-
పొల్యూషన్కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్!
ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని చాలా వరకు కాలుష్య కారకాలే అని చెప్పాలి. హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో ఏదో రకంగా ప్లాస్టిక్, లెథర్ వంటి వస్తువులతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని లేకుండా చేసే వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో కొరతను భర్తీ చేస్తోంది ముంబైకి చెందిన సుప్రియ శిర్సత్ సతమ్. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఆయా ఫ్యాషన్ బ్రాండ్లను ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఆదరించారు. దీని ఫలితంగా గ్రామాల్లో ఉండే వేలమంది కళాకారులకు ఉపాధి లభించినట్లయ్యింది. సుప్రియ ఎలా ఈ రంగంలోకి వచ్చింది, ఆమె ఏవిధంగా వీటిని ఉత్పత్తి చేసిందంటే.. సుప్రియా ఇంతవరకు మార్కెట్లోకి రాని వేగన్కి సంబంధించిన ఫ్యాషన్ బ్రాండ్లు తీసుకురావాలని అనుకుంది. పర్యావవరణానికి హాని కలిగించనటువంటి మంచి ఉత్పత్తులు తీసుకుని రావాలనుకుంది. అందుకోసం సహజ ఫైబర్లతో చేసే ఉత్పత్తులను ప్రోత్సహించింది. అందులో భాగంగా అరటిచెట్టు బెరడు, వాటి పళ్ల తొక్కలతో తయారు చేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. తొలుత ముందుగా స్మాల్ కీపింగ్ యూనిట్(ఎస్కేయూ)గా ప్రారంభించింది. అవే ఇప్పుడు ముంబైలో 200 ఎస్కేయూ యూనిట్లుగా విస్తరించాయి. ప్రారంభంలో కార్క్ హ్యాండ్ బ్యాగ్లు, వాలెట్లతో ప్రారంభమైంది. ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన వాలెట్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను కూడా అందిస్తోంది. తన ఉత్పత్తులకు "ఫోర్ట్" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో కూడా ఈ బ్రాండ్కి మంచి స్పందన వచ్చింద. ఈ బ్రాండ్ రాజస్తాన్, మహారాష్ట, తోసహా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మంది గ్రామీణ మహిళా కళాకారులకు చేయూతనిచ్చింది. బ్రాండ్ ప్రారంభంలో కార్క్ హ్యాండ్బ్యాగ్లు మరియు వాలెట్లతో ప్రారంభమైంది మరియు ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు వాలెట్లు, టోట్ బ్యాగ్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ని విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధరించారు. సతమ్ నేపథ్యం.. సతమ్ మార్కెటింగ్లో ఎంబీఏ చేసిన ఇంజనీర్. జెట్ ఎయిర్వేస్లో మొబైల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. సతమ్కి కళ, క్రాప్ట్ అంటే మంచి ఆసక్తి ఉంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా హస్తకళాకారులతో పనిచేసే టెక్స్టైల్ రంగం కావడంతో ఆమె అనూహ్యంగా ఇటువైపుకి మళ్లింది. ఫ్యాషన్ పరంగా సౌందర్య సాధానాలు సహజసిద్ధమైన వాటితో తయారు చేయని బ్రాండ్లు లేకపోవడాన్ని గమనించింది. తానే ఎందుకు వాటిని ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ "ఫోర్ట్ బ్రాండ్". 2019లో కేవలం లక్షరూపాయలతో ఈ ఫోర్ట్ని ప్రారంభించింది. తాను సహజసిద్ధ ప్రొడక్ట్లను తయారు చేసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సతమ్. అరటిపండు వేసవికాలం, వానాకాలాల్లో అది జీర్ణమైనప్పడూ ఏర్పడే మచ్చల ఆధారంగా దీన్నే మెటీరియల్గా తీసుకోవాలని భావించానని చెప్పింది. హ్యాండ్ బ్యాగ్ల తయారీకి జంతువుల తోలుకి ప్రత్యామ్నాయం ఓక్ చెట్ల నారను ఉపయోగిస్తాం. ఇక అరటి చెట్టుని పండ్లను వినియోగించేసిన తర్వాత కొట్టేస్తారు కాబట్టి వాటి నారతో బ్యాగ్లు వ్యాలెట్లను తయారు చేస్తాం. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఇక ఆభరణాల విషయానికి వస్తే..బెరడులతో పింగాణీ, 18-క్యారెట్ బంగారం లేదా మిశ్రమ లోహం వంటి ఇతర ప్రీమియం మెటీరియల్ల కలయికతో విలక్షణంగా రూపొందిస్తున్నాం అని సతమ్ వివరించింది. బ్రాండ్ ధరలు ఎలా ఉంటాయంటే.. ఈ బ్రాండ్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ల ధర రూ. 4500 నుంచి 14,000 వరకు ఉంటుంది. ఇక ఆభరణాల ధర రూ. 800 నుంచి రూ. 17,000 వరకు ఉంటుంది.ఈ ఫోర్ట్ బ్రాండ్తో సతమ్ మంచి సక్సెస్ని అందుకుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఆరుగురు సభ్యలుతో కూడిన బృందంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ గడ్డి, జనపనారతో తయారు చేసే బ్రాండ్లతో పోటీపడుతుండటం గమనార్హం. ఈ ఫోర్ట్ బ్రాండ్ 2022లో ఉత్తమ వేగన్ వాలెట్ల పరంగా పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తన వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా అమలా ఎర్త్ వంటి సముచిత ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్ల ద్వారా కూడా విక్రయిస్తోంది. ఆఫ్లైన్లో కూడా విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విక్రయిస్తుంది. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
తొడిమలు తీస్తే... తాజా!
ఇంటిప్స్ బెండకాయలకు రెండు వైపులా ఉన్న తొడిమెలను తీసేసి వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి.అల్లం-వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది. ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథా కావు. అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తపడకుండా ఉంటాయి. -
రసం పీల్చే పురుగులతో అప్రమత్తంగా ఉండండి
పెనుమూరు: బొప్పాయి, బెండ, టమాట పంట లకు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయని, వీటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం పట్టు పరిశ్రమ శాఖ శాస్త్రవేత్త పద్మజ తెలిపారు. బుధవారం పెనుమూరు మండలంలోని సోమనందాపురం, కావూరివారిపల్లె తదితర గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పద్మజ మాట్లాడుతూ రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోపిడ్ 0.5 మిల్లీలు లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్పారు. బొప్పాయి తోటల్లో పిండినల్లి ఆశిస్తోంద ని, రోగార్ 2 మిల్లీలు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పంట సాగుకు ముందే విత్తనశుద్ధి చేపడితే తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టవచ్చని వివరించా రు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ మండలంలో సాగవుతున్న మల్బరీ తోట ల ద్వారా పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఎకరా పొలంలో మల్బరీ తోట సాగుకు సుమారు రూ.15 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖ ద్వారా మల్బరీ సాగు చేసిన రైతులను ప్రోత్సహించడానికి ఎకరాకు రూ.6,700 నగదు సబ్సిడీని చెక్కు రూపంలో అందిస్తోందని తెలిపా రు. తోట సాగుకు వేపపిండిని 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తోం దన్నారు. ఎకరా పొలంలో మల్బరీ తోట సాగు చేస్తే సుమారు 250 పట్టు గుడ్లును పెంచుకోవచ్చని చెప్పారు. రెండు నెలలకు ఓసారి 150 నుంచి 180 కిలోల పట్టు గూళ్లు ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మాణానికి పట్టు పరిశ్ర మ శాఖ రూ.లక్ష నగదు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. స్టాండ్లను రూ.16,500 సబ్సిడీపై ఇస్తున్నట్లు వెల్లడించా రు. పట్టు పురుగులు గూళ్లు కట్టే 250 నేత్రికలు రైతులకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. కిలో పట్టుగూళ్లు ఉ త్పత్తిచేస్తే రూ.50 సబ్సిడీ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ సాంకేతిక అధికారి వసంతరాయులు, మండల వ్యవసాయాధికారి సుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు జయంతి, నీలిమ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement