-
షాడో నిఘా! లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా.. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎత్తులు.. దానికి ప్రత్యర్థుల పైఎత్తులు మామూలే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఈ ఎత్తులు, పైఎత్తుల విషయంలో తిప్పలు పడుతున్నారు. ఓ వైపు తమ ప్రచారం కొనసాగిస్తూనే.. ప్రత్యర్థుల వ్యూహాలేమిటో తెలుసుకునేందుకు నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా కొందరు ఏకంగా ‘కోవర్ట్ ఆపరేషన్లు’ కూడా చేయిస్తున్నట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఎత్తులు తెలిస్తేనే పైఎత్తులు.. అసెంబ్లీ ఎన్నికలు జరిగాక ఆరు నెలల్లోపే లోక్సభ ఎన్నికలు రావడం ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రతి అభ్యర్థి కూడా.. ఎదుటి పార్టీలో, పోటీలో ఉన్న అభ్యర్థులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు. వారు ఎవరిని ఎలా కలుస్తున్నారు? ఏ హామీలిస్తున్నారు? ప్రలోభాల ఘట్టం ప్రారంభించారా? డంప్లు ఎక్కడ ఏర్పాటు చేశారు? వంటి అంశాలు తెలుసుకుని తిప్పికొట్టాలని.. ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుచరులకు ‘ప్రత్యేక’బాధ్యతలు ప్రత్యర్థులపై నిఘాకు, వ్యూహాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు కొందరు నమ్మకస్తులైన అనుచరులను ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నారు. వారు తమ అభ్యర్థి తరఫున పనిచేసినా, చేయకున్నా.. ఎదుటి అభ్యర్థి ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడమే పని. వారు మరికొందరిని సమీకరించుకుని ‘షాడో టీమ్స్’మాదిరిగా పనిచేస్తూ.. ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వారి వ్యూహాలేమిటన్నది తెలుసుకుని.. అభ్యర్థులకు సమాచారమిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలనూ ఆశ్రయిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు భారీగానే ఖర్చుపెడుతున్నారట. డంప్ల డేటా ‘లీక్’చేసేందుకు.. ప్రతి అభ్యర్థి తన ప్రత్యర్థులను వీలైనన్ని ఎక్కువ కోణాల్లో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం ప్రచార వ్యూహాలు మాత్రమేకాదు.. వారి ప్రలోభాల ‘డంప్స్’ల సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. మద్యం, నగదును ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తున్నది ఎవరు? అనే అంశాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. పోలీసులకు, ఎన్నికల సంఘానికి వాటి సమాచారం ఇప్పించడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తమ్మీద లోక్సభ ఎన్నికల ‘సిత్రాలు’ఎన్నో.. కోవర్టు ఆపరేషన్లకూ ప్లాన్! అభ్యర్థులు తాము ఎవరితో నిఘా పెట్టినదీ ప్రత్యర్థి పార్టీవారు గుర్తించకుండా ఉండాలి, లేకుంటే బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువు. పూర్తిగా కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండే అవకాశం తక్కువ. దీంతో కొందరు అభ్యర్థులు.. కోవర్ట్ ఆపరేషన్లు ప్రారంభించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యర్థుల వెంట ఉండేవారికి ఎర వేసి, వారి నుంచే సమాచార సేకరణ చేస్తున్నట్టు చెప్తున్నాయి. ఇలా కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ఇస్తున్నట్టు వివరిస్తున్నాయి. -
కోవర్టు లాబీయింగ్ చేశాయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రమోటర్లపై ఆరోపణలు గుప్పించిన ఓసీసీఆర్పీ తాజాగా పారిశ్రామిక దిగ్గజం అనిల్ అగర్వాల్కి చెందిన కంపెనీలు వేదాంత, కెయిర్న్ ఇండియాను టార్గెట్ చేసింది. పర్యావరణ చట్టాలను అనుకూలంగా మార్చుకునేందుకు వేదాంత కోవర్టు లాబీయింగ్ నడిపినట్లు కొత్తగా మరో నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం కూడా ప్రజలను సంప్రదించకుండా నిబంధనల మార్పులను ఆమోదించి, ‘అక్రమ పద్ధతుల్లో’ అమలు చేసినట్లు పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) విడుదల చేసిన నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు.. ► కొత్తగా పర్యావరణ అనుమతుల అవసరం లేకుండా దేశీయంగా ఉత్పత్తిని 50% వరకు పెంచుకునేందుకు మైనింగ్ కంపెనీలకు అనుమతినిస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత వేగవంతం కాగలదని 2021 జనవరిలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్కు లేఖ రాశారు. ► ‘‘2022 తొలినాళ్లలో పలు దఫాల సమావేశాల అనంతరం పర్యావరణ శాఖ నిబంధనలను సడలించింది. ప్రజాభిప్రాయాల సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచుకునేందుకు అనుమతించింది’’ అని ఓసీసీఆర్పీ తెలిపింది. ► వేదాంత తరహాలోనే దాని అనుబంధ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వ్యవహరించింది. చమురు అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను ఎత్తివేసేందుకు లాబీయింగ్ చేసింది. ► అధికార బీజేపీకి వేదాంత గణనీయంగా విరాళాలు కూడా ఇచి్చనట్లు (2016–2020 మధ్య కాలంలో రూ.43.5 కోటు)్ల ఆధారాలు ఉన్నాయని ఓసీసీఆర్పీ తెలిపింది. వేదాంత స్పందన ఇదీ.. ఓసీసీఆర్పీ ఆరోపణలను నిర్దుష్టంగా ఖండించకుండా వేదాంత స్పందించింది. ‘దిగుమతులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన విధానాల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సహజ వనరుల విషయంలో భారత్ స్వావలంబన సాధించడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పరిశీలన కోసం పలు విజ్ఞప్తులు చేశాము‘ అని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. -
'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్ కోవర్టులు, ఇన్ఫార్మర్లు ఉన్నారన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కాషాయదళంలో తీవ్ర కలకలానికి దారితీశాయి. బీజేపీలో నిజంగానే కేసీఆర్ ఇన్ఫార్మర్లు ఉన్నారా? ఉంటే అలాంటి నాయకులెవరు? కేసీఆర్కు, బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరిస్తున్నది ఎవరు? అసలు ఈటల ఉద్ధేశం ఏమిటన్న అంతర్గత చర్చకు కారణమయ్యాయి. ఈ సందేహాలను బలపర్చేలా ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్తున్నారంటూ కొందరు నేతల పేర్లు ప్రాథమిక చర్చల సమయంలోనే లీకవడంపై రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కోవర్టులను గుర్తించి, కట్టడి చేయడంపై బీజేపీ ముఖ్యులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. చేరికలకు ఇబ్బందిగా లీకులు రాష్ట్ర కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కొందరు నేతలు చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇటీవల ఆ పారీ్టలో రచ్చకు కారణమయ్యాయి. పార్టీ వర్గాలు చీలి పోయి, ఆరోపణలు ప్రత్యారోపణల దాకా పరిస్థితి వెళ్లింది. ఇదే సమయంలో బీజేపీ సహా అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ ఈటల రాజేందర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈటల ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచి్చందనే దాని నుంచి.. బీజేపీలో ఎవరు కోవర్టులనే దాకా ఆ పార్టీ నాయకుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ఇటీవల మీడియా ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఆఫ్ ది రికార్డ్గా ఈటల చేసిన వ్యాఖ్యలపైనా చర్చజరుగుతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ కనీ్వనర్గానూ ఈటల వ్యవహరిస్తున్నారు. అలాంటిది తానే స్వయంగా కోవర్టుల ఆరోపణలు చేయడం, బీజేపీలో చేరబోయే ఇతర పారీ్టల నేతల పేర్లు ముందుగానే లీక్ కావడంతో వారు వెనుకడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఏ రాజకీయ పారీ్టలోనూ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ లేదని.. బీజేపీలో కమిటీ ఏర్పాటు చేసినా చేరబోయే నేతల పేర్లు ప్రాథమిక దశలోనే ఎలా లీక్ అవుతున్నాయని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోవర్టుల కట్టడి ఎలా? ఒకవేళ బీజేపీలో కేసీఆర్ కోవర్టులు, ఇన్ఫార్మర్లు ఉంటే వారు ఏ స్థాయిలో ఉన్నారు? వారిని ఎలా గుర్తించాలనే చర్చ కూడా సాగుతోంది. అలాంటి వారిని ఆధారాలతో గుర్తించడంతోపాటు కట్టడి చేయడం, అవసరమైతే పక్కనపెట్టడం ఎలాగన్న ఆలోచనలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అయితే ఈ కోవర్టులు/ఇన్ఫార్మర్ల అంశం మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే తెరపైకి వచి్చంది. ఉప ఎన్నికను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాయి. అధికార పార్టీ అభ్యర్థిని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓడిస్తే.. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మరింత సానుకూలత వస్తుందని, బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆశించాయి. ఇక ఈ ఉప ఎన్నికలో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినా.. రాజగోపాల్రెడ్డి ఓటమి చెందడానికి కేసీఆర్ కోవర్టులే కారణమనే ఆరోపణలు వచ్చాయి. మునుగోడు పోలింగ్కు కేవలం కొన్నిరోజుల ముందు.. కొందరు నేతలు తిరిగి కేసీఆర్, కేటీఆర్ల సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. మునుగోడులో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలను కోవర్టుల ద్వారా తెలుసుకోవడం వల్ల పారీ్టకి నష్టం జరిగిందన్న చర్చ జరిగింది. ఇంకా అభ్యర్థుల కోసమే..! బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలలు కూడా లేదు. అయినా బీజేపీకి మెజారిటీ సీట్లలో బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట తప్పడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు వేసుకున్న అంచనాల ప్రకారం.. 30 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్థులు, మరికొన్నిచోట్ల ఫర్వాలేదనే స్థాయిలో అభ్యర్థులు ఉన్నారని.. చాలాచోట్ల గట్టి అభ్యర్థులను వెతకాల్సిన పరిస్థితి ఉందని అంటున్నాయి. బీజేపీలో టికెట్ కేటాయింపుపై భరోసా, ఇతర అంశాలపై స్పష్టత రానందునే.. నేతల చేరికలు ముందుకు పడటం లేదని పేర్కొంటున్నాయి. ఈటల ఉద్దేశమేమిటి? ‘ఆశించిన మేర బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి ముఖ్య నేతలు ఇంకా బీజేపీలో చేరకపోవడానికి కోవర్టు రాజకీయాలే ప్రధాన కారణమనే అభిప్రాయంతో ఈటల ఉన్నారా? లేక బీజేపీలో కుదురుకునే విషయంలో ఈటల ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు?’ అనే చర్చ బీజేపీలో నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్లో నంబర్–2గా ఉంటూ కేసీఆర్ పన్నే రాజకీయ వ్యూహాలు, ఆయా సందర్భాల్లో వ్యవహరించే తీరు తెలిసిన వ్యక్తిగా ఈటలకు బీజేపీ జాతీయ నాయకత్వం తగిన ప్రాధాన్యతే ఇస్తోందని పారీ్టవర్గాలు చెప్తున్నాయి. మరి ఆయన రాష్ట్రపారీ్టలో ఇంకా పూర్తిగా ఇమడలేకపోతున్నారా? తగిన గౌరవం, ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తితో ఉన్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది. -
తెలంగాణ ‘కమలం’లో కోవర్టులున్నారా?
అడవుల జిల్లా ఆదిలాబాద్లో కమలం పార్టీని కోవర్టుల భయం వెంటాడుతోందా? ప్రత్యర్థి పార్టీలతో కుమ్మకై పార్టీలోని బలమైన నేతల్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారా? కాషాయ సేనలో కోవర్టులను చేరదీస్తున్నదెవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో అసలేం జరుగుతోంది? బండి నడిపించాం, టికెట్ ఇవ్వండి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మల్ జిల్లాలో జరిపిన ప్రజా సంగ్రామ యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వారిలో బలాన్ని పెంచింది. జిల్లా అంతటా నిర్వహించిన సభలు, సమావేశాలతో కేడర్కు ఊపునిచ్చింది. భారీగా తరలివచ్చిన ప్రజలు కమలం పార్టీ పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో పార్టీ టిక్కెట్ వస్తే చాలు.. విజయం సాధించడం ఖాయమనే నమ్మకం నాయకుల్లో కలిగించింది. దీంతో అనేక మంది నాయకులు ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు సైతం తమకు కూడా టిక్కెట్ ఇస్తే గెలిచి చూపిస్తామంటూ రాష్ట్ర నేతల దగ్గర పైరవీలు చేస్తున్నారని టాక్. టిక్కెట్ల కోసం పెరుగుతున్న పోటీ.. పార్టీని డ్యామేజ్ చేయాలనుకునేవారికి అవకాశం కలిగిస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం పార్టీ కోసం కష్టపడుతూ.. కచ్చితంగా టిక్కెట్ పొందడానికి అర్హత ఉన్న నేతల్లో ఆందోళన పెంచుతోంది. టికెట్ మాత్రం నాకే.. ముథోల్ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్రకు ముగ్గురు నేతలు ఒకరిని మించి మరొకరు జనసమీకరణ చేశారు. అదేవిధంగా టిక్కెట్ తనకే దక్కుతుందని ముగ్గురూ ప్రచారం చేసుకుంటున్నారట. నేతలంతా వర్గాలుగా విడిపోయి నియోజకవర్గంలో పట్టు బిగిస్తూ.. తమ వ్యతిరేకుల్ని చిత్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గంలో కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్తో పాటు మరో ముగ్గురు పోటీ పడుతున్నారు. నలుగురూ నాలుగు వర్గాలుగా చీలిపోయారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి అనుభవం ఉన్న రమేష్ రాథోడ్ బలమైన అభ్యర్థిగా పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిందట. అయితే రమేష్ రాథోడ్కు టిక్కెట్ ఇస్తే మిగిలిన వారు పనిచేయరనే టాక్ వినిపిస్తోంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడించేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారట. ఈ విషయమై రమేష్ రాథోడ్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మా వాడికి టికెట్ ఇవ్వాల్సిందే.. బోధ్ నియోజకవర్గానికి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. తన నియోజకవర్గంలో ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి దశరథ్కు మద్దతిస్తున్నట్లు సమాచారం. దశరథ్ కూడా టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇక జిల్లా కేంద్రం ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీకి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ సుహసినిరెడ్డి, ఎన్అర్ఐ కంది శ్రీనివాస్ తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీ నాయకత్వం ఏ పిలుపునిచ్చినా కలిసి పనిచేయలేని పరిస్థితులు జిల్లా కమలం పార్టీ నాయకుల మధ్య ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయట. ఇటీవల బండి సంజయ్ సమక్షంలోనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత మంది పోటీ పడుతున్న ఈ పరిస్థితుల్లో ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలినవారు పనిచేయరనే టాక్ వినిపిస్తోంది. ఒకరికి టికెట్ ఇస్తే.. ఇంకొకరు ఓడిస్తారు ఇక పూర్తిగా ఆదివాసీల కోట ఆసిఫాబాద్ నియోజకవర్గంలో.. ఆదివాసీ, లంబాడ వర్గాల నేతలు టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. ఇక్కడ ఆదివాసీలే గెలుపోటములు నిర్ణయిస్తారు. ఆదివాసీ నేత విజయ్కుమార్.. లంబాడా వర్గం నేత ఆత్మారామ్ నాయక్ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆత్మారామ్ గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అయినా ఈసారి కూడా తనకే టిక్కెట్ ఇస్తారంటూ ఆయన ధీమాగా ఉన్నారు. ఇక సిర్పూర్ కాగజ్ నగర్లో పోటీ పడుతున్న ఇద్దరు నేతల మధ్య సర్దుబాటు చేసినా.. కుదరడంలేదట. ఈ విధంగా ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీలో బహుముఖ పోటీలు రాష్ట్ర నాయకత్వాన్ని చికాకు పెడుతున్నట్లు సమాచారం. ఒకరికి టిక్కెట్ ఇస్తే.. టిక్కెట్ రానివారు కచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ చేసి.. తమ పార్టీ అభ్యర్థినే ఓడించేందుకు ప్రయత్నిస్తారని కమలం నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వేధిస్తున్న ఈ సమస్యను కాషాయ పార్టీ నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
నేనెట్ల కోవర్టునయిత?: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనను కోవర్టుగా పార్టీ నాయకులే కొందరు అభివర్ణిస్తున్నారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు కె.జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. రుణ మాఫీపై రైతుల నుంచి దరఖాస్తు చేయించడం, ఫీజు రీయింబర్స్మెంట్పై విద్యార్థులతో దరఖాస్తు చేయించాలని టీపీసీసీ తీసుకున్న ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. నెలరోజుల పాటు గ్రామాల్లో రైతుల నుంచి, విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, దీనికి ప్రస్తుత జిల్లాల వారీగా బాధ్యులుగా ముఖ్యనేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టడంపై పార్టీ ముఖ్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తి వెలిబుచ్చినట్లుగా తెలిసింది. ఇదే సందర్భంలో జానారెడ్డి మాట్లాడుతూ.. తనపై కొందరు పార్టీ నేతలే అనుచితంగా మాట్లాడుతున్నారని, కోవర్టునంటూ తననుద్దేశించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కోవర్టంటూ తాను మాట్లాడలేదని వి.హనుమంతరావు సమాధానం ఇవ్వడంతో ఈ చర్చ సద్దుమణిగింది. రేవంత్ విమర్శల గురించి కాంగ్రెస్పార్టీ ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టుగా సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement