-
యాంకర్ రవి యాడ్ షూటింగ్ కోసం భారీ సెట్టింగ్!
బిగ్బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు యాంకర్ రవి. ప్రస్తుతం ఈ స్టైలీష్ యాంకర్ ఓ కమర్షియల్ యాడ్లో నటించబోతున్నాడు. ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్తో కలిసి నటించబోయే ఈ యాడ్ .. ఓ వస్త్ర వ్యాపారానికి సంబంధించినది. దీని కోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ని వేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఓ సినిమా కోసం వేసేంత సెట్లో ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ జరగనుందట. ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ డైరెక్ట్ చేశారు. అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం. -
బాల్యం వారికిద్దాం బరువు మనం మోద్దాం
పెద్దవాళ్లు ట్రిమ్ చేస్తుంటే తీర్చిదిద్దినట్లు క్రోటన్ మొక్కల్లా పెరుగుతున్న పిల్లలు సహజమైన వికాస పరిమళాలను మాత్రం వెదజల్లలేకపోతున్నారు. ఇప్పుడొస్తున్న వాణిజ్య ప్రకటనలు ఈ పరిస్థితిని మార్చి పిల్లల్ని అర్థం చేసుకునేలా పెద్దల్నే తీర్చిదిద్దుతుండడం ఒక ఆరోగ్యకరమైన పరిణామం. నెస్లే.. మ్యాగీ నూడుల్స్ను ఇండియాలో మార్కెట్ చేయడానికి ఇక్కడి టీమ్ చాలానే కసరత్తు చేసిందట. అప్పటి దాకా మన దగ్గర నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ ఏవీ లేవు. నూడుల్స్ వంటి చైనీస్ ఫుడ్ మనింట్లో ఘుమఘుమలాడించిన దాఖలా అంతకన్నా లేదు. అలాంటి సంప్రదాయంలో మ్యాగీని ఎలా ఇమడ్చాలి? ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎలా తయారు చేయాలి? ‘‘పిల్లలు... యెస్ వాళ్లను టార్గెట్ చేస్తే..?’’ అనుకున్నారు నెస్లే ఇండియా అప్పటి మార్కెటింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ సంగీతా తల్వార్. పిల్లలకు ఏదైనా ఆటే. తినడం కూడా! స్పూన్తో తీసుకుంటూ ఉంటే నూడుల్స్ జారిపోతూ ఉండడం.. మళ్లీ వాటిని ఫోర్క్కు చుట్టుకోవడం నోట్లో పెట్టుకుని చివరి నూడుల్ను లోపలికి పీల్చుకోవడం.. పిల్లలు ఎంజాయ్ చేస్తారని అనిపించింది. పైగా అప్పుడు పిల్లల్ని ఏ యాడ్ ఏజెన్సీలూ పెద్దగా పట్టించుకోవడంలేదు.. పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే వాళ్లను పెట్టుకుని రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీని మార్కెట్ చేసి ఇప్పుడు పెద్దవాళ్లకూ ఫేవరేట్ అయ్యేంత ప్రాచుర్యంలోకి తెచ్చింది. మింగేస్తున్నాం పిల్లలు నిన్నమొన్నటిదాకా నెగ్లెక్టెడ్ కేటగిరీయే. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఇష్టాఇష్టాలు, వాళ్లవే అయిన ఆటలుపాటలు, వాళ్ల పరిశీలనలు, ఆసక్తులు, అభిరుచులను పట్టించుకుంటున్న పెద్దలు నేటికీ తక్కువే. వాళ్లు ఆడినా.. పాడినా.. అబ్బురపడేలా చేసినా.. వెనక పెద్దవాళ్ల బలవంతమే. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ల బాల్యాన్ని స్కెచ్ చేస్తున్నది పేరెంట్సే. క్లచెస్లో పెద్దవాళ్లకు నచ్చిన ఆకృతిలో పెరుగుతున్న క్రోటాన్ మొక్కలు. ఎప్పటికప్పుడు కొమ్మలు, రెమ్మలు కోతకు గురవుతూ చక్కటి తీరులో బాల్యం పెరుగుతోంది.. సహజ పరిమళాలను కోల్పోతూ! ఇక మన పెద్దవాళ్లం.. పిల్లలను ఊరించే మ్యాగీ పెద్దవాళ్లకూ ఆహారమైనట్టు పిల్లల కోసం ఏమీ మిగల్చకుండా వాళ్ల హక్కులను హరించేస్తున్నాం. మన అభిరుచులను వాళ్ల మీద రుద్దుతూ.. వారి బాల్యాన్నీ లాక్కుంటున్నాం. భావితరాల కోసం కించిత్తయినా చింతిస్తున్నామా? చింతన చేస్తున్నామా? ఇవి కావాలి ప్రకటనలకు చాలా ప్రభావం ఉంటుంది! మనమెలా ఉండాలో.. ఏం తినాలో.. ఎలా మసులుకోవాలో కూడా మార్కెటే నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే యాడ్స్. ఇప్పుడు అవి మానవసంబంధాలనూ వాడుకుంటున్నాయి. తప్పులేదు.. కమాడిటీతోపాటు ఓ విలువనూ సేల్ చేసే కమర్షియల్స్ ఇప్పుడు అవసరమే. క్యాడ్బరీ చాక్లెట్ యాడ్లా! అన్న హోంవర్క్ చేసుకుంటుంటాడు.. దగ్గర్లోనే తమ్ముడు.. టీపాయ్ మీద అయిపోయిన చాక్లెట్ రాపర్ పెట్టి కళ్లుమూసుకుని దేవుడికి దండంపెట్టుకుంటుంటాడు.. ‘‘దేవుడా.. ఇది తీసుకొని కొత్త చాక్లెట్ ఇవ్వూ’’ అని. కళ్లు తెరిచి చూస్తే ఖాళీ రాపరే కనిపిస్తుంది వెక్కిరిస్తున్నట్టుగా. ఏడుపు మొహం పెట్టుకొని మళ్లీ కళ్లు మూసుకుని వేడుకుంటాడు దేవుడిని. కళ్లు తెరుస్తాడు. చాక్లెట్. తమ్ముడి కళ్లు మెరుస్తాయి. అన్న దగ్గరకు పరిగెత్తుకెళ్లి.. దేవుడు చాక్లెట్ ఇచ్చాడు అని చెప్తాడు. ‘‘ఒక్కటేనా? నా కోసం కూడా ఎందుకడగలేదురా?’’ అంటాడు అన్న. ‘‘అయ్యో.. నెక్స్›్ట టైమ్’’ అని తుర్రుమంటాడు తమ్ముడు. అన్న మొహంలో నవ్వు. అప్పుడు వాళ్లమ్మ వచ్చి అడుగుతుంది.. ఆ ఖాళీ రాపర్ నన్ను పడేయమంటావా? నువ్వు పడేస్తావా?’’ అని. అన్న అమ్మను చూస్తాడు. తమ్ముడి కోసం అన్న చేసిన త్యాగం. అమ్మానాన్న నేర్పిన ప్రేమ. ఒకరికోసం ఒకరనే భావన! ముందు ఇంట్లో సిబ్లింగ్ రైవల్రీ లేకపోతే భారతీయులంతా సోదరసోదరీమణులే.. ద్వేషమంటే తెలియకుండా పెరుగుతారు కాబట్టి. ఈ విషయాన్ని పెద్దవాళ్లకూ చెప్పాలి. పేరెంటింగ్ నేర్పాలి. క్యాడ్బరీ యాడ్ అదే చేసింది. ఫస్ట్ కాదు బెస్ట్ ఇది క్లాస్మేట్ కంపాస్బాక్స్ యాడ్. లెక్కల్లో తక్కువ మార్కులు వస్తాయి పాపకు. ఫస్ట్ మార్క్స్ వస్తే చాక్లెట్ కేక్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది అమ్మ. అందుకే కేక్ చేయొద్దులే మార్కులు రాలేదు అంటుంది కూతురు స్కూల్నుంచి వస్తూనే నిస్సత్తువగా. అమ్మ రాత్రి అమ్మాయి అసైన్మెంట్ బుక్ చూస్తుంది. ప్రతిసారీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతూంటాయి. తెల్లవారి పాప బడికెళ్లే టైమ్కల్లా చాక్లెట్ కేక్ డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటుంది. బిడ్డ కళ్లు విప్పారుతాయి సంతోషంగా. అంతలోకే మొహం ముడుచుకుపోతుంది. ఫస్ట్ రాలేదు కదా కేక్ ఎందుకూ? అని అడుగుతుంది. బెస్ట్గా ఉన్నందుకు అంటుంది అమ్మ. లైఫ్లో ఫస్ట్ కాదు బెస్ట్గా ఉండాలన్న సందేశం ఆ యాడ్దే. అదీ అమ్మానాన్నల నోటి నుంచి రావాలి. మార్కులు, ర్యాంకుల్లో కాదు మానవత్వంలో ముందుండాలి. బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా బతికేలా పిల్లలకు నేర్పాలనే స్పిరిట్ను చాటే యాడ్ అది. పిల్లలు భవిష్యత్ తరాల బాగును ఆలోచించే రేపటి పౌరులుగా తయారు కావాలి. ఆ బాధ్యత పెద్దలుగా మనం ఇప్పుడు నిర్వర్తించాలి. బాల్యాన్ని వాళ్లకిద్దాం. బరువును మనం మోద్దాం. సమాజంలో పిల్లలు నెగ్లెక్ట్ అవకూడదు. వాళ్ల స్పేస్ను పెద్దలు ఆక్రమించకూడదు! ఈ విషయాన్నే ఇప్పుడొస్తున్న యాడ్స్ చక్కగా, మనసుకు హత్తుకునేలా చెబుతున్నాయి. – సరస్వతి రమ -
వారికే ప్రాముఖ్యతనిస్తా
అభిమానుల అభిరుచి మేరకే తన నటన ఉంటుందని కాజల్ అగర్వాల్ అంటోంది. టాలీవుడ్లో గోవిందుడు అందరి వాడే చిత్రం అందించిన విజయంతో మంచి జోష్లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో దుమ్మురేపుతోంది. చిత్రాల కంటే వీటికే అధిక ప్రాముఖ్యత నిస్తున్నట్లున్నారు. ఇకపోతే తమిళంలో జిల్లా చిత్రం తరువాత మరో అవకాశం లేదీ అమ్మడికి. అందుకు కారణం నిర్మాతల కళ్లు బైర్లు కమ్మే పారితోషికం డిమాండ్ చేస్తోందన్న టాక్ బాగా స్ప్రెడ్ అవడమే. ఈ విషయం అటుంచితే ఎవరైనా విజయవంతమైన చిత్రం తీయాలనే ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం పది చిత్రాల్లో ఒక చిత్రం మాత్రమే హిట్ అనిపించుకుంటోంది. దీని గురించి కాజల్ మాట్లాడుతూ అభిమానులు సోషియల్ నెట్వర్క్స్లో తన గురించి చేసే వ్యాఖ్యలకూ ప్రాముఖ్యతనిస్తానని వారి సలహాలను స్వీకరిస్తానంది. సినిమా జయాపజయాలనేవి అభిమానుల చేతుల్లోనే ఉంటాయని చెప్పింది. అందువలనే వారి అభిరుచికి అనుగుణంగా నటించడానికి ప్రయత్నిస్తానంది. తన నటనపై విమర్శలు చేస్తే తదుపరి చిత్రంలో ఆ కొరతలు లేకుండా జాగ్రత పడతానని తెలిపింది. అదే విధంగా తనకు ఎలాంటి కాస్ట్యూమ్స్ బాగుంటాయన్న విషయంలో వారి సూచనలను పాటిస్తానని కాజల్ చెప్పడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement