-
జార్ఖండ్లో మందుపాతరకు 8 మంది బలి
డుమ్కా (జార్ఖండ్): జార్ఖండ్లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు పేట్రేగిపోయారు. డుమ్కా జిల్లాలోని డుమ్కా లోక్సభ స్థానానికి పోలింగ్ ముగిసిన అనంతరం వాహనంలో తిరిగి వెళ్తున్న పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా శక్తిమంతమైన మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు పోలింగ్ సిబ్బంది, ఇద్దరు పోలీసులు మృతి చెందారు. జిల్లాలోని షికారీపరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అస్నజోర్ సమీపంలో ఈ దాడికి పాల్పడ్డారు. ఆరో దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జార్ఖండ్లో డుమ్కాతోపాటు రాజ్ మహల్, గొడ్డా, ధన్బాద్ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. మరోవైపు, అసోంలోని కోక్రాఝర్ లోక్సభ స్థానం పరిధిలో ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారుల దాడిలో ఒక కానిస్టేబుల్ మృతిచెందాడు. -
ఉలికిపాటు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్లైన్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మందుపాతర పేల్చి పదకొండు మంది సీఆర్పీఎఫ్ జవానులను, నలుగురు పోలీసులను, ఒక పౌరుడిని హతమార్చడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఛత్తీస్గఢ్కు సరిహద్దుగా ఉండటం, జిల్లాలో దట్టమైన అడవులు ఉండటంతో మావోయిస్టులు ప్రవేశించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు సరిహద్దుల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే సార్వత్రిక, స్థానిక, మున్సిపల్ ఎన్నికలు ఉండటం, నక్సల్స్ అలజడి తోడవడంతో పోలీసులకు సవాల్గా మారింది. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఉందని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీ సులకు డీజీపీ ప్రసాద్రావు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని అనువణువు తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఠాణాలు ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పదకొండింటిని మావోయిస్టు ప్రభావిత ఠాణాలుగా గుర్తించారు. ఇందులో వాంకిడి, సిర్పూర్, బెజ్జూర్, దహెగాం, ఈద్గావ్, తిర్యాణి, నెన్నెల, కోటపల్లి, చెన్నూరు, నీల్వాయి, భీమినీ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పది బృందాలుగా ప్రత్యేక బలగాలతోపాటు, రెండు గ్రేహౌండ్స్ బలగాలను ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎనిమిది చెక్పోస్టులను ఏర్పాటు చేసి బందోబస్తు ఉంచారు. ఇందులో వాంకిడి వెంకటాపూర్, కొబ్బాయి, కరంజి, ఘన్పూర్, స్వర్ణ, బోరజ్, బెల్త్రోడాలు ఉన్నాయి. ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ టీంల కదలికలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి మావోయిస్టు యాక్షన్ టీంలు జిల్లాలో రెక్కీలు నిర్వహించే ప్రమాదం ఉన్నట్లు రాష్ట్ర పోలీసు శాఖ నుంచి జిల్లా పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసులతో జిల్లా పోలీసులు అందుబాటులో ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి 37 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యలాపాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ముగ్గురు దళ కమాండర్లు ఉండగా 20 మంది వరకు రాష్ట్ర, సెంట్రల్ కమిటీల్లో, మిలటరీ ప్లాటూన్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా మంది దళ సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లాకు సంబంధించిన మావోలు ఉండటంతో నిఘా పెంచారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని గడ్చిరోలి ప్రాంతంతోపాటు మిగతా ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానితులను విచారించేలా చర్యలు తీసుకుంటున్నారు. భయం.. భయంగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తమ వ్యూహాలను పదును పెడుతున్న రాజకీయ నేతల్లో కూడా మావోల కదలికలు భయం పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోటీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో నిలబడ్డ అభ్యర్థుల ప్రచారానికి వెళితే ఏం జరుగుతుందోనని ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. మరోవైపు అటవీ ప్రాంత గ్రామాల్లోకి ప్రచారం నిమిత్తం వెళ్లే రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం కూడా పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ప్రచారం సమయంలో పోలీసులకు సరైన వివరాలు తెలుపకుండా అటవీ ప్రాంత గ్రామాల్లోకి వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్నికలు, మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను మోహరించాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతోందని ప్రజలు, గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement