద్ మునిసిపాలిటీ కొత్త ఉపాయం ఆలోచించింది. కోతులను నివారించే విషయంలో సెంటిమెంట్లను గౌరవిస్తూనే వీటి బెడదను తగ్గించే చర్యలు చేపట్టింది. కోతుల సమస్యపై పట్టణవాసుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో శాశ్వతంగా వీటి నివారణ చర్యలు అమలు చేస్తోంది. ఒక కోతిని పట్టుకుంటే రూ.400 చెల్లించాలని నిర్ణయించింది. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన 10 కుటుంబాల వారు ఇప్పుడు కోతులను పట్టే పనిలో పూర్తి నిమగ్నమయ్యారు. అక్టోబరు 29న కోతులు పట్టడం మొదలైంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. 'నెల రోజుల్లో మా బృందం 926 కోతులను పట్టి అడవుల్లో వదిలిపెట్టాం' అని కోతులను పట్టే బృందం నాయకుడు శివయ్య తెలిపారు. కోతులను పట్టుకోవడం కోసం వీరు 20 బోన్లను వినియోగిస్తున్నారు. కోతుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బోన్లను అమర్చి తినే పదార్థాలను పెట్టి వాటిని పడుతున్నారు. పట్టుకున్న కోతులను అడవుల్లో వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పట్టణవాసులకు ఇబ్బందిగా ఉన్న కుక్కల నివారణలోనూ మునిసిపాలిటీ చర్యలు తీసుకుంటోంది. ఒక కుక్కను చంపితే రూ.100 చొప్పున నజరానా ఇస్తోంది. ఇప్పటికే 366 వీధి కుక్కలను చంపి పట్టణానికి దూరంగా పడవేశారు. తాజాగా, కుక్కలను చంపకుండా ఇంజక్షన్లు ఇచ్చి పునరుత్పత్తి కాకుండా చికిత్సలు చేయిస్తున్నారు. -
పట్టుకుంటే రూ. 10
గుంటూరు ఘటనతో ఆస్పత్రుల్లో మూషికాలపై ఏపీ సర్కారు ఆదేశం హైదరాబాద్: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఏపీ సర్కారు వ్యవహారం. గుంటూరు జిల్లా సమగ్ర ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికిన ఘటన అనంతరం కళ్లు తెరిచింది. ఎలాగైనా ప్రభుత్వాస్పత్రుల్లో మూషికాలను మట్టుబెట్టాలని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్కో ఎలుకను పట్టిన వారికి రూ.10 ప్రకటించింది. ఇంకేముంది.. ఇప్పుడు ఎలుకలు పట్టే వారికి గిరాకీ పెరిగింది. చిట్టెలుక, చుంచు.. ఇలా ఏదైనా ఒక ఎలుకకు ఒకే ధర. పందికొక్కులకు మాత్రం రేటు నిర్ధరించలేదు. మొత్తం 11 వైద్య కలాశాలలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ ఎలుకలను నిర్మూలించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇకపై 15 రోజులకోసారి ఎన్ని ఎలుకలను పట్టిందీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎలుకలను పట్టినందుకు అయ్యే వ్యయాన్ని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నుంచి ఖర్చు చేసుకునే వీలుంటుంది. లక్షలకు చేరిన ఎలుకల సంతానం.. కొన్నేళ్లుగా ఎలుకలపై నివారణ చర్యలు తీసుకోకపోవడంతో వాటి సంతానం లక్షలకు చేరుకుని ఉంటుందని ఓ పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ అన్నారు. తాజాగా గుంటూరులో జరిగిన ఘటన అనంతరం వారంలో 400 పైగా ఎలుకలను పట్టుకున్నట్టు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇవి కూడా నాలుగైదు వార్డుల్లోనే. దీన్నిబట్టి ఎలుకల సంతానం అపరిమితంగా పెరిగిపోయిందని తెలుస్తోంది. రోగి ఐసీయూ బెడ్పై ఉంటూండగానే పడకపై తిరుగుతూ గెంతులేసే స్థాయికి ఎలుకలు చేరుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొదట డ్రైనేజీలు చక్కదిద్దాలి.. ఎలుకలను నిర్మూలించాలంటే ముందు డ్రైనేజీ పరిస్థితులను చక్కదిద్దాలని, ఊరికే బోన్లు పెడితే అవి వచ్చి ఇరుక్కునే పరిస్థితి లేదని ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎలుకలను పట్టడం కూడా పారిశుధ్య కాంట్రాక్టరుదే బాధ్యతని ప్రభుత్వం చెబుతోంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం తాము పారిశుధ్యం చేస్తాం గానీ, ఎలుకలను ఎలా పట్టుకోగలమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇకపై రోగులపైకి ఎలుకలు వచ్చాయంటే డ్యూటీలో ఉన్న వైద్యుడు, ఆర్ఎంఓ, స్టాఫ్ నర్సులే బాధ్యత వహించాలని చెబుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement