-
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
ఫ్రైడ్రైస్లోకి కశ్మీరీ చట్నీ సూపర్ కాంబినేషన్.. ఇలా చేసుకోండి
కశ్మీరీ చట్నీ తయారీకి కావల్సినవి: కశ్మీరీ మిరపకాయలు – ఇరవై; నూనె – ఐదు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి తురుము – ఐదు టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు –రెండు టేబుల్ స్పూన్లు; టొమాటో కెచప్ – ఐదు టేబుల్ స్పూన్లు; రెడ్చిల్లీ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; సోయాసాస్ – టేబుల్ స్పూను; మిరియాల పొడి – టేబుల్ స్పూను; అరోరూట్ పొడి – టేబుల్ స్పూను, చక్కెర – టేబుల్ స్పూను; వెనిగర్ – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: మిరపకాయలను నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.మిరపకాయలు చక్కగా నానాక మిక్సీజార్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె మొత్తం వేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో వెల్లుల్లి తురుము, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి మీడియం మంట మీద వేయించాలి తరువాత ఎండుమిర్చి పేస్టు వేసి వేయించాలి.తరువాత టొమాటో కెచప్, రెడ్చిల్లీసాస్, సోయాసాస్, మిరియాల పొడి, అరోరూట్ పోడి, చక్కెర వేసి ఐదు నిమిషాలు తిప్పాలి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, వెనిగర్ వేసి రెండు నిమిషాల పాటు వెయించి దించేయాలి. నెలరోజుల పాటు నిల్వ ఉండే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, నూడుల్స్, ఎగ్ఫ్రైడ్రైస్ల్లోకి మంచి కాంబినేషన్. -
గుంటూరు మిర్చి: అ‘ధర’గొట్టిన ఎగుమతులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.10,445 కోట్ల మార్కును దాటా యి. మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావటం విశేషం. ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ.. ధర ఎక్కువ గా ఉండటంతో గత ఏడాది కంటే రూ.1,861 కోట్ల ఆదాయం అధికంగా లభించింది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 78 వేల హెక్టార్లు కాగా.. 2022– 23లో అత్యధికంగా 84,861 హెక్టార్లలో సాగు చేశారు. అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా, శ్రీలంక, మలేషియా, థాయ్లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. కారం, విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపైనా గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్నిరకాల మిర్చికి ఎగుమతుల హబ్గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ఇతర మసాలా ఉత్పత్తులతోపాటు పత్తి, నూలు ఎగుమతులపైనా దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎక్స్పోర్టు హబ్గా మారుస్తాం గుంటూరును మిర్చి ఎక్స్పోర్ట్ హబ్గా మారిస్తే మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ, ముడి పదార్థాల లభ్యత పెంపు, నైపుణ్యం పెంపు, సాంకేతికత బదిలీ జరుగుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెటింగ్ ఈవెంట్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. – ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్, గుంటూరు చిల్లీస్ బోర్డు ఏర్పాటు చేయాలి స్పైసెస్ బోర్డులో అత్యధిక విదేశీ ఆదాయాన్ని సమకూరుస్తున్న మిర్చి పంట కోసం కేంద్రం ప్రత్యేకంగా చిల్లీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. పంట చేతికొచ్చిన తర్వాత విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెడుతున్న బోర్డు, రైతులకు కావాల్సిన మంచి విత్తనం, దీనికి సంబంధించిన పరిశోధనలపై దృష్టి పెట్టడం లేదు. అందుకే చిల్లీస్కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. – తోట రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ధర ‘తేజో’మయమే ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర క్వింటాల్కు రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలుకుతోంది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేల వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్కు రూ.12,500 నుంచి రూ.23,500 వరకు, ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.14 వేల నుంచి రూ.25,500 వరకు ధర లభిస్తోంది. కారం తయారీకి అధికంగా ఉపయోగించే 341, దేవనూరు డీలక్స్, 334 రకాల మిర్చి క్వింటాల్ రూ.23 వేలకు పైగా పలుకుతోంది. -
చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసినవి: పుట్టగొడుగులు (మష్రూమ్స్)-1 కప్పు, కాప్సికం ముక్కలు-1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసినవి),వెల్లుల్లి- 4 రెబ్బలు, టొమాటో కెచప్-2 టేబుల్ స్పూన్లు, వెనిగర్-1 టేబుల్ స్పూన్, సోయా సాస్-2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి-2 టేబుల్ స్పూన్లు, ఉప్పు-సరిపడా, నీళ్లు- కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు- గార్నిష్కి, నూనె-తగినంత తయారీ: ముందుగా పుట్టగొడుగులను నూనెలో మీడియం మంట మీదే దోరగా వేయించాలి. అదే సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, సోయాసాస్, వెనిగర్ను ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయి తీసుకుని, 2 గరిటెల నూనె వేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలతో పాటు.. క్యాప్సికమ్ ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఆపై పుట్టగొడుగుల్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం మిగిలిన టొమాటో కెచప్తో పాటు.. మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కీమా పోహా కావలసినవి: కీమా-పావు కప్పు (మెత్తగా ఉడికించుకోవాలి), అటుకులు(పోహా)-ముప్పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు-అర టీ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి), కారం-అర టీ స్పూన్, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్-1 టీ స్పూన్ చొప్పున, గ్రీన్ బఠాణీ-కొద్దిగా (నానబెట్టి, ఉడికించినవి), పసుపు-అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-3 టేబుల్ స్పూన్లు, టొమాటో, క్యారెట్ ముక్కలు-కొన్ని (చిన్నగా కట్ చేసినవి) కరివేపాకు, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా. తయారీ: ముందుగా 2 టీ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. అందులో టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం ఉడికించిన కీమా వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. తర్వాత ఆమ్ చూర్ పౌడర్, గ్రీన్ బఠాణీ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈలోపు అటుకులు తడిపి, వెంటనే నీళ్లు లేకుండా గట్టిగా పిండి, కీమాలో వేసుకుని తిప్పుతూ ఉండాలి. కళాయికి మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర, కారప్పూస వంటివి వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. వాల్నట్ షీరా కావలసినవి: రవ్వ-1 కప్పు (దోరగా వేయించుకోవాలి), వాల్నట్స్-1 కప్పు (మెత్తగా మిక్సీ పట్టుకోవాలి), కొబ్బరి కోరు- పావు కప్పు, ఏలకుల పొడి-కొద్దిగా, నెయ్యి- పావు కప్పు, పంచదార-1 కప్పు (అభిరుచిని బట్టి మరికొంత పెంచుకోవచ్చు), పాలు-రెండున్నర కప్పులు, చాక్లెట్ పౌడర్-పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు-గార్నిష్ కోసం(అభిరుచిని బట్టి). తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. బౌల్లో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఏలకుల పొడి, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కొంత సేపు తర్వాత చాక్లెట్ పౌడర్, వాల్నట్స్ గుజ్జు వేసుకుని కలుపుతూ ఉండాలి. రవ్వ, కొబ్బరి కోరు వేసుకుని దగ్గర పడేదాక గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా నెయ్యి వేసుకుని బాగా దగ్గర పడేదాకా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ వాల్నట్ షీరా. అభిరుచిని బట్టి పైన మరిన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. -
ఛాలెంజ్ నెగ్గిన నాసా.. ‘స్పేస్’లో మిరపకాయలు?
అంతరిక్షంలో నివాస యోగ్యత గురించి పరిశోధనలు-ప్రయోగాలు ఎన్నేళ్లు సాగుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అయితే విశ్వంలోని కొన్ని మర్మాలను చేధించడం, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకు వేసింది. స్పేస్ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది. 15,000 వేలకోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మిరపకాయల్ని పండిస్తోంది నాసా. మెక్సికన్ రకానికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరప గింజలు ఈ జూన్లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్ కిమ్బ్రాగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు. కిచెన్ ఓవెన్ సైజులో ఉండే ‘సైన్స్ క్యారియర్’ అనే డివైజ్లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణించుకుంటోంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు, దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్గా తీసుకున్న నాసా.. సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన, రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు ‘స్పైసీ’ ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది. 🌶️ Chile peppers are spicing up the @Space_Station! Recently, @astro_kimbrough added water to NASA’s Plant Habitat-04 experiment. In less than 4⃣ months, @NASA_Astronauts will pick their first harvest. Follow along as these space peppers kick up the heat: https://t.co/KpCVpd850U pic.twitter.com/KS3qvRoz22 — NASA's Kennedy Space Center (@NASAKennedy) July 14, 2021
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement