-
ఎయిరిండియా నడి విమానంలో మలమూత్రవిసర్జన.. అరెస్ట్
ముంబై: విమాన ప్రయాణికుల అనుచిత/అభ్యంతరకర ప్రవర్తనల ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా గగనతలంలో ఉన్న ఎయిరిండియా విమానంలో.. అదీ నడి విమానంలో ఓ ప్రయాణికుడు మలమూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందికి గురైన ప్రయాణికులు ఆందోళన చేపట్టగా.. సదరు ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. సోమవారం పోలీసులు రిలీజ్ చేసిన ఎఫ్ఐఆర్లో.. జూన్ 24వ తేదీన ముంబై-ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐసీ 866 ప్రయాణంలో ఉంది. అయితే.. విమానం తొమ్మిదో వరుసలో సీట్ నెంబర్ 17ఎఫ్లో కూర్చున్న రామ్ సింగ్ అనే ప్రయాణికుడు ఈ పని చేశాడు. మద్యం మత్తులోనే అతను ఈ చర్యకు దిగాడు. అతని చర్యతో ప్రయాణికులు ఇబ్బంది పడి.. సిబ్బంది వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అతని అనుచిత ప్రవర్తన గుర్తించిన విమాన సిబ్బంది హెచ్చరించడంతో పాటు పైలట్ ఇన్ కమాండోకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం ఎయిర్పోర్ట్కు వెళ్లగా.. దిగగానే రామ్సింగ్ ఎయిరిండియా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. ఐపీసీలోని సెక్షన్లు 294, 510 ప్రకారం అతనిపై కేసు నమోదు అయ్యింది. ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్లో పూరీ జగన్నాథుడు.. తీవ్ర దుమారం -
సుఖంగా తెల్లవారాలంటే...
కొందరికి ప్రతిరోజూ ఉదయమే మలవిసర్జన నరకప్రాయంగా అనిపిస్తుంటుంది. ఆ పనికాస్తా సాఫీగా సాగితే రోజంతా హాయిగా ఉంటుంది. కానీ మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారంలో జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు మలబద్దకం సమస్యను మరింత పెంచుతున్నాయి. కేవలం రోజూ తినే పండ్లు ఇతర ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. యాభై ఏళ్లు దాటిన ప్రతి పురుషుడికీ ప్రతిరోజూ 38 గ్రాములు, అదే మహిళ అయితే 25 గ్రాముల పీచు పదార్థాలు అవసరం. మన మలం పలచగా ఉండాలంటే పెద్దపేగులో నీరు ఉండాలి. పీచు ఉన్న పదార్థాలు ఆహారంలో ఉంటే గనక, ఆ ఆహారం జీర్ణమై, శరీరంలోకి ఇంకే ప్రక్రియలో... ఉన్న నీరంతా పేగులు లాగేయకుండా ఈ పీచు అడ్డు పడుతుంది. అందుకే మలం మృదువుగా ఉండి, విరేచనం సాఫీగా అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కనీసం ప్రతిరోజూ 20 - 35 గ్రాముల పీచు ఉండాలి. దానికోసం స్వాభావికంగా పీచు లభ్యమయ్యే ఈ ఐదు ఆహార పదార్థాలు మీ భోజనంలో ఉండేలా చూసుకోండి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement