-
సొంతింటి కల నిజం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో..!
ఇప్పుడున్న టాలీవుడ్ ఫ్యాన్స్కు ఈ పరిచయం అక్కర్లేని పేరు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు చిత్రంలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం మూవీతో ఫేమ్ తెచ్చుకున్నారు. అనంతరం సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ అంటూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. (ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!) ఇకపోతే సొంతింటి కల అనేది సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక మైల్స్టోన్. అయితే తాజాగా మన హీరో కిరణ అబ్బవరం సొంతింటి కలను నిజం చేసుకున్నారు. కానీ కిరణ్ తన సొంత ఊర్లోనే ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
హమ్మయ్యా.. అమ్మ కల నెరవేరింది
ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్రూమ్ అపార్ట్మెంట్కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. -
రూ.300 కోట్లతో హీరో ధనుష్ డ్రీమ్ హోమ్!
స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం తమిళనాటనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో తనకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారిగా డైరెక్ట్ తెలుగు ఫిలిం చేస్తున్నాడీ హీరో. టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సార్ సినిమా చేస్తున్నాడు. అటు తమిళ, హిందీలోనూ పలు ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. ఇటీవలే భార్య ఐశ్వర్య రజనీకాంత్కు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచాడు ధనుష్. అప్పటినుంచి అతడు హోటల్లోనే బస చేస్తున్నట్లు వార్తలు రాగా తాజాగా మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెన్నైలో ధనుష్ విలాసవంతమైన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడట! దీనికోసం అతడు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడట! ఇదే నిజమైతే 300 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక సౌత్ హీరోగా ధనుష్ రికార్డు సృష్టించడం ఖాయం. కాగా ధనుష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరితో చేస్తున్న రెండు సినిమాలకు కలిపి మొత్తంగా రూ.100 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బునంతా కూడా తన లగ్జరీ ఇంటి కోసమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం! -
ముంబైలో కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే
Pooja Hegde : సొంత ఇల్లు కట్టుకోవాలనే కల అందరికీ ఉంటుంది. ఆ కలను జీవితంలో తొందరగానే నిజం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. ముంబైలో ఆమె ఓ ఇల్లు కొన్నారు. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్, కలర్ వంటి విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘‘నా కలలను నిర్మించుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు పూజ. చదవండి: జార్జ్ ఎవరెస్ట్ను ఎక్కిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘భాయిజాన్’, రణ్వీర్ సింగ్తో ‘సర్కస్’ చిత్రాలు చేస్తున్నారు పూజ. సౌత్లో మహేశ్ బాబు, ప్రభాస్, పవన్ కల్యాణ్, విజయ్ చిత్రాలకు ఇచ్చిన కమిట్మెంట్తో పూజా హెగ్డే డైరీ నిండుగా ఉంది. అందుకే పూరి జగన్నాథ్ భార్య అంటే ఇష్టం: ప్రభాస్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
భార్యకు ప్రేమతో.. కేవలం 24 గంటల్లోనే!
బెంగళూరు: భార్య మీద ప్రేమతో ఆమెకు అపురూప కానుక ఇవ్వాలని భావించాడు ఓ వ్యాపారి. అందుకోసం భార్య పుట్టినరోజున ఆమెకు ఓ కొత్త ఇల్లు కట్టివ్వాలని, కేవలం ఒకరోజు లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆమె కళ్లల్లో ఆనందం చూడాలని ఆశ పడుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. కొడగుకు చెందిన వ్యాపారి త్యాగ్ ఉతప్ప కాఫీ పంటల పెంపకం కూడా చేస్తుంటారు. జూలై 16న ఉతప్ప భార్య పుట్టినరోజు కావడంతో ఆమెకు ఓ తక్కువ వ్యవధిలో ఓ ఇంటిని నిర్మించి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం దాదాపు రూ.70-80 లక్షల మేర ఖర్చు చేయనున్నారు. అయితే 24 గంటల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకోవాలన్న తాపత్రయం ఆయనలో ఉంది. దీంతో ఆ స్పెషల్ డ్రీమ్ హోమ్ కోసం బెంగళూరుకు చెందిన రెబల్ డిస్రప్టీవ్ బిల్డింగ్ టెక్నాలజీస్ అనే కంపెనీతో మాట్లాడుకున్నారు. ఇంటిని రికార్డు సమయంలో పూర్తి చేయించి ఆమె పుట్టినరోజు కానుక ఇచ్చి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని వ్యాపారి త్యాగ్ ఉతప్ప అన్నారు. 2,400 గజాల స్థలంలో నిర్మించనున్న ఈ ఇంట్లో మూడు బెడ్రూమ్లు ఏర్పాటుచేస్తారు. బెంగళూరు, టిఅగ్రహారలో స్టోన్హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఈ ఇంటి నిర్మాణానికి అంతా సిద్ధం చేశారు. ఈ నిర్మాణానికి సిద్ధంగా ఉండే (ప్రీకాస్ట్) అచ్చులను వినియోగిస్తారు. 'సరిగ్గా జూలై 15న ఏ సమయానికి నిర్మాణం చేపడతామో 16న అదే సమయంలోపే డ్రీమ్ హోమ్ నిర్మాణం పూర్తి చేయాలని వ్యాపారి చెప్పారు. ఇప్పటికే అచ్చులతో పాటు రంగులు, లైట్లు, టైల్స్, అలంకరణ సామాగ్రి, ఇతరత్రా ముడి సరుకులను ఏర్పాటు చేశాం. కేవలం 24 గంటల్లోనే ఇంటిని నిర్మిస్తాం. ఖర్చుకు మాత్రం ఓనర్ వెనుకాడలేదని' కాంట్రాక్ట్ కంపెనీ చీఫ్ ప్యాడీ మీనన్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement