-
త్వరలో పీవీ నరసింహారావు పోస్టల్ స్టాంప్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్:: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం తపాళ బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరినట్లు ఆయన తెలిపారు. తన విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకొని పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సమాచార శాఖ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (అయ్యా నిజం చెప్పమంటారా...!) పీవీ దూర దృష్టి, సంస్కరణలు, సౌత్ ఈస్ట్ ఆసియాతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేశాయన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితగా పీవీ నరసింహరావును కిషన్ రెడ్డి అభివర్ణించారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలపాలన్న యోచనతోనే పీవీ పోస్టల్ స్టాంప్ విషయంలో చొరవ చూపినట్లు పేర్కొన్నారు. త్వరలో భారత ప్రభుత్వం పీవీ పోస్టల్ స్టాంప్ను విడుదల చేస్తుందని చెప్పారు. ఇది దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, గౌరవ చిహ్నంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. (అచ్చమైన భారత రత్నం) -
హిందుత్వ ఎజెండాలో మరో అంశం
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ఒక్కొక్క అంశాన్నే గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీస్తోంది. అందులో భాగంగానే 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన అయోద్య ఉద్యమానికి ఆద్యుడు, వ్యూహకర్త ఉత్తరప్రదేశ్లోని గోరఖ్నాథ్ టెంపుల్ దివంగత మహంత్ అవైద్యనాథ్ స్మారక స్టాంపును అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల స్టాంపులను నిలిపివేయాలని నిర్ణయించిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అవైద్యనాథ్ స్టాంపును విడుదల చేయడం సెక్యులర్ భారత్లో ఎంతవరకు సమంజసమే వాదన పుట్టుకొస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు కాస్తా భిన్నమైన కాషాయ రంగు దుస్తులను ధరించే మహంత్లు 1989లో జరిగిన అలహాబాద్ కుంభమేళాలో ఒక్కటయ్యారు. రెండు కాషాయ సంస్కృతులను మిలితం చేశారు. అక్కడే అయోధ్య ఉద్యమానికి నాంది పడింది. కుంభమేళా సందర్భంగా వీహెచ్పీ ఏర్పాటు చేసిన సాధువుల సమ్మేళనంలో అవైద్యనాథ్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ‘ఇతర మతాల పవిత్ర స్థలాల్లో ముస్లింలు మసీదులు నిర్మించరాదని ఖురాన్ చెబుతోంది. ముస్లింలతో గొడవెందుకు మరో స్థలంలో రామ మందిరాన్ని నిర్మించుకోవాల్సిందిగా ప్రభుత్వం మనకు చెబుతోంది. ఇది ఎలా ఉందంటే రావణాసురుడితో యుద్ధాన్ని నివారించడం కోసం రాముడు మరో సీతను పెళ్లి చేసుకోవాలన్నట్లు ఉంది. మనం మాత్రం అక్కడే రామ మందిరాన్ని నిర్మించాలి’ అని ఆయన నొక్కి చెప్పారు. బాబ్రీ మసీదున్న చోటనే మందిరం నిర్మించాలంటూ ఆరెస్సెస్, వీహెచ్పీ నాయకులు వంతపాడారు. ఆ దిశగానే సాధువుల సమ్మేళనం తీర్మానించింది. అలా మొదలైన అయోధ్య ఉద్యమానికి అవైద్యనాథ్ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వచ్చారు. 1992 డిసెంబర్లో అయోధ్యలో కరసేవకులను రెచ్చగొడుతూ ప్రసంగించిన వారిలో ఉమా భారతి, సాధ్వీ రితంబర, పరమహంస రాంచందర్ దాస్, ఆచార్య ధర్మేంద్ర దేవ్, బీఎల్ శర్మతోపాటు అవైద్యనాథ్ కూడా ఉన్నారు. 1989 వరకు పలు ఎన్నికల్లో హిందూ మహాసభ తరఫున పోటీ చేసిన అవైద్యనాథ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి, 1991, 1996లలో బీజేపీ తరఫున గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2014, సెప్టెంబర్ 12వ తేదీన చనిపోయారు. అంతకు దశాబ్దం క్రితం, 1914లోనే తన వారసుడిగా గోరఖ్నాథ్ టెంపుల్ మహంత్గా ఆదిత్యనాథ్ను ప్రకటించారు. ఇప్పుడు ఆధిత్యనాథ్ ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ప్రచారోద్యమాన్ని సాగిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement