-
ఆకతాయి చేష్టలు...పంటలు బుగ్గిపాలు
కడప అగ్రికల్చర్: ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల, విద్యుత్ షార్ట్సర్క్యూ వల్ల మామిడి, కంది, టమాటా, బుడ్డశగన పంటతోపాటు, వర్మీకంపోస్టు యూనిట్లు, డ్రిప్ పరికరాలు బుగ్గిపాలవుతున్నాయి. దీంతో రైతన్నలు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. విత్తనం మొదలుకొని పంట నూర్పిళ్ల దాకా అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు రాత్రింబవళ్లు స్వేదాన్ని చిందించి శ్రమించినా తీరా పంట దిగుబడులతో మంచి ఆదాయాన్ని పొందుతామనుకున్న తరుణంలో ఇలా అగ్గిపాలవుతుండడాన్ని అన్నదాత తట్టుకోలేకపోతున్నాడు. అడవులకు నిప్పుపెడితే కేసులు పెడతామని బీరాలు పలికిన అటవీశాఖ అధికారులు ఆకతాయిల ఆగడాలను చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదని రైతు సంఘాలు బాహటంగా విమర్శిస్తున్నాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, టి. సుండుపల్లె, చిన్నమండెం, పెద్దముడియం, బి.కోడూరు, ఓబుళవారిపల్లె, పుల్లంపేట మండలాల సమీపంలో కొండ, గుట్టలున్నాయి. ఈ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయతోటలు, బుడ్డశగన పంట సాగులో ఉన్నాయి. రెండు నెలలుగా ఏదో ఒక చోట పంటతోటలు, చేలు తగలబడుతూనే ఉన్నాయి. దీనికి తోడు తుంపర, బిందు సేద్య పరికరాలు అగ్గిపాలయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీన రామాపురం మండలం చిట్లూరు దళితవాడకు చెందిన కౌలు రైతులు గంపాల వెంకటసుబ్బమ్మ, బాలిపోగు గంగమ్మ, చిన్నికృష్ణయ్య, వెంకటరమణ, ముసలిరెడ్డిపల్లెకు చెందిన రైతులు చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లకు చెందిన 150 ఎకరాల మామిడి చెట్లు, 30 ఎకరాల్లో సాగుచేసిన కందిపంట కాలిపోయింది. దీనికి ప్రధాన కారణం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నిప్పులు ఎగసిపడటమే. దీనివల్ల దాదాపు రూ.10లక్షల మేర నష్టం సంభవించింది. అదే నెల 6వ తేదీన రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన కాటిగారి ప్రతాప్రెడ్డికి చెందిన 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కుప్ప కాలిపోయి రూ.2.50 లక్షల నష్టపోయినట్లు రైతు ఆవేదనతో తెలిపారు. ఆ నెల్లోనే 5వ తేదీన సంబేపల్లె మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన యువరాజా నాయుడు, రెడ్డి నారాయణకు చెందిన 30 ఎకరాల మామిడితోట దగ్ధమై రూ.12లక్షలు నష్టపోయినట్లు తెలిపారు. ఫిబ్రవరి1వ తేదీన లక్కిరెడ్డిపల్లె మండలం కాకుళారం గ్రామానికి చెందిన రైతు కత్తి రామచంద్ర, కత్తి వెంకటరమణ, గొర్లవీరుకు చెందిన 150 మామిడి చెట్లు ఆకతాయి చేష్టల వల్ల కాలిపోయాయి. దీంతో పాటు వర్మీకంపోస్టు యూనిట్ కూడా కాలిపోవడంతో మొత్తం రూ.5లక్షలు నష్టం సంభవించినట్లు రైతులు తెలిపారు. జనవరి నెల 28వ తేదీన పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి చెందిన రైతులు కటారి జకరయ్య, కటారి ప్రభాకర్ 5 ఎకరాల్లోని బుడ్డశనగ కట్టె కల్లంలో దగ్ధం అయిందని, ఈ ప్రమాదం వల్ల రూ.1.20లక్షలు నష్టపోయామని వాపోయారు. ఫిబ్రవరి 21వ తేదీన ఓబుళవారిపల్లె మండలం పెద్ద ఓరంపాడు గ్రామ మహిళా రైతు ఆళ్ల నరసమ్మకు చెందిన 2 ఎకరాల్లోని అరటి తోట, బోరు మోటారు, టేకు చెట్లు, కొబ్బరి చెట్లు, వర్మీకంపోస్టు యూనిట్టు కాలిబూడిదయ్యాయి. దీని కారణంగా రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత మహిళా రైతు వాపోయారు. ఈ రైతులేకాదు జిల్లాలో చాలా మంది పంటలు అగ్నికి ఆహుతై పోవడంతో ఏమి చేయలేని స్థితిలో ఆందోళన చెందున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు గుట్టలకు, కొండలకు ఆకతాయిలు నిప్పుపెట్టకుండా నిరోధించాల్సిన ఫారెస్టు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కొండలు, గుట్టల సమీపాన ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉన్నా అలా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏటా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఎందుకు నష్టాలు సంభవిస్తున్నాయనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అగ్నికి ఆహుతైన ఉద్యాన, వ్యవసాయ పంటలకు ప్రకృతి వైవరీత్యాల పథకంలోనైనా సాయం అందించాలని ప్రభుత్వానికి రైతులు విన్నవించుకుంటున్నారు. -
మనస్తాపంలో 8ఎకరాల పంటను తగులబెట్టిన రైతు
వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని అన్నదాత బతుకు నానాటికీ అధ్వానంగా తయారవుతోంది. ఏటికేడాది అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి రైతుల కంట కన్నీరొలికిస్తున్నాయి. దొరికిన దగ్గర అప్పులు తెచ్చి, ఇంటిలో ఉన్న కాడికి బంగారాన్ని కుదువ పెట్టి ఆరుగాలం స్వేదం చిందించి పంట పొలాన్నే నమ్ముకునే రైతన్న ఏటా ఏదోలా దగా పడుతున్నాడు. రాయగడ జిల్లాకు చెందిన ఓ రైతు కష్టం, పెట్టుబడి అక్కరకు రాకుండా పోవడంతో కడుపుమండి పండించిన పంటను తగులబెట్టాడు. రాయగడ: రాయగడ జిల్లా గుణుపురం సబ్డివిజన్ రామన్నగుడ సమితి గజ్జిలిగుడ గ్రామానికి చెందిన రైతు ఎన్.అనంతరావు తన 8ఎకరాల వరిపంటను గురువారం తగులబెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనంతరావు 8 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా పంట కోత దశకు వచ్చే సమయానికి సరైన ధాన్యం పండకుండా పొల్లు ధాన్యం పండాయి. అలాగే ధాన్యపు పంటకు బీబీహెచ్, చొకొడొ పురుగు పట్టడంతో వ్యవసాయం పూర్తిగా నష్టపోయాడు. ఇప్పటికే అనంతరావు తన బంగారాన్ని గుణుపురం ఇండియన్ బ్యాంక్లో కుదువ పెట్టాడు. అలాగే కుజేంద్రి బ్యాంక్లోను, రామన్నగుడలో వ్యవసాయ రుణాలు చేసి మదుపులు పెట్టాడు. వరికి పురుగు పట్టడంతో వ్యవసాయశాఖ అధికారుల సలహా తీసుకుని పురుగు మందులను వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెంది పంటకు నిప్పు అటించాడు. విషయం తెలుసుకున్న గ్రామప్రజలు నిప్పును ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే ఈ ఘటనపై రామన్నగుడ బీడీఓ గులాంమక్సద్, ఇతర అధికారుల బృందం ఘటటాస్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఈ సందర్భంగా రైతు అనంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అధికారుల ముందు వాపోయాడు. దీంతో బీడీఓతో సహా వ్యవసాయ శాఖ అధికారులు అనంతరావుకు కీటక నాశన మందులు సరఫరా చేసిన మందుల దుకాణంపై దాడులు చేయగా ఆ పురుగు మందులు నకిలీవని తెలియవచ్చింది. దీనిపై బీడీఓ విచారణ జరిపి జిల్లా అధికారులకు నివేదిక పంపనున్నారు. -
తాడేపల్లిలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు
గుంటూరు (తాడేపల్లి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిరావూరు గ్రామంలో కరెంటు తీగలు తెగి మంటలు చెలరేగటంతో అరటి తోట దగ్ధం కాగా, పాతూరులో గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న తోటకు నిప్పుపెట్టారు. కుంచనపల్లిలో శ్రీనివాస్రావు అనే రైతుకు చెందిన ఆకుకూర పంటకి నిప్పుపెట్టటంతో పంట బుగ్గిపాలయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న పలగాని వెంకటేశ్వరరావుకి చెందిన ద్విచక్ర వాహనం కూడా కాలపోయింది. గుండెమడ, చిరావూరు మధ్యలో కృష్ణా నదిలోని ఇసుక దిబ్బలో ఉన్న 25 ఎకరాల విస్తీర్ణంలోని పశుగ్రాసానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పూర్తిగా కాలిపోయింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగించొద్దు! హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement