-
విమానంలో ‘బొద్దింక భోజనం’
ఎయిర్ విస్తారా ఎయిర్లైన్ సదుపాయాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము తినే ఆహారంలో బొద్దింక ఉందంటూ విస్తారా ఎయిర్లైన్ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్కు చెందిన నికుల్ సోలంకి ఎయిర్ విస్తారా ఎయిర్లైన్లో ప్రయాణించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే ప్రయాణ వివరాల్ని వెల్లడించని సోలంకి..ఫ్లైట్ జర్నీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ఎయిర్ విస్తారా ఫ్లైట్ జర్నీలో తాను ఆర్డర్ పెట్టిన ఇండ్లీ, సాంబార్, ఉప్మాలో చిన్న సైజు బొద్దింక ఉందని.. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Small cockroach in air Vistara meal pic.twitter.com/SHxFxB4qWv — NIKUL SOLANKI (@manikul008) October 14, 2022 ఆఫోటోల్ని షేర్ చేసిన పదినిమిషాల్లో ఎయిర్ విస్తారా యాజమాన్యం స్పందించింది. ‘హలో నికుల్, మా భోజనాలన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాల్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాం. మీ విమాన ప్రయాణ వివరాల్ని తెలపండి. తద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎయిర్ విస్తారా ట్వీట్ చేసింది. Hello Nikul, all our meals are prepared keeping the highest standards of quality in mind. Please send us your flight details over DM so we can look into the matter and address the issue at the earliest. Thank you. ~Badri https://t.co/IaDysdIxJS — Vistara (@airvistara) October 14, 2022 విస్తారాపై టాటా గ్రూప్ కన్ను విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కుకు సింగపూర్ ఎయిర్లైన్స్ సమాచారం ఇచ్చింది.కాగా, విస్తారాలో టాటా గ్రూప్కు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్లైన్స్కు 49 శాతం వాటా ఉంది. చదవండి👉 ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ విమానం ఎగిరింది -
పార్లమెంటులో ఎంపీలు తినే ఆహారంలో బొద్దింకలు.. పాకిస్థాన్లో దుస్థితి
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా దేశ పార్లమెంటు భవనంలో ఎంపీలు తినే ఆహారంలోనే బొద్దింకలు దర్శనమిచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీలు.. రెండు క్యాంటిన్ల నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఇస్లామాబాద్ జిల్లా అధికారులు పార్లమెంటు హౌస్లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. మేనేజ్మెంట్ అస్సలు పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించారు. కిచెన్లో ఆహారం పక్కన బొద్దింకలు ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే రెండు క్యాంటిన్లను సీజ్ చేశారు. ఈ రెండు క్యాంటిన్లలో నిర్వహణ బాగాలేదని, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఎంపీలు ఆరోపించారు. భోజనం కూడా రుచిగా లేదని ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అందుకే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడమే మానేసినట్లు పేర్కొన్నారు. పాక్ ఎంపీల ఆహారంలో బొద్దింకలు రావడం ఇది కొత్తేం కాదు. 2014లో సాస్ బాటిల్లోనూ బొద్దింకను చూసి ఓ ఎంపీ షాక్ అయ్యారు. అలాగే 2019లో ఇక్కడి క్యాంటిన్లలో ఆహారం బాగాలేదని, పరిశుభ్రత అసలు లేదని స్వయంగా ఎంపీలే నిరసనలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సిన దుస్థితి తలెత్తింది. చదవండి: Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..? -
విమాన భోజనంలో బొద్దింక
న్యూఢిల్లీ : విమానయాన సంస్థలు రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఒక్కసారి విమానంలో దోమలు, మరోసారి వారు అందించే ఆహారంలో పురుగులు, బొద్దింకలు. తాజాగా ఎయిర్ విస్తార విమానం ఆఫర్ చేసిన ఆహారంలో బొద్దింకను గుర్తించినట్టు ఓ ప్రయాణికులు మంగళవారం ఫిర్యాదు చేశాడు. అయితే ప్రయాణికుడి ఫిర్యాదుని ఆ విమానయాన సంస్థ కొట్టివేసింది. ట్విటర్ను వేదికగా తీసుకుని, తన ఆహారంలో బొద్దింక ఉందంటూ ప్రయాణికుడు ట్వీట్ చేశారు. బొద్దింకను చూసి తాను అవాక్కైనట్టు పేర్కొన్నాడు. ఆ ప్రయాణికుడు ట్వీట్కి సమాధానమిచ్చిన విమానయాన సంస్థ, ఆహారంలో ఎలాంటి కీటకాలు లేవు. ఎయిర్క్రాఫ్ట్ను ఎల్లప్పుడూ చెక్ చేస్తూనే ఉంటామని విస్తారా ఎయిర్లైన్స్ పేర్కొంది. అయితే తాము కలిగించిన అంతరాయానికి చింతుస్తున్నామని, ప్రతి రోజూ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ డోర్లను తెరచి ఉంచుతామని, కొన్నిసార్లు కీటకాలు లోపలికి చొరబడే అవకాశముందని, అయినప్పటికీ ఎప్పడికప్పుడూ తాము ఎయిర్క్రాఫ్ట్ను శుభ్రపరుస్తామని ఈ విమానయాన సంస్థ వరుస ట్వీట్లు చేసింది. కొన్ని రోజుల క్రితమే విమానంలో దోమలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని ఇండిగో సిబ్బంది కిందకి దించేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. -
విమానంలో 'కాక్రోచ్ మీల్'
న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో బొద్దింక దర్శనమిచ్చిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఎయిర్ ఇండియా విమానంలో్ హైదరాబాద్ కు చెందిన రాహుల్ రఘువంశీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా షికాగో వెళుతుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది. విమాన సిబ్బంది ఆఫర్ చేసిన భోజనంలో బొద్దింక కనిపించడంతో ఆందోళన చెందిన రాహుల్ ఈ విషయాన్ని ఫోటోతో సహా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఏఐ127 విమానంలో.. వెజిటిరేయన్ ఫూడ్ లో సిబ్బంది బొద్దింకలను వడ్డిస్తున్నారంటూ వాపోయారు. అయితే ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఎయిర్ఇండియా ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. ఎయిర్ ఇండియా తాము ఈ విషయాన్ని అస్సలు సహించమని, వెంటనే సంబంధిత చర్యల్ని తీసుకుంటామని ట్వీట్ చేసింది. సంబంధిత క్యాటరర్ కి నోటీసులు పంపామని ఎయిర్ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్, సీనియర్ మేనేజర్ ధనంజయ్ కుమార్ తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. .@airindiain now serves cockroach for vegetarian meals on AI127 #sicktomystomach #traumatized #cockroachinfood pic.twitter.com/SX1DR2Cufy — Rahul Raghuvanshi (@BostonNewsHound) November 16, 2016
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement